Heavy Demand For Roses: ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్.. మన గులాబీలకు యమ గిరాకీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్ని కొన్ని సార్లు యుద్ధాల వల్ల కూడా లాభం జరుగుతుంది. కానీ అది యుద్ధంలో పాల్గొనే దేశాలకు కాదు. పక్కన ఉండి చూసే వారికి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఇప్పుడు అదే జరుగుతోంది. రష్యా, ఉక్రెయిన్ ఎగుమతి చేసే వస్తువులకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో ఇప్పుడు మన గులాబీ కూడా చేరింది. వాలెంటైన్స్ డే దగ్గర పడుతుండటంతో ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో గులాబీ ధరలు గుభాళిస్తున్నాయి. ఊహించని రీతిలో ఎగుమతిదారులకు లాభాలు ఆర్జించి పెడుతున్నాయి.
యుద్ధం కారణంగా యూరప్లో గులాబీ సాగు గణనీయంగా పడిపోయింది. దాంతో భారత్ వంటి దేశాల నుంచి ఎగుమతులు పెరిగాయి. ఇప్పటికే ఈ ట్రెండ్ కనిపిస్తోంది. 2021లో గులాబీ ఎగుమతి విలువ 9 కోట్ల 68 లక్షల రూపాయలు. కానీ 2022 నవంబర్ నాటికి అది 18 కోట్ల 34 లక్షలకు చేరింది. యుద్ధం వల్ల ఇందన సంక్షోభం ఏర్పడటంతో యూరప్ రైతులు ఈ శీతాకాలంలో పూలను పెంచకుండా అడ్డుకుంది. పూల సాగుకు అవసరమైన హీటింగ్, కృత్రిమ లైటింగ్, CO2 ఎన్రిచ్మెంట్ కోసం అధిక శక్తి కావాల్సి వుంటుంది. అన్నింటికంటే లేబర్ ఖర్చులు భరించటం కష్టం. అందుకే శీతాకాలంలో సాగు నిలిపివేశారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే నవంబర్ వరకు భారతీయ పువ్వులకు డిమాండ్ ఉంటుంది. దాంతో కోవిడ్-19 ఎదురుదెబ్బ తర్వాత భారతదేశపు పూల ఎగుమతులు మళ్లీ ట్రాక్లోకి వచ్చినట్టే.
Also Read
- Intelligent Bird : ప్రపంచంలోనే అత్యంత తెలివైన పక్షి! దీనికి 5 ఏళ్ల పిల్లాడి తెలివితేటలు...
- Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
- Sick Leave Denial Case: 'సిక్ లీవ్ కావాలి' అని వేడుకున్నా కనికరించని బాస్.. చివరకు ఆఫీస్ వాష్రూమ్లో మృతి!
- Opendoor India Exit: భారత్కు గుడ్బై చెప్పిన ఓపెన్డోర్.. 250 మంది ఉద్యోగులకు షాక్
పెద్ద సంఖ్యలో పూల పెంపకందారులు సాగు నిలిపివేయటం గత రెండేళ్లేగా ఎగుమతులు కుంటుబడ్డాయి. అయితే, కరోనా కాలంలో దేశీయ మార్కెట్లు రైతులకు కాస్త ఉపశమనం కలిగించాయి. ఇక ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ పుంజుకుంది. దేశీయ మార్కెట్ కూడా పెరుగుతోంది. ఇది పూల పెంపకందారులకు కొత్త ఉత్సాహాన్నిస్తోంది. ఈ ఏడాది అంతర్జాతీయ మార్కెట్లోనూ మంచి అవకాశాలున్నాయి. ప్రస్తుతం మనం 2019 ఎగుమతి స్థాయిలకు దగ్గరగా ఉన్నామంటున్నారు అధికారులు. ఐతే, ఎక్స్పోర్టర్లకు పెరుగుతున్న సరుకు రవాణా ఖర్చులు భారంగా మారాయి. గత ఏడాదితో పోలిస్తే ఇవి 30 శాతం పెరిగాయి. దాంతో విదేశీ కొనుగోలుదారులతో అంత సులభంగా డీలింగ్ సాగట్లేదు.
Read Also: Asia Cup 2023: ఆసియా కప్ విషయంలో బీసీసీఐకి పీసీబీ వార్నింగ్!
భారతీయ గులాబీలకు అంతర్జాతీయ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. మొత్తం గులాబీ ఎగుమతుల్లో ఒక్క యూకే వాటాయే 35 శాతంగా ఉంది. ఆస్ట్రేలియాకు 19 శాతం, జపాన్కు 18 శాతం ఎగుమతి అవుతున్నాయి. వాలెంటైన్ సీజన్ కోసం మలేషియా, సింగపూర్, గల్ఫ్ దేశాల నుంచి భారీ ఎత్తున ఆర్డర్లు వచ్చిపడుతున్నాయి.పూణే జిల్లాలోని మావల్ తాలూకా నాణ్యమైన గులాబీ సాగుకు పెట్టింది పేరు. ఇది ప్రధాన పూల ఎగుమతి కేంద్రంగా ఉంది. ఈ వాలెంటైన్ సీజన్లో ఎగుమతులు 50 కోట్ల రూపాయలు దాటుతాయని అంచనా. ఇది కొవిడ్ ముందు కన్నా ఎక్కువ. మహారాష్ట్రతో పాటు తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ ప్రధానంగా గులాబీలను సాగుచేసే రాష్ట్రాలు. ఎగుమతులు ప్రధానంగా ముంబై, బెంగుళూరు విమానాశ్రయాల నుండి జరుగుతాయి. వాలెంటైన్ సీజన్లో 60 శాతానికి పైగా గులాబీ ఎగుమతులు ముంబై నుంచే రవాణా అవుతాయి.
తాజావార్తలు
-
AirAsia: ఆలస్యమైన విమానం.. రైతు అరుదైన హైబ్రిడ్ పనస మొక్క దెబ్బతినడంతో రూ. 90 వేల నష్టపరిహారం
-
Vadde Naveen : బాహుబలి కంటే పుష్పనే స్పెషల్… స్టార్స్ సినిమాలపై వడ్డే నవీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
-
TATA Sierra EV: టాటా సియెర్రా ఈవీ రిలీజ్ కు రెడీ..! 500KM రేంజ్, ప్రీమియం ఫీచర్లు
-
Wedding Card Vastu Tips: పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తోంది.. వాస్తు ప్రకారం మీ వెడ్డింగ్ కార్డ్ ఇలా ఉంటేనే శుభప్రదం! ఈ తప్పులు అస్సలు చేయకండి!
ట్రెండింగ్
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..