World Tigers Day: నేడు ప్రపంచ పులుల దినోత్సవం.. పూరీ తీరంలో 15 అడుగుల సైకత చిత్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
World Tigers Day: ఒక్కో రోజుకు ఒక్కో దినోత్సవంతో వేడుకలను చేస్తున్నారు. అందులో బాగంగా నేడు ప్రపంచ పులుల దినోత్సవం. ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా పులులను రక్షించుకుంటూ పర్యావరణాన్ని కాపాడుకుందామంటూ పర్యావర్ణ వేత్తలు చెబుతున్నారు. సందర్భానుసారంగా అందరినీ ఆలోచింపచేసేలా ఇసుకతో చిత్రాలను రూపొందిస్తూ అందరినీ ఆలోచింప చేసే ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా ఒడిశాలోని పూరీ తీరంలో ఇసుకతో 15 అడుగుల ఎత్తున్న పులి బొమ్మను రూపొందించారు. తల్లి పులి తన పిల్లను ప్రేమతో నిమురుతున్నట్లుగా ఈ చిత్రాన్ని తయారు చేశారు. పర్యావరణాన్ని కాపాడాలంటే అడవుల్లో ఉండే తమను రక్షించండి (Save Us to Save the Environment) అంటూ జనారణ్యంలో ఉండే జనాలకు పులులు చెబుతున్నట్లుగా ఈ సైకత శిల్పాన్ని ఆయన చెక్కారు. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో ఉన్న పులుల జనాభా క్రమంగా తగ్గిపోతున్నది. దీంతో పులులను రక్షించుకోవాలనే ఉద్దేశంతో 2010 నుంచి ప్రతిఏటా జూలై 29ని ప్రపంచ పులులు దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
Read also: Business Idea: మహిళలకు అదిరిపోయే బిజినెస్.. ఇంట్లో నుంచి లక్షలు సంపాధించవచ్చు..
Also Read
- PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
- Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
- Trump: ప్రపంచం సురక్షితం.. చమురు మళ్లీ ప్రవహిస్తోంది.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Hormuz: 3 నెలల తర్వాత సాఫీగా వాణిజ్య నౌకలు ప్రయాణం.. ఫొటోలు వైరల్
ప్రపంచంలో సుమారు 5 వేల పులులు ఉంటే ఒక్క భారత్లో 3 వేలకుపైగా ఉండటం విశేషం. అడవి పులులు అత్యధికంగా ఉన్నది కూడా మన దేశంలోనే కావడం గమనార్హం. ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలతో 2006 నుంచి పులుల సంఖ్య మరింత పెరుగుతూ వస్తున్నది. 2006 ఏడాదిలో 1,411గా ఉన్న పులుల సంఖ్య.. 2010 నాటికి 1,706కు చేరింది. 2014లో 2,226కి చేరగా.. 2019లో 2,967, 2023 వచ్చేసరికి పులుల సంఖ్య 3,167కు పెరిగింది. దేశంలో ప్రతి పదేళ్లకు జనాభా లెక్కిస్తున్నట్టే.. ప్రతి నాలుగేండ్లకు పులుల జనాభాను లెక్కిస్తారు. భారత్ తర్వాత రష్యాలో అత్యధికంగా 540 పులులు ఉన్నాయి. ఇండోనేషియాలో 500, నేపాల్లో 355, థాయిలాండ్లో 189, మలేషియాలో 150 చొప్పున ఉన్నాయి. ఇక మన పొరుగు దేశం చైనాలో 50 మాత్రమే ఉండగా, మయన్మార్లో 22, వియత్నాంలో 5, లావోస్లో 2 పులులు ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి.
#WATCH | Odisha: Sand artist Sudarsan Pattnaik created a 15-foot tall tiger on the occasion of World Tiger Day, in Puri. (28.07) pic.twitter.com/XJDCR2Iaf9
— ANI (@ANI) July 29, 2023
తాజావార్తలు
-
PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
-
Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
-
Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్ను కలిసిన బైద్యనాథ్ రామ్
-
Rajyasabha Elections: మా ఓటమికి లెఫ్ట్, ఆర్జేడీలే కారణం.. రాజ్యసభ ఓటమిపై కాంగ్రెస్ ఆగ్రహం..
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..