కోవిడ్ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన విమాన చార్జీలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాలపై ప్రభావం చూపింది… అయితే, కోవిడ్ ఆంక్షలు పెట్టే అవకాశం ఉందంటూ ముందుగా పోటీపడి స్వదేశాలకు, సొంత ప్రాంతాలకు చేరుకోవడానికి భారీగా ఖర్చు చేశారు.. ఆ సమయంలో విమాన చార్జీలు అమాంతం పెరిగిపోయాయి.. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది.. అన్ని దేశాలు ఆంక్షల బాట పడుతున్న సమయంలో.. విమానాలు ఎక్కేవారు లేక.. చార్జీలు తగ్గిపోయాయి.. ఇదే సమయంలో.. భారత్-యూఏఈ మధ్య ఇంతకుముందెన్నడూ లేని విధంగా విమాన చార్జీలు పడిపోయాయి.. సాధారణ సమయాల్లో దుబాయ్ నుంచి భారత్కు రావాలంటే కనీసం 1500 దిర్హమ్స్ అంటే రూపాయాల్లో సుమారుగా రూ.30 వేలుగా ఉండేది.. కానీ, ప్రస్తుతం అది 300 దిర్హమ్స్ అంటే సుమారు రూ.6వేలకు పడిపోయింది.. అంటే భారత్-యూఏఈ మధ్య ఏకంగా 4-5 రేట్లు విమానచార్జీలు పడిపోయాయి..
Read Also: కాపులపై బీజేపీ ఎంపీ జీవీఎల్ కీలక వ్యాఖ్యలు..
Also Read
భారత్ యూఏఈ రూట్లో టికెట్ బుకింగ్స్ కూడా భారీగా తగ్గినట్టు ట్రావెల్ పోర్టల్ చెబుతున్నమాట.. వారం ముందు వరకు రోజువారీగా చూస్తే 142 వరకు బుక్సింగ్ ఉండేవి.. కానీ, ఇప్పుడు 120కి పడిపోయినట్లు పేర్కొంది ఈజీ మై ట్రిప్.. దేశ రాజధాని ఢిల్లీ నుంచి దుబాయ్కు గతంలో 1000-1500 దిర్హమ్స్గా అంటే రూ.20వేలు నుంచి రూ.30వేలుగా ఉన్న విమాన చార్జీలు ఇప్పుడు కేవలం 330 దిర్హమ్స్ అంటే రూ.6600కు పడిపోయిందని పేర్కొంది. కొచ్చి నుంచి దుబాయ్ టికెట్ ధర రూ.26 వేల నుంచి రూ.10 లోపునకు, తిరువనంతపురం నుంచి దుబాయ్కు చార్జీలు రూ.81 వేలు నుంచి 8 వేలుకు, కన్నూర్, కోజికోడ్ నుంచి దుబాయ్కు రూ. 28 వేల నుంచి రూ.10 వేలకు ఇలా.. చాలా రూట్లలోనూ చార్జీలు తగ్గిపోయాయి. దీనికి ప్రధాన కారణం.. కోవిడ్ నిబంధనలే అని చెబుతున్నారు.. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇంటర్నెషనల్ ప్రయాణికులకు విధించిన పెయిడ్ ఐసోలేట్ నిబంధన.. విదేశాల నుంచి వచ్చినవారికి పాజిటివ్ వస్తే తప్పనిసరిగా ఐసోలేషన్లో ఉండాల్సిందేనని నిబంధన.. తదితర అంశాలు కూడా టికెట్ రేట్లపై ప్రతీకూల ప్రభావం చూపుతున్నట్టుగా విశ్లేషకులు చెబుతున్నమాట. మొత్తంగా.. మునుపెన్నడూ లేని విధంగా భారీగా తగ్గిన విమాన చార్జీలు ఇలా కూడా రికార్డు సృష్టించాయి.
తాజావార్తలు
-
Shubhman Gill: మైదానంలో విలవిలలాడిన గిల్.. నెట్స్లో ఊహించని ప్రమాదం.. అభిమానుల్లో పెరిగిన ఆందోళన..
-
The Paradise Teaser: నాని మాస్ విశ్వరూపం.. ‘ది ప్యారడైజ్’తో బాక్సాఫీస్ బద్దలేనా!
-
UK: ఆర్మీ కాలేజీలో మహిళలపై అత్యాచారాలు.. యూకేను కుదిపేస్తున్న ఘటన..
-
Rahul Gandhi: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు ఫోన్.. ఏం సంభాషణ జరిగిందంటే..!
-
Minister Anitha: జగన్ బయటకు వస్తే విధ్వంసమే.. పరామర్శల పేరుతో అరాచకం.. మంత్రి అనిత ఘాటు వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!