US-Iran Peace Deal: కొన్ని నెలలుగా సాగుతున్న ఇరాన్ యుద్ధానికి ఎండ్ కార్డ్ పడినట్లే కనిపిస్తోంది. యూఎస్-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. అయితే, ఈ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బృందంలోనే చీలికలు కనిపిస్తున్నాయి. ఈ ఒప్పందం ద్వారా ఇరాన్కు చాలా ఎక్కువ స్వేచ్ఛ ఇచ్చినట్లు సీఐఏతో పాటు ట్రంప్ టీమ్లోని కొందరు భావిస్తున్నారు. 2015లో ఇరాన్తో ఇలాంటి ఒప్పందాన్ని కుదుర్చుకోవడంపై అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామాపై ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం, ఇరాన్ శాంతి ఒప్పందం విషయంలో ట్రంప్కు వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, ట్రంప్ రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ మద్దతు ఇస్తున్నారు. విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ వ్యతిరేకిస్తున్న వారిలో ఉన్నారు.
ఈ విషయాన్ని అమెరికన్ వెబ్సైట్ ఆక్సియోస్ ఒక నివేదికను ప్రచురించింది. ఇరాన్లోని సీఐఏ ఏజెంట్ల ద్వారా అందిన సమాచారంలో అమెరికా మరోసారి ద్రోహానికి గురవుతున్నట్లు సీఐఏ చెబుతోంది. అమెరికా కోరిన విధంగా ఇరాన్ అణు రాయితీలపై సందేహాలు వ్యక్తమవుతున్నట్లు సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్, ట్రంప్ ఇతర ఉన్నతాధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. అమెరికా డిమాండ్ చేస్తున్నట్లు అణు కార్యక్రమాలను ఇరాన్ నిలిపివేస్తుందనే విషయంలో సందేహాలు ఉన్నట్లు సీఐఏ, మార్కో రూబియో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇరాన్ ఒప్పందంలో అత్యంత కీలకమైంది, “ఇది ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను కలిగి ఉండదని, అత్యంత సుసంపన్నమైన యురేనియంను నిల్వ చేయలేదని, ప్రపంచ ఇంధన సరఫరాను అడ్డుకోవద్దు’’ వీటిపై అమెరికాలోని ఒక వర్గం సందేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, తదుపరి చర్యలపై చర్చించేందుకు జేడీ వాన్స్, విట్కాఫ్, కుష్నర్లు శుక్రవారం ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్-బఘేర్ ఘాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీలతో పాటు పాకిస్థాన్, ఖతార్ల మధ్యవర్తులతో సమావేశం కానున్నారు.

