Site icon NTV Telugu

Modi-Trump: యుద్ధం వేళ భారత్‌కు గుడ్‌న్యూస్.. రష్యా చమురు కొనుగోలుకు అమెరికా అనుమతి

Modi2

Modi2

పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేస్తుండగా.. ఇంకోవైపు ప్రతీకారంగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్, అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఇంకోవైపు హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. దీంతో ప్రపంచ దేశాలకు చమురు సమస్య తలెత్తింది.

ఇది కూడా చదవండి: Vijay: పెళ్లిలో త్రిషతో కలిసి విజయ్ సందడి.. వీడియో వైరల్

ఈ నేపథ్యంలో రష్యా దగ్గర నుంచి చమురు కొనుగోలు చేసుకునేందుకు భారతదేశానికి అమెరికా నుంచి 30 రోజులు అనుమతి లభించింది. ఈ మేరకు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ వెల్లడించారు. సముద్రంలో చిక్కుకుపోయి ఉన్న రష్యా నౌకల నుంచి మాత్రమే కొనుగోళ్లు జరగాలని స్పష్టంచేశారు. దీంతో ఆ దేశానికి ఆర్థికపరంగా పెద్దగా ప్రయోజనం చేకూరదని తెలిపారు. అమెరికాకు భారత్‌ ముఖ్యమైన భాగస్వామి అని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో తమ ముడి చమురు కొనుగోళ్లను భారత్‌ పెంచుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

 

Exit mobile version