Bangladeshi PM Reaches India: అగర్తలకు చేరుకున్న షేక్ హసీన.. నిర్ధారించిన త్రిపుర పోలీసులు
- బంగ్లాదేశ్లో ఉగ్రరూపం దాల్చిన హింస.. అదుపు తప్పిన పరిస్థితి..
- భారత్కు చేరుకున్న షేక్ హసీన.. ఆమె సోదరి షేక్ రెహానా..
- హసీనా అగర్తలలో ల్యాండ్ అయినట్లు నిర్థారించిన త్రిపుర పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladeshi PM Reaches India: బంగ్లాదేశ్లో ఇవాళ పరిస్థితి అదుపు తప్పింది. ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ చెలరేగిన హింస తీవ్ర రూపం దాల్చడంతో.. వేలాది మంది నిరసనకారులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని పదవికి షేక్ హసీనా రిజైన్ చేశారు. అనంతరం ఆర్మీ హెలికాప్టర్లో బంగ్లాదేశ్ మీదుగా భారత్ చేరుకున్నట్లు సమాచారం.
Read Also: Kumaradevam Movies Tree : 300 సినిమాల్లో కనిపించిన చెట్టు ఇక లేదు
Also Read
- Emmanuel Macron: నటి మెసేజ్లే కారణమా..? ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్కు భార్య చెంపదెబ్బ!
- Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!
- Israeli base in Iraq: ప్రపంచ రాజకీయాల్లో భారీ ప్రకంపనలు.. ఇరాక్లో ఇజ్రాయెల్ రహస్య స్థాపరం..!
- Norovirus: మరో వైరస్ కలకలం.. 1700 మంది నౌకలోనే క్వారంటైన్..
కాగా, తాజా సమాచారం ప్రకారం.. సోదరి షేక్ రెహానాతో కలిసి షేక్ హసీనా త్రిపుర రాష్ట్రంలోని అగర్తలలో ల్యాండ్ అయినట్లు తెలుస్తుంది. హసీనా రాకను త్రిపుర పోలీసులు నిర్ధారించినట్లుగా జాతీయ మీడియాలో వార్తలు ప్రసారం అవుతున్నాయి. బంగ్లాదేశ్ లో ఆందోళన నేపథ్యంలో దేశ రాజధాని ఢాకాలోని ప్యాలెస్ నుంచి ఆమె మధ్యాహ్నం 2: 30 గంటలకు ఆర్మీ ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి.. తాజాగా అగర్తలలో ల్యాండ్ అయినట్లు త్రిపుర పోలీసులు కన్ఫామ్ చేసినట్లు జాతీయ మీడియా వెల్లడించింది.
Read Also: Bangladesh Crisis: బంగ్లాదేశ్లో అల్లర్ల ఎఫెక్ట్.. భారత్-బంగ్లా సరిహద్దులో బీఎస్ఎఫ్ హై అలర్ట్..!
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బంగ్లాదేశ్లో లా అండ్ ఆర్డర్ మొత్తం సైన్యం చేతుల్లోకి వెళ్లిపోయింది. త్వరలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆర్మీ చీఫ్ వాకర్- ఉజ్- జమాన్ ప్రకటించారు. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయడంతో.. దేశాన్ని తాత్కాలిక ప్రభుత్వం నడుపుతుంది అన్నారు. త్వరలోనే దేశంలో తిరిగి శాంతిని నెలకొల్పుతామన్నారు. దేశ పౌరులు సంయమనం పాటించాలి.. సంక్షోభానికి పరిష్కారం కనుగొంటాం.. విద్యార్థులు నిరసనలు ఆపేయాలని కోరుతున్నామని బంగ్లా ఆర్మీ చీఫ్ వాకర్-ఉజ్-జమాన్ వెల్లడించినట్లు రాయిటర్స్ పేర్కొనింది.
తాజావార్తలు
-
Akash Ambani: జియో సామ్రాజ్యానికి కొత్త బాస్.. అంబానీ వారసుడి చేతికి జియో ప్లాట్ఫామ్స్ పగ్గాలు!
-
Uttar Pradesh: టీ-షర్ట్, ప్యాంట్ వేసుకోవడంపై గొడవ.. భార్యను చంపిన భర్త ఆత్మహత్య..
-
Weather Forecast: అండమాన్ సమీపంలో నైరుతి రుతుపవనాలు.. రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు!
-
Emmanuel Macron: నటి మెసేజ్లే కారణమా..? ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్కు భార్య చెంపదెబ్బ!
-
Prateek Yadav: అల్లుడి చితికి నిప్పంటించిన మామ.. మాజీ సీఎం తమ్ముడి అంత్యక్రియలు పూర్తి
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?