Emine Dzhaparova: భారత్ను సందర్శించనున్న ఉక్రెయిన్ మంత్రి.. యుద్ధం తర్వాత తొలి అధికారిక పర్యటన
Ukraine Minister Emine Dzhaparova To Visit India On Monday: ఉక్రెయిన్ ఉప విదేశాంగ మంత్రి ఎమిన్ జపరోవా నాలుగు రోజుల పాటు భారత్లో పర్యటించనున్నారు. సోమవారం భారత్లో అడుగుపెట్టనున్న ఆమె.. ఈ పర్యటనలో ద్వైపాక్షిక సంబంధాలు, ఉక్రెయిన్లోని ప్రస్తుత పరిస్థితులు, గ్గోబల్ సమస్యల గురించి చర్చించనున్నారు. గతేడాది ఫిబ్రవరిలో రష్యా దాడి ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్కి ఇది మొదటి అధికారిక పర్యటన. తన ఈ పర్యటనలో విదేశాంగ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖితో పాటు డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ విక్రమ్ మిస్రీని కూడా ఝపరోవా కలవనున్నారు. ఈ సందర్భంగా.. ‘‘ఉక్రెయిన్ భారతదేశంతో స్నేహపూర్వక సంబంధాలు, బహుముఖ సహకారాన్ని పంచుకుంటోంది. దౌత్య సంబంధాలను నెలకొల్పిన గత 30 సంవత్సరాలలో.. విద్య, వాణిజ్యం, సంస్కృతి, రక్షణ రంగాల్లో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం గణనీయమైన పురోగతిని సాధించింది. ఈ పర్యటన.. పరస్పర అవగాహన, ఆసక్తులను మరింత పెంచుకునే సందర్భంగా నిలవనుంది’’ అంటూ ఒక అధికారిక ప్రకటన తెలిపింది.
Droupadi Murmu: యుద్ధ విమానంలో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Also Read
- North Korea: 10 ఏళ్ల ప్లానింగ్, 2 గంటల్లో ఎస్కేప్.. ఉత్తర కొరియా నుంచి కుటుంబం పరార్..
- Donald Trump: కనిపించిన వెంటనే కాల్చిపారేయండి.. హార్ముజ్పై ట్రంప్ సంచలన ఆదేశాలు..
- Donald Trump: భారత్ చాలా మంచి మిత్రుడు.. ట్రంప్ మరో యూ-టర్న్..
- Donald Trump: ‘‘బిడ్డను కనడానికే వస్తారు’’.. భారతీయులపై ట్రంప్ అక్కసు..
భారత ప్రభుత్వంతో చర్చల సందర్భంగా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ ప్రతిపాదించిన 10 పీస్ ఫార్ములాను మంత్రి రూపరోవా ప్రస్తావించనున్నారని, దీన్ని గ్లోబల్ వాయిస్గా మార్చడంలో భారత్ మద్దతును కోరనున్నారని తెలిసింది. అలాగే.. ఆమె ప్రధాని మోడీని కైవ్కు ఆహ్వానించే అవకాశం ఉంది. జీ20 సమ్మిట్లో ఆహ్వానం పొందెందుకు కూడా ఉక్రెయిన్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కాగా.. కాగా.. ఈ ఏడాది జీ20 సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్, ఉక్రెయిన్పై దాడి చేసినందుకు మిత్రదేశమైన రష్యాను నిందించడానికి నిరాకరించిన విషయం తెలిసిందే. అలాగే.. రష్యన్ చమురు కొనుగోళ్లను పెంచుతూ, దౌత్యపరమైన పరిష్కారాన్నీ కోరింది. ప్రధాని మోడీ సైతం ఇరు దేశాల అధ్యక్షులతో ఇప్పటికే చాలాసార్లు ఫోన్లో మాట్లాడారు. ఈ సమస్యని శాంతియుతంగా పరిష్కరించాలని సూచిస్తూ వచ్చారు. మరోవైపు.. యుద్ధంలో దెబ్బతిన్న విద్యుత్ మౌలిక సదుపాయాలను సరిచేయడానికి ఔషధాలు, వైద్య పరికరాలు, ఇంధన పరికరాలతో సహా మరిన్ని మానవతా సహాయం కోసం భారతదేశాన్ని ఉక్రెయిన్ అభ్యర్థించింది.
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!