Modi-Trump: జీ7 వేదికగా మోడీతో దిగిన ఆసక్తికర ఫొటో షేర్ చేసిన ట్రంప్
- జీ 7 వేదికగా ట్రంప్-మోడీ భేటీ
- ఆసక్తికర ఫొటో షేర్ చేసిన ట్రంప్
- ఫొటోలో సెర్గియా గోర్ కూడా ప్రత్యక్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫ్రాన్స్ వేదికగా బుధవారం జీ 7 సదస్సులో ప్రధాని మోడీ-అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇరువురి మధ్య కీలక సంభాషణ జరిగింది. పనిలో పనిగా మోడీపై ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఫొటోను ట్రూత్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘చీజ్ చెప్పండి’ అంటూ ఫొటో పెట్టారు. ఈ ఫొటోలో మోడీ-ట్రంప్తో సహా భారత్లోని అమెరికా రాయబారి అయిన సెర్గియా గోర్ కూడా ప్రత్యక్షమయ్యారు.

Also Read
- Pakistan Cargo Plane Missing: ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న పాకిస్తానీ కార్గో విమానం.. అరేబియా సముద్రంపై గల్లంతు
- Crude Oil: ఇరాన్పై అమెరికా వార్.. చమురు ధరలు క్రాష్! భారత్లో లీటర్ పెట్రోల్ రేట్ ఎంతంటే?
- US Airstrikes on Iran: ఆపండ్రోయ్.. ఖేష్మ్ ద్వీపం, బందర్ అబ్బాస్పై అమెరికా బాంబులు, పేలుళ్లతో వణికిన ఇరాన్
- Hormuz Tank Attacks: హోర్ముజ్ జలసంధిలో యుద్ధ వాతావరణం.. 24 గంటల్లో 3 ఆయిల్ ట్యాంకర్లపై దాడులు!
ఫొటోను సెర్గియో గోర్ పోస్టు చేయగా.. దాన్ని ట్రంప్ రీషేర్ చేశారు. అమెరికాలో భారత పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయని ఆ పోస్టులో పేర్కొన్నారు. ‘‘ట్రంప్ నాయకత్వంలో అమెరికాలోకి రికార్డు స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి. భారత కంపెనీలు టెక్నాలజీ, తయారీ, ఔషధ రంగాల్లో 20.5 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు రూపొందించాయి’’ అని సెర్గియా గోర్ వెల్లడించారు. 12 భారతీయ కంపెనీలు 1.1 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ప్రకటించాయని.. ఇవి అమెరికాలో ఉపాధి అవకాశాలు, సరఫరా గొలుసులను బలోపేతం చేస్తాయని తెలిపారు.
2025 ఫిబ్రవరిలో మోడీ అమెరికా పర్యటన తర్వాత ఇరువురు నేతలు ముఖాముఖిగా కలుసుకోవడం ఇదే తొలిసారి. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ట్రంప్.. మోడీపై మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘మాకు చాలా మంచి సమావేశం జరిగింది. మోడీ చాలా తెలివైన నాయకుడు. కఠినమైన చర్చాకర్త. భవిష్యత్తులో ఎప్పుడో ఒక సమయంలో నేను భారత్ను సందర్శిస్తాను.’’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఇటీవల భారత్-అమెరికా సంబంధాల్లో కొన్ని సవాళ్లు ఎదురవుతున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. భారత వస్తువులపై అమెరికా సుంకాలు, రష్యా చమురు కొనుగోళ్లపై ఆంక్షలు, గల్ఫ్ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై దాడుల్లో భారత నావికుల మృతి వంటి అంశాలు ఇరుదేశాల మధ్య చర్చకు వచ్చాయి.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ.. హార్ముజ్ జలసంధిలో పనిచేస్తున్న భారతీయ నావికుల భద్రత అంశాన్ని ట్రంప్ దృష్టికి తీసుకెళ్లారు. ‘‘ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది భారతీయ నావికులు సముద్ర వాణిజ్య మార్గాల్లో సేవలందిస్తున్నారు. ముఖ్యంగా హార్ముజ్ జలసంధిలో వారి భద్రత మాకు అత్యంత ప్రాధాన్యమైన అంశం’’ అని మోడీ పేర్కొన్నారు. అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ఈ అవగాహన కుదిరేందుకు మీరు ఎంతో కృషి చేశారు. ఈ ఒప్పందం అమలులో నావికుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం లభిస్తుందని నమ్ముతున్నాను’’ అని మోడీ తెలిపారు.
భారతీయ నావికుల మరణాలపై సంతాపం తెలిపారా అని ప్రశ్నించగా.. ట్రంప్ ‘‘అది చాలా ప్రమాదకరమైన వృత్తి. మేము కలిసి పనిచేస్తున్నాం. వారంతా గొప్ప వ్యక్తులు’’ అని స్పందించారు. అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రస్తావించిన ట్రంప్.. ‘‘భారత్పై ఎవరైనా దాడి చేస్తే మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఎవరైనా మోడీపై దాడి చేస్తే మేము ఆయనకు అండగా ఉంటాం’’ అని వ్యాఖ్యానించారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఇదిలా ఉంటే మోడీ-ట్రంప్ భేటీ మరుసటి రోజే ఢిల్లీలో అమిత్ షాను సెర్గియా గోర్ కలవడం ఆసక్తి రేపుతోంది. ఉగ్రవాదంపై చర్చించినట్లుగా గోర్ తెలిపారు.

తాజావార్తలు
-
Love Marriage: తల్లడిల్లిన కన్నపేగు.. తల్లిదండ్రులు కాళ్లమీద పడి వేడుకున్నా.. ప్రియుడితోనే వెళ్లిన కూతురు (వీడియో)
-
FIFA World Cup 2026లో అసలైన పోరు మొదలు.. చివరి ఎనిమిది జట్ల షెడ్యూల్ ఇదే.!
-
Shilpa Shirodkar: మహేష్ బాబు చేసిన సీక్రెట్ పని.. ఏళ్ల తర్వాత బయటపెట్టిన శిల్పా శిరోద్కర్
-
YSR 77th Birth Anniversary: మీరే నా స్ఫూర్తి.. మీ ఆశీస్సులే నా ధైర్యం’.. వైఎస్ జగన్ ఎమోషనల్ ట్వీట్ వైరల్..
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
ట్రెండింగ్
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!