US: నేరాలకు పాల్పడితే కఠిన ఆంక్షలు.. విదేశీయులకు అమెరికా ఎంబసీ వార్నింగ్
- నేరాలకు పాల్పడితే కఠిన ఆంక్షలు
- విదేశీయులకు అమెరికా ఎంబసీ వార్నింగ్
భారత సంతతికి చెందిన ఒక మహిళ అమెరికా స్టోర్లో దొంగతనానికి పాల్పడింది. ఏడు గంటల పాటు స్టోర్లో తిరిగి రూ.లక్షకు పైగా వస్తువులను దొంగింలించింది. డబ్బులు చెల్లించకుండా బయటకు వెళ్లిపోతుండగా పట్టుబడింది. ఈ నేపథ్యంలో అమెరికా ఎంబసీ.. విదేశీయులకు వార్నింగ్ ఇచ్చింది. యూఎస్ వీసాలకు దరఖాస్తు చేసుకునే వారికి ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం తాజా హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాలో నేరాలకు పాల్పడేవారు అమెరికాకు రాకుండా శాశ్వత ఆంక్షలకు గురవుతారని హెచ్చరించింది. అగ్ర రాజ్యంలో భారతీయ మహిళ దొంగతనం చేస్తూ దొరికిపోయిన నేపథ్యంలో అమెరికా ఎంబసీ ఈ హెచ్చరిక జారీ చేసింది.
ఇది కూడా చదవండి: Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రత్యేక కథనం! ఏం తేల్చిందంటే..!
Also Read
- Viral Video: భారత్ వస్తున్న నౌకను ఇరాన్ ఎలా సీజ్ చేసిందో చూడండి..
- Islamabad in Lockdown: 10 రోజులుగా లాక్డౌన్లో ఇస్లామాబాద్.. తిట్టిపోస్తున్న పాక్ ప్రజలు..
- Iran Mocks Trump: ‘‘షట్ అప్, ట్రంప్’’.. హైదరాబాద్ ఇరాన్ కాన్సులేట్ సెటైర్లు..
- Trump-Iran: ‘‘ట్రంప్.. నోర్మూయ్’’.. సీజ్ఫైర్ పొడిగింపుపై ఇరాన్ సెటైర్ వీడియో
భారతీయ పౌరురాలు ఇల్లినాయిస్ టూరిస్ట్ వీసాపై అమెరికాకు వెళ్లింది. అక్కడ టార్గె్ట్ రిటైల్ స్టోర్కు వెళ్లింది. మా అయితే స్టోర్లో ఒక గంట.. రెండు గంటల్లో పని పూర్తవుతుంది. కానీ ఇల్లినాయిస్ ఏకంగా ఏడు గంటల పాటు స్టోరీలోనే ఉంది. ట్రాలీలో రూ.లక్షకు పైగా వస్తువులను వేసుకుని బయటకు జారుకుంటోంది. సిబ్బంది గమనించి పోలీసులకు సమచారం ఇచ్చారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమె దానికి బిల్లు చెల్లించింది. అయితే దొంగతనంపై స్టోర్ యాజమాన్యం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అలాగే పోలీసులు కూడా అరెస్ట్పై అధికారికంగా ఏం వెల్లడించలేదు. అయితే ఇందుకు సంబంధించిన దృశ్యాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇది కూడా చదవండి: Rajasthan: రాజస్థాన్లో ఘోరం.. గుండెపోటుతో 4వ తరగతి విద్యార్థి మృతి
ఈ నేపథ్యంలోనే నేరాలకు పాల్పడితే న్యాయపరమైన సమస్యలే కాదు.. దానివల్ల మీ వీసా రద్దయ్యే ప్రమాదం ఉందని అమెరికా ఎంబసీ హెచ్చరించింది. భవిష్యత్తులో అమెరికా వీసాలకు దరఖాస్తు చేసుకునే అర్హతను కోల్పోతారని వార్నింగ్ ఇచ్చింది. శాంతిభద్రతలకు అమెరికా అత్యంత విలువనిస్తుందని… విదేశీయులు కూడా అమెరికా చట్టాలను తప్పనిసరిగా పాటించాలని ఎంబసీ కోరింది.
తాజావార్తలు
-
Darling Re-release: రీ-రిలీజ్లో ‘డార్లింగ్’ విధ్వంసం.. మైండ్ బ్లాకింగ్ కలెక్షన్స్!
-
OMG: ఆడుకుంటూ గంగాళంలో ఇరుక్కున్న చిన్నారి.. చివరి ప్రయత్నంలో ఇలా..
-
Trisha : ఇట్స్ అఫీషియల్.. విజయ్’కి వోట్ వేయమని త్రిష హింట్?
-
Viral Video: భారత్ వస్తున్న నౌకను ఇరాన్ ఎలా సీజ్ చేసిందో చూడండి..
-
IPL 2026: ‘వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకో’.. ఆ ఆటగాడిపై తీవ్ర ఆగ్రహం..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!