Site icon NTV Telugu

Iran-US: ఇరాన్‌పై మరోసారి అమెరికా, ఇజ్రాయెల్ బాంబ్‌ల వర్షం.. రియాద్‌పై ఇరాన్ దాడి

Iranwar (1)

Iranwar (1)

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రం అవుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. అంతేదీటుగా ఇరాన్ కూడా ప్రతీకార దాడులు చేస్తోంది. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్ భారీ దాడికి పాల్పడింది. పేలుడు కారణంగా అమెరికా రాయబార కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించిందని సమాచారం.

అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్ దాడిని సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. రియాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై రెండు డ్రోన్‌లతో దాడి చేసిందని.. దీంతో రాయబార కార్యాలయం లోపల మంటలు చెలరేగాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో పరిస్థితులు మరింతగా చేజారుతున్నాయి.

పౌరులకు అమెరికా సలహా
అమెరికా తన పౌరులకు ఒక సలహా జారీ చేసింది, వారు వెంటనే ఈ దేశాలను విడిచి వెళ్లాలని కోరింది. బహ్రెయిన్, ఈజిప్ట్, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, వెస్ట్ బ్యాంక్, గాజా, జోర్డాన్, కువైట్, లెబనాన్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, సిరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ), యెమెన్ దేశాల నుంచి వాణిజ్య మార్గాల ద్వారా బయలుదేరాలని కాన్సులర్ వ్యవహారాల సహాయ కార్యదర్శి మోరా నామ్దార్ పేర్కొన్నారు. ‘‘తీవ్రమైన భద్రతా ప్రమాదాల కారణంగా అమెరికన్ పౌరులు ఈ దేశాల నుంచి ఇప్పుడే బయలుదేరాలి.’’ అని నామ్‌దార్ ఎక్స్ పోస్ట్‌లో రాశారు. అమెరికా పౌరులు అందుబాటులో ఉన్న వాణిజ్య విమానాల్లో లేదా ఇతర మార్గాల్లో బయలుదేరడానికి ప్రయత్నించాలన్నారు.

 

 

Exit mobile version