US: నేరాలకు పాల్పడితే కఠిన ఆంక్షలు.. విదేశీయులకు అమెరికా ఎంబసీ వార్నింగ్
- నేరాలకు పాల్పడితే కఠిన ఆంక్షలు
- విదేశీయులకు అమెరికా ఎంబసీ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత సంతతికి చెందిన ఒక మహిళ అమెరికా స్టోర్లో దొంగతనానికి పాల్పడింది. ఏడు గంటల పాటు స్టోర్లో తిరిగి రూ.లక్షకు పైగా వస్తువులను దొంగింలించింది. డబ్బులు చెల్లించకుండా బయటకు వెళ్లిపోతుండగా పట్టుబడింది. ఈ నేపథ్యంలో అమెరికా ఎంబసీ.. విదేశీయులకు వార్నింగ్ ఇచ్చింది. యూఎస్ వీసాలకు దరఖాస్తు చేసుకునే వారికి ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం తాజా హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాలో నేరాలకు పాల్పడేవారు అమెరికాకు రాకుండా శాశ్వత ఆంక్షలకు గురవుతారని హెచ్చరించింది. అగ్ర రాజ్యంలో భారతీయ మహిళ దొంగతనం చేస్తూ దొరికిపోయిన నేపథ్యంలో అమెరికా ఎంబసీ ఈ హెచ్చరిక జారీ చేసింది.
ఇది కూడా చదవండి: Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రత్యేక కథనం! ఏం తేల్చిందంటే..!
Also Read
- Trump: ఇకపై హార్ముజ్ను అమెరికానే సంరక్షిస్తుంది.. ట్రంప్ సంచలన ప్రకటన
- Yemen Airport Attack: యెమెన్లో ల్యాండ్ అవుతుండగా క్షిపణుల వర్షం.. ఇరాన్ ప్రయాణికుల ప్రాణాలు గాల్లో!
- UK-Iran: ఐఆర్జీసీపై బ్రిటన్ సంచలన నిర్ణయం.. ఉగ్ర సంస్థగా ప్రకటన
- Iran Hit List: ఇరాన్ హిట్లిస్ట్లో ఆ ముగ్గురు.. పత్రికలో ప్రధాన కథనం
భారతీయ పౌరురాలు ఇల్లినాయిస్ టూరిస్ట్ వీసాపై అమెరికాకు వెళ్లింది. అక్కడ టార్గె్ట్ రిటైల్ స్టోర్కు వెళ్లింది. మా అయితే స్టోర్లో ఒక గంట.. రెండు గంటల్లో పని పూర్తవుతుంది. కానీ ఇల్లినాయిస్ ఏకంగా ఏడు గంటల పాటు స్టోరీలోనే ఉంది. ట్రాలీలో రూ.లక్షకు పైగా వస్తువులను వేసుకుని బయటకు జారుకుంటోంది. సిబ్బంది గమనించి పోలీసులకు సమచారం ఇచ్చారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమె దానికి బిల్లు చెల్లించింది. అయితే దొంగతనంపై స్టోర్ యాజమాన్యం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అలాగే పోలీసులు కూడా అరెస్ట్పై అధికారికంగా ఏం వెల్లడించలేదు. అయితే ఇందుకు సంబంధించిన దృశ్యాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇది కూడా చదవండి: Rajasthan: రాజస్థాన్లో ఘోరం.. గుండెపోటుతో 4వ తరగతి విద్యార్థి మృతి
ఈ నేపథ్యంలోనే నేరాలకు పాల్పడితే న్యాయపరమైన సమస్యలే కాదు.. దానివల్ల మీ వీసా రద్దయ్యే ప్రమాదం ఉందని అమెరికా ఎంబసీ హెచ్చరించింది. భవిష్యత్తులో అమెరికా వీసాలకు దరఖాస్తు చేసుకునే అర్హతను కోల్పోతారని వార్నింగ్ ఇచ్చింది. శాంతిభద్రతలకు అమెరికా అత్యంత విలువనిస్తుందని… విదేశీయులు కూడా అమెరికా చట్టాలను తప్పనిసరిగా పాటించాలని ఎంబసీ కోరింది.
తాజావార్తలు
-
Trump: ఇకపై హార్ముజ్ను అమెరికానే సంరక్షిస్తుంది.. ట్రంప్ సంచలన ప్రకటన
-
Asian U23 Athletics: స్వర్ణ పతకంతో మెరిసిన తెలంగాణ బిడ్డ.. సీఎం రేవంత్ అభినందనలు..
-
Yemen Airport Attack: యెమెన్లో ల్యాండ్ అవుతుండగా క్షిపణుల వర్షం.. ఇరాన్ ప్రయాణికుల ప్రాణాలు గాల్లో!
-
RBI Report: తీవ్ర ద్రవ్యోల్బణంలో తెలంగాణ.. ఆర్బీఐ నివేదిక
-
Jani Master: చిరంజీవి సమక్షంలో కలిసిన జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్.. పెద్దరికం అంటే ఇదే!
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!