Russia-Ukraine War: అంధకారంలో ఉక్రెయిన్.. రష్యా భీకరదాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ukraine in the dark. Russian attack on power system: రష్యా, ఉక్రెయిన్ పై భీకరదాడులు చేస్తోంది. ఉక్రెయిన్ నగరాలు, పట్టణాలపై క్షిపణులతో విరుచుకుపడుతోంది. ముఖ్యంగా అక్కడి విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. తాజాగా రష్యా దాడుల ఫలితంగా ఉక్రెయిన్ లో అంధకారం నెలకొంది. దేశంలో విద్యుత్ వ్యవస్థ దెబ్బతినడంతో కోటి మంది ఉక్రెయిన్లకు విద్యుత్ లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలన్ స్కీ గురువారం అన్నారు. ఒడెస్సా, విన్నిట్సియా, సుమీ, కీవ్ ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. విద్యుత్ సరఫరాను పునురుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని జెలన్ స్కీ అన్నారు.
Read Also: Saudi Arabia: భారతీయులకు సౌదీ గుడ్ న్యూస్.. వీసా పొందాలంటే ఇకపై ఇది అవసరం లేదు
Also Read
- Alaska Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు పైలట్లతో సహా 8 మంది మృతి
- Iran Vs America: గేర్ మార్చిన ఇరాన్.. వణికిపోతున్న ట్రంప్.. నెక్ట్స్ జరిగేది ఇదే!
- America Debt:ఇంకెక్కడ సూపర్ పవర్..? అగ్రరాజ్యం నెత్తిన అప్పుల కుప్ప ఎంత ఉందంటే?
- India-Singapore: భారత్-సింగపూర్ మధ్య కీలక ఒప్పందాలు.. విశేషాలు ఇవే!
ఇటీవల ఖేర్సన్ నుంచి రష్యా బలగాలు వెనుదిరిగిన తర్వాత పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది రష్యా. రాబోయే శీతాకాలంలో ఉక్రెయిన్ కు విద్యుత్ చాలా అవసరం. చలికాలంలో విద్యుత్ అందుబాటులో లేకుండా చలికి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడే అవకాశం ఉంది. ప్రజలు వలస వెళ్లాలనే రష్యా, తమ విద్యుత్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుంటుందని జెలన్ స్కీ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ లో విద్యుత్ గ్రిడ్ దెబ్బతినడంతో కోతలు తీవ్రం అయ్యాయి.
మరోవైపు రెండు రోజుల క్రితం రష్యాదిగా చెప్పబడుతున్న ఓ మిస్సైల్ ఉక్రెయిన్ సరిహద్దు దేశమైన పోలాండ్ లో పడింది. నాటో దేశం అయిన పోలాండ్ లో క్షిపణి పడటంతో పాశ్చాత్య దేశాలు, ముఖ్యంగా నాటో దేశాలు రష్యాను తీవ్రంగా తప్పుబడుతున్నాయి. పలు యూరోపియన్ దేశాలు ఈ క్షిపణి రష్యాదే అని చెబుతున్నాయి. అయితే రష్యా ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. ఉద్దేశపూర్వకంగా వెస్ట్రన్ దేశాలు తమపై ఆరోపణలు చేస్తున్నాయని రష్యా విమర్శించింది. ఇది ఉక్రెయిన్ కు చెందిన క్షిపణి అని రష్యా ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే పోలాండ్ లో పడిన క్షిపణి మాది కాదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ స్పష్టం చేశారు. ఈ చర్యకు తమను నిందించవచ్చని కోరాడు.
తాజావార్తలు
-
Rahul Gandhi: ఢిల్లీ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ గాంధీ ధర్నా.. పెల్లెట్ గన్ బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Bethlehem Kudumba Unit : 2026 ఓనమ్ విన్నర్గా నివిన్ పౌలి.. ‘బెత్లేహెమ్ కుటుంబ యూనిట్’ బ్లాక్ బస్టర్
-
Vivo V80 Lite: వివో వి80 లైట్ లాంచ్ డేట్ ఫిక్స్.. 10,000mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్తో అదరగొట్టనున్న వివో ఫోన్
-
Telangana Congress: కొండా సురేఖ తీరుపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం.. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్..
ట్రెండింగ్
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!