UK Couple: విమానంలో యూకే జంట పాడుపని.. షాకైన ప్రయాణికులు
- విమానంలో యూకే జంట పాడుపని
- షాకైన ప్రయాణికులు.. సిబ్బందికి ఫిర్యాదు
- పోలీసులకు అప్పగింత.. నేరం రుజువు కావడంతో శిక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి యువతకు బొత్తిగా భయం లేకుండా పోతుంది. నలుగురు చూస్తున్నారా? ఇంకిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు. పబ్లిక్గానే జుగుప్సాకరంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో ఓ జంట బైక్పై వెళ్తూ ముద్దుల్లో మునిగిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇలా జంటలు ఈ మధ్య రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఇలా రోడ్లపై కొన్ని జంటలు ఇలా చేస్తుంటే.. ఓ జంట ఏకంగా విమానంలోనే లైంగిక చర్యలకు పాల్పడింది. సహా ప్రయాణికులు ఉన్నారన్న భయం ఏ మాత్రం లేకుండా శృంగారంలో మునిగిపోయారు. ఆ జంట ఎవరు? ఎక్కడ జరిగింది? ఆ వివరాలు తెలియాలంటే ఈ వార్త చదవండి.
ఇది కూడా చదవండి: Rolls-Royce Cullinan Series II: రోల్స్ రాయిస్ నుంచి కొత్త వెర్షన్ లాంచ్.. పూర్తి వివరాలు ఇవే
Also Read
యూకేకు చెందిన బ్రాడ్లీ స్మిత్ (22), ఆంటోనియా(20) ఇద్దరూ స్పెయిన్లోని టెనెరిఫ్లో గడిపేందుకు వెళ్లారు. మార్చి 3న స్పెయిన్ నుంచి బ్రిస్టల్కు ఈజీజెట్ విమానంలో బయల్దేరారు. ఫ్లైట్లో బ్రాడ్లీ స్మిత్కు 16 A, ఆంటోనియాకు 16 B సీట్లు పక్కపక్కనే వచ్చాయి. 16 Cలో మరో ప్రయాణికుడు ఉన్నాడు. వారి వెనుక సీటులో తల్లి, కూతురు ఉన్నారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో బ్రాడ్లీ స్మిత్, ఆంటోనియా ఇద్దరూ లైంగిక చర్యకు దిగారు. ఎవరికి కనిపించకుండా పెద్ద దుస్తులను కప్పి శృంగారంలో పాల్గొన్నారు. పక్క సీటులో కూర్చున్న వ్యక్తికి అనుమానం వచ్చి చూడగా జంట లైంగిక చర్యలో ఉండడం చూసి షాక్ అయ్యాడు. వెనుక సీటులో ఉన్న తల్లికూతురు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ప్రయాణికులు విమాన సిబ్బందికి తెలియజేశారు. టేకాప్ అయిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది. ల్యాండింగ్ చేసిన తర్వాత జంటను విమాన సిబ్బంది పోలీసులకు అప్పగించారు.
ఇది కూడా చదవండి: Petrol, Diesel Prices: ముడిచమురు ధర తగ్గినా.. పెట్రోలు, డీజిల్ ధరలు ఎందుకు తగ్గడం లేదు?
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇటీవల జంటను న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. విచారణలో కోర్టు ముందు జంట నేరాన్ని అంగీకరించారు. విమానంలో లైంగిక చర్యకు పాల్పడినట్లు ఇద్దరూ ఒప్పుకున్నారు. జంటకు వ్యతిరేకంగా ముగ్గురు వ్యక్తులు సాక్ష్యం ఇచ్చారు. పబ్లిక్ ప్లేస్లో లైంగిక చర్యకు పాల్పడినందుకు కోర్టు శిక్ష విధించింది. ముగ్గురు సాక్షులకు ఒక్కొక్కరికి 100 పౌండ్లు (సుమారు రూ. 11,000) పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. అదనంగా బ్రాడ్లీకి 300 గంటలు, ఆంటోనియాకు 270 గంటలు సమాజ సేవను చేయాలని తీర్పు వెల్లడించింది. న్యాయమూర్తి లిన్నే మాథ్యూస్ ఈ జంటకు శిక్ష విధించారు. విమానంలో తప్పుడుగా ప్రవర్తించినందుకు జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Bhagat Singh Jayanti: ఉరితాడును ముద్దాడిన విప్లవ వీరుడు.. షాహిద్ భగత్సింగ్
తాజావార్తలు
-
Congress: “జ్ఞానేశ్ కుమార్ను అమెరికాకు తీసుకెళ్లండి”.. ట్రంప్ ప్రశంసలపై కాంగ్రెస్ కౌంటర్..
-
Tamil Nadu: ‘ఆ చర్య సిగ్గుగా ఉంది’.. త్రిషకు సీఎం విజయ్ సెల్యూట్ చేయడంపై డీఎంకే ఆగ్రహం
-
Rishabh Pant Record: టెస్టుల్లో 100 సిక్సర్లు.. పంత్ పేరిట ప్రపంచ రికార్డు!
-
Nayanthara : నయనతార కళ్ళు తెరిపించిన బిజినెస్ ?
-
Vinod Tawde: యూపీ ఎన్నిలక కోసం బీజేపీ మాస్టర్ ప్లాన్.. బరిలోకి దిగిన ‘‘సైలెంట్ స్ట్రాటజిస్ట్’’..
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!