America And China: అమెరికా, చైనా మధ్య వారానికి రెండుసార్లు విమాన సర్వీసులు.. విమానాల సంఖ్య రెట్టింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
America And China: ప్రపంచంలోనే అగ్ర రాజ్యాలుగా పేరున్న అమెరికా, చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడుతున్నాయి. రెండు దేశాల మధ్య వాణిజ్య, వ్యాపార సంబంధాలను మెరుగుపర్చడానికి ఇరు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. సంబంధాలు ఇంకా బలపడటం కోసం ఇకపై ఇరు దేశాల మధ్య వారానికి రెండుసార్లు విమాన సర్వీసులను కొనసాగించాలని రెండు దేశాలు నిర్ణయించాయి. విమాన సర్వీసులను సైతం రెట్టింపు చేయాలని నిర్ణయించాయి. అమెరికా మరియు చైనా రెండు దేశాల మధ్య ప్రయాణించడానికి ఎయిర్ క్యారియర్ల కోసం ప్రస్తుతం అనుమతించబడిన ప్రయాణీకుల విమానాల సంఖ్య కంటే రెట్టింపు సంఖ్యలో ఆమోదం పొందనున్నట్టు శుక్రవారం రాయిటర్స్ ప్రకటించింది. U.S. రవాణా శాఖ (USDOT) సెప్టెంబరు 1 నుండి U.S.కి వెళ్లడానికి అనుమతించబడిన చైనీస్ ప్యాసింజర్ విమానాల సంఖ్యను వారానికి 18 ట్రిప్లకు పెంచుతుంది. అక్టోబర్ 29 నుండి వారానికి 24కి పెంచుతుంది. అయితే ప్రస్తుత వారానికి 12 సార్లే అనుమతి పొంది ఉండగా.. దానిని పెంచడానికి అమెరికా నిర్ణయించింది. అమెరికా పెంపు నిర్ణయాన్ని అంగీకరిస్తూ.. అదేవిధంగా తమ దేశం నుంచి పెంపుకు చైనా ప్రభుత్వం అంగీకరిస్తుందని అధికారిక వర్గాలు ప్రకటించాయి.
Read also: Cow Attack: బాలికపై ఆవు దాడి, కాపాడుకోలేక తల్లడిల్లిన తల్లి.. నెట్టింట వీడియో వైరల్
Also Read
- Strait of Hormuz: హోర్ముజ్ నుంచి యెమెన్ వరకు హైటెన్షన్.. 86 షిప్స్కు అమెరికా బ్రేక్!
- Turkey-SCO: ‘ఎస్సీవో’లో మేము చేరతాం.. టర్కీ ప్రతిపాదన.. భారత్ అభ్యంతరం!
- US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్పోర్ట్కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
- Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
అమెరికా, జపాన్, దక్షిణ కొరియా మరియు ఆస్ట్రేలియా వంటి కీలక మార్కెట్లతో సహా మరిన్ని దేశాలకు గ్రూప్ టూర్లపై కరోనా కాలంలో చైనా పరిమితులను విధించిన సంగతి తెలిసిందే. ఆ పరిమితులను చైనా గురువారం ఎత్తివేసిన తర్వాత బీజింగ్ మరియు వాషింగ్టన్ మధ్య సహకారానికి అరుదైన అవకాశం ఏర్పడుతుందని ప్రకటించింది. USDOT శుక్రవారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. వైట్ హౌస్, స్టేట్ డిపార్ట్మెంట్ మరియు వాషింగ్టన్లోని చైనీస్ ఎంబసీ చేసిన అభ్యర్థనలకు వెంటనే స్పందించలేదు. అమెరికా మరియు చైనాల మధ్య పోటీ సమతుల్యత మరియు న్యాయమైన సమాన అవకాశాలను కొనసాగించడానికి రెండు దేశాల విమాన సర్వీసులపై ద్వైపాక్షిక హక్కులను పూర్తిగా ఉపయోగించుకోగల మెరుగైన వాతావరణం అధిగమించే లక్ష్యమని USDOT శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. COVID-19 మహమ్మారి కారణంగా 2020 ప్రారంభంలో పరిమితులు విధించబడటానికి ముందు వారానికి 24 విమానాలు 150 ట్రిపులను అనుమతించే వారు. ఇప్పటికీ అదే కొనసాగుతోంది. మే 3న, USDOT చైనా విమానయాన సంస్థలు US ప్రయాణీకుల కోసం వారానికి 12 రౌండ్-ట్రిప్లకు పెంచడానికి అనుమతించింది. అమెరికా నుంచి బీజింగ్కు గతంలో వారంలో 8 ట్రిపులను మాత్రమే అనుమతించే వారు.
తాజావార్తలు
-
CJP: సీజేపీ-డెమొక్రటిక్ ఏర్పాటు.. కాక్రోచ్ పార్టీలో చీలిక.. కేజ్రీవాల్ టీమ్గా మారిందని ఆరోపణ..
-
Tilak Varma: 55 ఏళ్ల చరిత్ర తిరగరాసిన తిలక్ వర్మ.. అసలైన ట్విస్ట్ ఇదే..
-
Mayawati: ఎన్నికల వేళ మేనల్లుడికి మాయావతి షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
-
Bethlehem Kudumba Unit : ‘బెత్లెహం కుడుంబ యూనిట్’ తెలుగు విడుదలకు అడ్డంకి
-
Nara Lokesh: వాయిదాపడే ప్రసక్తే లేదు.. స్థానిక ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలి!
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!