Afghan-Pak War: ఆఫ్ఘాన్-పాక్ యుద్ధం.. ట్రెండింగ్లో ‘‘93,000’’.. భారత్తో సంబంధం..
- పాకిస్తాన్ను చుక్కలు చూపిస్తున్న ఆఫ్ఘాన్..
- 1971 యుద్ధాన్ని చూపిస్తాన్ పాక్ పరువు తీస్తున్న ఆఫ్ఘాన్లు..
- సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ‘‘93,000’’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Afghan-Pak War: పాకిస్తాన్కు ఆఫ్ఘానిస్తాన్ చుక్కలు చూపిస్తోంది. గత కొన్ని రోజులుగా ఇరు దేశాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. తాలిబాన్ దళాలు, పాక్ సైన్యానికి చుక్కలు చూపిస్తోంది. డ్యూరాండ్ రేఖ వద్ద ఆఫ్ఘాన్ దళాలు పాక్ సైన్యానికి చెందిన పలు పోస్టుల్ని స్వాధీనం చేసుకున్నాయి. పలువురు పాక్ సైనికుల్ని నిర్భందించి, కాబూల్కు తరలించింది. అంతే కాకుండా పాక్ సైన్యానికి చెందిన ట్యాంకుల్ని కాబూల్ తీసుకెళ్లి, ఊరేగించడం వైరల్గా మారింది.
ఇదిలా ఉంటే, ఆఫ్ఘాన్ పాక్ ఉద్రిక్తతల మధ్య ‘‘93000’’ అనేది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. నెటిజన్లు పాకిస్తాన్, దాని ఆర్మీపై తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. 1971 బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన యుద్ధంలో భారత్, పాకిస్తాన్ను చిత్తుగా ఓడించింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్కు చెందిన 93,000 మంది సైనికులు భారత్ ముందు లొంగిపోయారు. ఇప్పుడు, ఆఫ్ఘాన్ కూడా పాకిస్తాన్ను దారుణంగా దెబ్బ కొడుతోంది. ఈ నేపథ్యంలో, ఆనాటి భారత విజయాన్ని గుర్తు చేస్తూ ఆఫ్ఘాన్కు మద్దతుగా ‘‘93000’’ ట్రెండ్ అవుతోంది.
Also Read
- Russia: పుతిన్ దేశంలో పెట్రోల్ బంకులు ఖాళీ! రష్యాకు పెట్రోల్ అమ్ముతున్న భారత్..
- Iran - Israel: ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ గురి.. ట్రంప్ వార్నింగ్ను నెతన్యాహు బ్రేక్ చేస్తారా?
- Russian Couple: ప్రేమ కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన జంట.. 1,454 అడుగుల ఎత్తులో ప్రపోజ్!
- India - Pakistan: భారత్ - పాక్ మధ్య అర్ధరాత్రి ఆసక్తికర ఒప్పందం.. ఏంటో తెలుసా!
Read Also: Siddaramaiah: ఇన్ఫోసిస్ వల్లే ఆయనకు అన్నీ తెలుసా..? నారాయణ మూర్తిపై కర్ణాటక సీఎం విమర్శలు
ఆఫ్ఘానిస్తాన్ కు చెందిన ఓ నెటిజన్.. ‘‘1971లో భారత్ ముందు లొంగారు. 2025లో ఆఫ్ఘానిస్తాన్ ముందు లొంగారు. టీం 93,000గా ఇంకా మారలేదు’’ అని ట్వీట్ చేశారు. మరొకరు ‘‘ప్యాంట్లు పారేసి పారిపోయే విధానం మాత్రం పాకిస్తాన్ సైన్యంలో అసలైన సంప్రదాయం’’ అని ఎగతాళి చేశారు.
ఆఫ్ఘానిస్తాన్ కు చెందిన చాలా మంది దీనిని ‘‘93,000 ప్యాంటు వేడుక 2.0’’ అని పిలుస్తున్నారు. డిసెంబర్ 1971లో పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ అమీర్ అబ్దుల్లా నియాజీ భారత్ లెఫ్టినెంట్ జనరల్ జగ్జిత్ సింగ్ అరోరా ముందు లొంగుబాటు పత్రాలపై సంతకం చేశారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆఫ్ఘాన్ నెటిజన్లు ‘‘ఈ రోజు కాకపోవచ్చు, రేపు కాకపోవచ్చు. కానీ ఖచ్చితంగా ఒకరోజు ఆఫ్ఘాన్ భారత దేశ 93,000 రికార్డును బద్ధలు కొడుతుంది’’ అని పాకిస్తాన్ను వెక్కిరిస్తున్నారు.
తాజావార్తలు
-
Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
-
Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
-
Supreme Court: సుప్రీం కోర్టుకు హనీమూన్ మర్డర్ కేసు.. ఏం జరిగిందంటే..!
-
Anirudh: బక్కోడు మాములోడు కాదుగా!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!