వ్యాక్సిన్ తీసుకున్నవారిలోనే 75శాతం పాజిటివ్ కేసులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. క్రమంగా వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు మొగ్గుచూపుతున్నారు.. మొదటల్లో కొన్ని అపోహలు ఉన్నా.. ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో ప్రజలు వ్యాక్సిన్ కోసం పోటీపడే పరిస్థితి వచ్చింది. అయితే, గత 4 వారాల్లో సింగపూర్లో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల్లో 75 శాతం కేసులు వ్యాక్సిన్ తీసుకున్నవారిలో నమోదయ్యాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. సింగపూర్ సిటీలో ముమ్మరంగా వ్యాక్సినేషన్ చేపట్టడంతో టీకాలు తీసుకోని వారిసంఖ్య పరిమితంగా ఉంది. యూఏఈ తర్వాత సింగపూర్లోనే అత్యధికంగా 75 శాతం జనాభాకు టీకాలు వేశారు. జనాభాలో సగం మంది వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారు. కానీ, ఈ గణాంకాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి.
సింగపూర్లో గత నాలుగు వారాల్లో 1096 కరోనా కేసులు నమోదు కాగా.. అందులో 44 శాతం మంది అంటే 484 మంది వ్యాక్సిన్ పూర్తి డోస్ తీసుకున్న వారు ఉన్నారు.. ఇక, 30 శాతం మంది పాక్షికంగా టీకాలు తీసుకున్నవారు ఉన్నారు. 25 శాతం మంది రోగులు అసలు టీకా సింగిల్ డోస్ కూడా తీసుకోలేదు. ఈ కేసుల్లో తీవ్ర లక్షణాలతో దవాఖానాలో చేరి ఆక్సిజన్ అవసరమైన వారు కేవలం ఏడుగురు కాగా వీరిలో ఐదుగురు టీకా తీసుకోని వారు ఒకరు సింగిల్ డోసు తీసుకున్న వ్యక్తి ఉన్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే, వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదని, కొందరిలో స్వల్ప లక్షణాలు కనిపించాయని వెల్లడించింది. సింగపూర్లో అత్యధిక జనాభా టీకాలు తీసుకోవడంతో వారిలోనూ ఇన్ఫెక్షన్స్ నమోదయ్యాయని సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ డీన్ టియో యక్ యింగ్ పేర్కొన్నారు. కాగా, అక్కడ ప్రజలకు ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచింది ప్రభుత్వం.
Also Read
- IRGC attack US 5th Fleet: ఇరాన్ ప్రతీకారం.. అమెరికా 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై IRGC దాడి!
- Pakistan Airstrikes Afghanistan: ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 13 మంది మృతి
- US Strikes on Iran: ఇరాన్పై అమెరికా దాడులు.. హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు.. చమురు సరఫరాపై ఆందోళనలు
- SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
తాజావార్తలు
-
PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
-
Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
-
Tilak Varma: అతడు క్రీజులో ఉన్నంత సేపు సుస్సు పడింది.. ఓటమి తప్పదనుకున్నా: తిలక్ వర్మ
-
UPI Scam Alert : UPI ద్వారా డబ్బు పంపిన వెంటనే మోసపోయారా? మొదటి 30 నిమిషాల్లో ఏం చేస్తే నష్టం తగ్గే అవకాశం ఉంటుంది
-
Story Board : ప్రధాని మోడీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? నెహ్రూ రికార్డు ఎలా బద్దలు కాబోతుంది?
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి