Mexican: మెక్సికో సైనికుల కాల్పులు.. భారతీయుడి సహా ఆరుగురు వలసదారుల మృతి
- మెక్సికో సైనికుల కాల్పులు
- భారతీయుడి సహా ఆరుగురు వలసదారుల మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్ర రాజ్యం అమెరికాలోని మెక్సికోలో సైన్యం జరిపిన కాల్పుల్లో భారతీయుడి సహా ఆరుగురు వలసదారులు మృతిచెందారు. ట్రక్కులో వెళ్తుండగా కాల్పులు జరపడంతో సంఘటనాస్థలిలో నలుగురు చనిపోగా.. చికిత్స పొందుతూ మరో ఇద్దరు చనిపోయారు. మరికొందరికి గాయాలయ్యాయి. వీళ్లంతా భారత్, నేపాల్, పాకిస్థాన్, తదితర దేశాల నుంచి వలసవచ్చినవారిగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: ICICI Bank Fraud: ఐసిఐసిఐ బ్యాంక్లో గోల్మాల్.. ఖాతాదారుల ఆందోళన
Also Read
- Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
- Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
గ్వాటెమాలా సరిహద్దు సమీపంలో మెక్సికన్ సైనికులు హఠాత్తుగా ట్రక్కుపై కాల్పులు జరిపినట్లు సమాచారం. దీంతో ఆరుగురు వలసదారులు చనిపోయారు. మరో పదిహేడు మంది వలసదారులు క్షేమంగా ఉన్నారు. గమ్యస్థానానికి చేరుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక ఈ సంఘటనలో పాల్గొన్న ఇద్దరు సైనికులను అధికారులు విధుల నుంచి తప్పించినట్లు మెక్సికో రక్షణ శాఖ బుధవారం తెలిపింది. ఇద్దరు సైనికులు ట్రక్కుపై కాల్పులు జరిపినట్లు తేలిందన్నారు. నలుగురు వలసదారులు సంఘటనా స్థలంలో చనిపోగా.. 12 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు. మిగిలిన వారి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Mahindra Thar Roxx: మహీంద్రా థార్ రాక్స్ రికార్డ్.. గంటలో ఏకంగా 1.76 లక్షల బుకింగ్స్..
ఇదిలా ఉంటే వలసదారులు కాల్పుల వల్ల మరణించారా లేదా ట్రక్కులో ఏవైనా ఆయుధాలు దొరికాయా అనే విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు. మరో పదిహేడు మంది వలసదారులు క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. మొత్తం ట్రక్కులో 33 మంది వలసదారులు ఉన్నట్లుగా వెల్లడించారు. ఈ ప్రాంతం స్మగ్లింగ్కు కేంద్రంగా మారింది. వలసదారులు తరచుగా సరుకు రవాణా ట్రక్కుల ద్వారా చేస్తుంటారు. ఆయుధాలతో కాల్పులు జరిపిన ఇద్దరు సైనికులను విధుల నుంచి తప్పించామని.. విచారణ కొనసాగుతోందని ఆ శాఖ పేర్కొంది.
ఇది కూడా చదవండి: Typhoon Krathon: దక్షిణ తైవాన్ను హడలెత్తించిన క్రాథాన్ తుఫాన్.. ఇద్దరు మృతి
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!