Trump: కాల్పుల ఎఫెక్ట్.. గ్రీన్ కార్డ్ హోల్డర్స్కు కష్టాలే!.. ట్రంప్ కీలక ఆదేశాలు
- వైట్హౌస్ దగ్గర కాల్పుల ఎఫెక్ట్
- గ్రీన్ కార్డ్స్ సమీక్షించాలని ట్రంప్ ఆదేశాలు
- పలువురిని అరెస్ట్ చేసినట్లు కథనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్ర రాజ్యం అమెరికా పరిపాలన కేంద్రం వైట్హౌస్ దగ్గర కాల్పులు తీవ్ర అలజడి రేకెత్తించింది. నేషనల్ గార్డ్స్పై ఆప్ఘని వాసి జరిపిన కాల్పులు అధ్యక్షుడు ట్రంప్కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఇద్దరు గార్డ్స్పై కాల్పులు జరపగా ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇంకొకరు చికిత్స పొందుతున్నారు.
ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్కు బిగ్ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
Also Read
- Turkey-Israel tensions: టర్కీ-ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు.. సిరియా వేదికగా కొత్త ముప్పు!
- Iran-US War: ఇరాన్ కొత్త ప్లాన్.. ఈసారి టార్గెట్ ఈ దేశాలేనా..!
- Trump: ట్రంప్తో ఫొటో దిగాలని ముచ్చటపడుతున్నారా? ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
- Jammu Kashmir: పాక్కు దిమ్మతిరిగే ప్రకటన.. కాశ్మీర్పై యూఎస్ రాయబారి సెర్గియో గోర్ కీలక వ్యాఖ్యలు
ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. నిందితుడు జంతువు.. పిచ్చోడు అంటూ మండిపడ్డారు. జో బైడెన్ ప్రభుత్వం కారణంగానే ఇదంతా జరిగిందంటూ ట్రంప్ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జో బైడెన్ను ఎందుకు నిందిస్తున్నారంటూ నిలదీసిన విలేకరిపై కూడా ట్రంప్ మండిపడ్డారు. తెలివి తక్కువవారా? అంటూ పదే పదే రుసరుసలాడారు.
ఇది కూడా చదవండి: Hong Kong fire: 94కు చేరిన అగ్నిప్రమాద మరణాలు.. పలువురు ఆచూకీ గల్లంతు
నిందితుడు రహ్మానుల్లా లకన్వాల్ ఆప్ఘన్ జాతీయుడుగా గుర్తించారు. 2021 ఆగస్టులో ఆప్ఘన్స్థాన్లో బైడెన్ ప్రభుత్వం అమెరికా సైన్యాన్ని ఉపసంహరించుకుంది. దీంతో తాలిబన్లు ఆప్ఘనిస్థాన్ను హస్తగతం చేసుకున్నారు. ఆ సమయంలో బైడెన్ ప్రభుత్వం ఆపరేషన్ అల్లీస్ వెల్కమ్ పునరావాస కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా 70, 000 ఆప్ఘన్ జాతీయులు అమెరికాలోకి ప్రవేశించారు. అలా ప్రవేశించినవాడే రహ్మానుల్లా. బైడెన్ నిర్ణయం కారణంగానే ఈరోజు అమెరికాలో ఉగ్ర దాడి జరిగిందంటూ ట్రంప్ ఫైరయ్యారు.
పునరావాస కార్యక్రమం ద్వారా ప్రవేశించిన వారికి శాశ్వత హోదా కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం వీలు కల్పించింది. రహ్మానుల్లా కూడా డిసెంబర్ 2024లో శాశ్వత ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ట్రంప్ అధికారం చేపట్టిన మూడు నెలల తర్వాత.. అనగా ఏప్రిల్ 23న ఆమోదించబడింది. రహ్మానుల్లా ప్రస్తుతం వాషింగ్టన్లో నివాసం ఉంటున్నాడు. ఇతడికి గతంలో ఎలాంటి నేర చరిత్ర లేనట్లుగా ఒక అధికారి తెలిపారు.
అయితే రహ్మానుల్లా ఉన్నట్టుండి ఉన్మాదిలా మారి వైట్హౌస్ దగ్గర కాల్పులకు తెగబడ్డాడు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. తాజాగా కాల్పుల ఘటన నేపథ్యంలో ట్రంప్ కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రీన్ కార్డు హోల్డర్స్ వీసాలను సమీక్షించాలని ఆదేశించారు. దీంతో ఆప్ఘన్ జాతీయుల గ్రీన్ కార్డులను అధికారులు సమీక్షిస్తున్నారు. ఇక ఇంటర్వ్యూలకు అని పిలిచి పలువురిని అరెస్ట్ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కొత్తగా ఆప్ఘన్ జాతీయుల దరఖాస్తులను కూడా నిలిపివేసేశారు. మరోవైపు వీసాల గడువు ముగిసినా అక్రమంగా ఉంటున్న వాళ్లను కూడా అదుపులోకి తీసుకుంటున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.
REPORTER: Officials say the suspect in the DC shooting was vetted and it came up clean
TRUMP: He went cuckoo. He went nuts. There was no vetting
REPORTER: Actually, your DOJ IG just reported that there was thorough vetting of Afghans who were brought into the US. So why do you… pic.twitter.com/0SRbdZ6RjU
— Aaron Rupar (@atrupar) November 28, 2025
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!