Govt Shutdown: షట్డౌన్ గండం నుంచి తప్పించుకున్న అమెరికా..
- షట్డౌన్ ప్రమాదం నుంచి తప్పించుకున్న అమెరికా..
- ప్రభుత్వ కార్యకలాపాలు సంబంధించిన బిల్లుకు ప్రతినిధుల సభ ఆమోదం..
- సెనెట్కు పంపిన కొత్త ప్రణాళిక బిల్లు ఆమోదం పొందడం లాంఛనమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Govt Shutdown: షట్డౌన్ ప్రమాదం నుంచి అగ్రరాజ్యం అమెరికా గట్టెక్కినట్లే కనబడుతుంది. డొనాల్డ్ ట్రంప్ డిమాండ్లతో నిలిచిపోయిన కీలక నిధుల బిల్లును ప్రతినిధుల సభ లాస్ట్ మినిట్ లో ఆమోదించింది. శుక్రవారం సాయంత్రం ( యూఎస్ కాలమానం ప్రకారం) స్పీకర్ మైక్ జాన్సన్ ప్రవేశ పెట్టిన కొత్త ప్రణాళిక బిల్లుకు ప్రతినిధుల సభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, ట్రంప్ లేవనెత్తిన డిమాండ్లను ఈ ప్రణాళిక నుంచి తొలగించింది. ఆ తర్వాత ఈ బిల్లును సెనెట్కు పంపగా.. అక్కడ కూడా ఆమోదం పొందితే అమెరికా షట్డౌన్ ముప్పు నుంచి తప్పించుకుంటుంది.
Read Also: Canada: ట్రూడోకు జగ్మీత్సింగ్ షాక్.. లిబరల్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం!
Also Read
- Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
- US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
- US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్!
- Ebola: ఎబోలా విజృంభణ.. వెయ్యికి పైగా జనాలు మృతి.. WHO వార్నింగ్..
కాగా, సర్కార్ కార్యకలాపాలు, జీతాలకు సంబంధించి ప్రభుత్వానికి నిధులు సమకూర్చేలా జో బైడెన్ కార్యవర్గం ఈ బిల్లును తెచ్చింది. దీన్ని తొలుత ట్రంప్ వ్యతిరేకించారు. అలాగే, సమాఖ్య సర్కార్ కార్యకలాపాలకు నిధులు సమకూర్చడంతో పాటు వివిధ ఆర్థిక బాధ్యతలు నిర్వర్తించేందుకు ఈ బిల్లులో రెండేళ్ల పాటు రుణాలపై పరిమితిని ఎత్తివేయాలని అతడు డిమాండ్ చేశారు. దీంతో డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనను చేరుస్తూ ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ గురువారం నాడు సరికొత్త బిల్లును ప్రవేశ పెట్టారు. కానీ, ఈ బిల్లుకు ప్రతినిధుల సభలో 235-174తో వీగిపోయింది. ఈ బిల్లుకు ఏకంగా 38 మంది రిపబ్లికన్ సభ్యులే డెమోక్రాట్లతో కలిసి వ్యతిరేకంగా ఓటు వేశారు.
Read Also: Hit And Run Accident: క్రిస్మస్ మార్కెట్లో ప్రజలపైకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి, 60 మందికి పైగా
అయితే, ఈ పరిణామాలపై వైట్ హౌస్ కూడా కీలక కామెంట్స్ చేసింది. షట్డౌన్ వస్తే అధికార మార్పిడికి అంతరాయం ఏర్పడుతుందని హెచ్చరించింది. దీంతో ట్రంప్ కాస్త వెనక్కి తగ్గడంతో.. అతడు చేసిన డిమాండ్లను తొలగించిన తర్వాత సమాక్య కార్యకలాపాలకు నిధులు, విపత్తు సాయం వంటి అంశాలతో 118 పేజీల మరో కొత్త ప్యాకేజీ బిల్లును స్పీకర్ మైక్ జాన్సన్ ప్రవేశ పెట్టగా.. 366-34తో ప్రతినిధుల సభ ఆమోదించింది. మెజార్టీ రిపబ్లికన్లు ఈ కొత్త బిల్లుకు మద్దతుగా ఓటేశారు. ఆ తర్వాత దీన్ని సెనెట్కు పంపించారు. ప్రస్తుతం సెనెట్లో డెమోక్రాటిక్ పార్టీ వారే ఆధిక్యంలో ఉండటంతో.. అక్కడ ఈ బిల్లు ఆమోదం పొందడం లాంఛనమే.
తాజావార్తలు
-
Paper Leaks: పంజాబ్లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
-
CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
-
Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?