Russia-Ukraine War: అందుకే ఉక్రెయిన్ విద్యుత్ గ్రిడ్స్పై దాడి చేస్తున్నామన్న పుతిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Strikes On Ukraine Power Grid In Response To Crimea Attack Says Putin: ఉక్రెయిన్ పై రష్యా విరుచుకుపడుతోంది. ముఖ్యంగా ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. దీంతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ తో సహా పలు నగరాలు, పట్టణాల్లో విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది. దీంతో చాలా చోట్ల అంధకారం అలుముకుంది. దీంతో పాటు విద్యుత్ లేకపోవడంతో తాగునీటి వంటి మౌళిక సదుపాయాలపై ప్రభావం పడుతోంది. ఇదిలా ఉంటే క్రిమియాలోని తన నౌకాదళంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేయడం వల్లే తాము ఉక్రెయిన్ విద్యుత్ గ్రిడ్స్ లక్ష్యంగా దాడులు చేస్తున్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు.
గత వారం క్రిమియాలోని రష్యా నౌకాదళంపై డ్రోన్ అటాక్ జరిగింది. దీనికి కారణం ఉక్రెయిన్ అని రష్యా ఆరోపిస్తోంది. అయితే రష్యా ఆరోపణల్ని ఉక్రెయిన్ తోసిపుచ్చింది. గతంలో క్రిమియాను రష్యా మెయిన్ ల్యాండ్ ను కలిపే కేర్చ్ బ్రిడ్జిని కూల్చేసింది ఉక్రెయిన్. అప్పటి నుంచి రష్యా డ్రోన్లతో ఉక్రెయిన్ పై విరుచుకుపడుతోంది. ఇరాన్ తయారీ కామికేజ్ డ్రోన్ల సహాయంతో విధ్వంసం సృష్టిస్తోంది. ముఖ్యంగా దేశ విద్యుత్ వ్యవస్థను కుప్పకూల్చే పనిలో ఉంది. హైడ్రో ఎలక్ట్రిక్ డ్యాములతో సహా ప్రధాన విద్యుత్ కేంద్రాలు దెబ్బతిన్నట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. విద్యుత్ లేకపోవడంతో ఇళ్లను వేడిగా ఉంటే పరికరాలు పనిచేయడం లేదు. దీంతో చలితో ప్రజలు అల్లాడిపోతున్నారు.
Also Read
Read Also: MLA Raja Singh: వీడియోలో ఉన్నది రాజాసింగ్ వాయిస్ కాదు.. నేడు మళ్లీ విచారణ
ఉక్రెయిన్ లోని రెండవ పెద్ద నగరమైన ఖార్కివ్ లో సుమారు 1,40,000 మందికి విద్యుల్ లేదని ఖార్కివ్ ప్రాంత గవర్నర్ వెల్లడించారు. ఇదిలా ఉంటే రష్యాకు చెందిన 50 క్షిపణుల్లో 44 క్షిపణులను కూల్చేశామని ఉక్రెయిన్ చెబుతోంది. రష్యా దాడుల వల్ల కీవ్ లో 80 శాతం మందికి నీటి సౌకర్యం నిలిచిపోయినట్లు తెలిపారు. సోమవారం ఉక్రెయిన్ లోని 10 ప్రాంతాల్లో 18 లక్ష్యాలపై డ్రోన్ దాడులు జరిగితే.. ఎక్కువగా విద్యుత్ వ్యవస్థలపైనే జరిగాయని ఉక్రెయిన్ ప్రధాని డెనిస్ ష్మిహాల్ తెలిపారు.
క్రిమియాలోని సెవాస్టోపోల్ లోని ఓడలను లక్ష్యంగా చేసుకుంటూ ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేయడంపై రష్యా ఆగ్రహంతో ఉంది. ఈ దాడి తరువాత రష్యా శనివారం ధాన్యం ఎగుమతిని నిలిపేసింది. పౌర నౌకలు, సరకు రవాణా నౌకలపై ఎలాంటి దాడులు చేయమని ఉక్రెయిన్ హామీ ఇవ్వాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ సోమవారం డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే రష్యా, ప్రపంచ ఆకలితో బ్లాక్ మెయిల్ చేస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ ఆరోపించారు. నల్ల సముద్రంలో అనిశ్చితి కారణంగా, గోధుమ ఎగుమతులపై ప్రభావం పడింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్ లో గోధుమల ధరలు 5 శాతం పెరిగాయి.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!