Heavy Demand For Roses: ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్.. మన గులాబీలకు యమ గిరాకీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్ని కొన్ని సార్లు యుద్ధాల వల్ల కూడా లాభం జరుగుతుంది. కానీ అది యుద్ధంలో పాల్గొనే దేశాలకు కాదు. పక్కన ఉండి చూసే వారికి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఇప్పుడు అదే జరుగుతోంది. రష్యా, ఉక్రెయిన్ ఎగుమతి చేసే వస్తువులకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో ఇప్పుడు మన గులాబీ కూడా చేరింది. వాలెంటైన్స్ డే దగ్గర పడుతుండటంతో ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో గులాబీ ధరలు గుభాళిస్తున్నాయి. ఊహించని రీతిలో ఎగుమతిదారులకు లాభాలు ఆర్జించి పెడుతున్నాయి.
యుద్ధం కారణంగా యూరప్లో గులాబీ సాగు గణనీయంగా పడిపోయింది. దాంతో భారత్ వంటి దేశాల నుంచి ఎగుమతులు పెరిగాయి. ఇప్పటికే ఈ ట్రెండ్ కనిపిస్తోంది. 2021లో గులాబీ ఎగుమతి విలువ 9 కోట్ల 68 లక్షల రూపాయలు. కానీ 2022 నవంబర్ నాటికి అది 18 కోట్ల 34 లక్షలకు చేరింది. యుద్ధం వల్ల ఇందన సంక్షోభం ఏర్పడటంతో యూరప్ రైతులు ఈ శీతాకాలంలో పూలను పెంచకుండా అడ్డుకుంది. పూల సాగుకు అవసరమైన హీటింగ్, కృత్రిమ లైటింగ్, CO2 ఎన్రిచ్మెంట్ కోసం అధిక శక్తి కావాల్సి వుంటుంది. అన్నింటికంటే లేబర్ ఖర్చులు భరించటం కష్టం. అందుకే శీతాకాలంలో సాగు నిలిపివేశారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే నవంబర్ వరకు భారతీయ పువ్వులకు డిమాండ్ ఉంటుంది. దాంతో కోవిడ్-19 ఎదురుదెబ్బ తర్వాత భారతదేశపు పూల ఎగుమతులు మళ్లీ ట్రాక్లోకి వచ్చినట్టే.
Also Read
- Vladimir Putin: "భారత్ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం".. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
- ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
- Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
- Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
పెద్ద సంఖ్యలో పూల పెంపకందారులు సాగు నిలిపివేయటం గత రెండేళ్లేగా ఎగుమతులు కుంటుబడ్డాయి. అయితే, కరోనా కాలంలో దేశీయ మార్కెట్లు రైతులకు కాస్త ఉపశమనం కలిగించాయి. ఇక ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ పుంజుకుంది. దేశీయ మార్కెట్ కూడా పెరుగుతోంది. ఇది పూల పెంపకందారులకు కొత్త ఉత్సాహాన్నిస్తోంది. ఈ ఏడాది అంతర్జాతీయ మార్కెట్లోనూ మంచి అవకాశాలున్నాయి. ప్రస్తుతం మనం 2019 ఎగుమతి స్థాయిలకు దగ్గరగా ఉన్నామంటున్నారు అధికారులు. ఐతే, ఎక్స్పోర్టర్లకు పెరుగుతున్న సరుకు రవాణా ఖర్చులు భారంగా మారాయి. గత ఏడాదితో పోలిస్తే ఇవి 30 శాతం పెరిగాయి. దాంతో విదేశీ కొనుగోలుదారులతో అంత సులభంగా డీలింగ్ సాగట్లేదు.
Read Also: Asia Cup 2023: ఆసియా కప్ విషయంలో బీసీసీఐకి పీసీబీ వార్నింగ్!
భారతీయ గులాబీలకు అంతర్జాతీయ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. మొత్తం గులాబీ ఎగుమతుల్లో ఒక్క యూకే వాటాయే 35 శాతంగా ఉంది. ఆస్ట్రేలియాకు 19 శాతం, జపాన్కు 18 శాతం ఎగుమతి అవుతున్నాయి. వాలెంటైన్ సీజన్ కోసం మలేషియా, సింగపూర్, గల్ఫ్ దేశాల నుంచి భారీ ఎత్తున ఆర్డర్లు వచ్చిపడుతున్నాయి.పూణే జిల్లాలోని మావల్ తాలూకా నాణ్యమైన గులాబీ సాగుకు పెట్టింది పేరు. ఇది ప్రధాన పూల ఎగుమతి కేంద్రంగా ఉంది. ఈ వాలెంటైన్ సీజన్లో ఎగుమతులు 50 కోట్ల రూపాయలు దాటుతాయని అంచనా. ఇది కొవిడ్ ముందు కన్నా ఎక్కువ. మహారాష్ట్రతో పాటు తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ ప్రధానంగా గులాబీలను సాగుచేసే రాష్ట్రాలు. ఎగుమతులు ప్రధానంగా ముంబై, బెంగుళూరు విమానాశ్రయాల నుండి జరుగుతాయి. వాలెంటైన్ సీజన్లో 60 శాతానికి పైగా గులాబీ ఎగుమతులు ముంబై నుంచే రవాణా అవుతాయి.
తాజావార్తలు
-
Prakash Raj: నాగబాబుకు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్.. “మేము గొర్రెలం కాదు..!”
-
Devara 2 Update : ‘వర’కు ఏమైంది ?… జాన్వీ ప్రశ్నపై తారక్ సీరియస్
-
AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
-
Buchi Babu : జాన్వీ కపూర్ క్యారెక్టర్’పై బుచ్చిబాబు క్షమాపణలు..ఆ సీన్స్ కట్ చేస్తానని ప్రకటన!
-
E85 Fuel: భారత్ లో E85 ఇంధనం విడుదల.. పెట్రోల్ కంటే రూ.20 చౌక..! ప్రత్యేకతలు ఇవే
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!