Russia-Ukraine War: అందుకే ఉక్రెయిన్ విద్యుత్ గ్రిడ్స్పై దాడి చేస్తున్నామన్న పుతిన్
Strikes On Ukraine Power Grid In Response To Crimea Attack Says Putin: ఉక్రెయిన్ పై రష్యా విరుచుకుపడుతోంది. ముఖ్యంగా ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. దీంతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ తో సహా పలు నగరాలు, పట్టణాల్లో విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది. దీంతో చాలా చోట్ల అంధకారం అలుముకుంది. దీంతో పాటు విద్యుత్ లేకపోవడంతో తాగునీటి వంటి మౌళిక సదుపాయాలపై ప్రభావం పడుతోంది. ఇదిలా ఉంటే క్రిమియాలోని తన నౌకాదళంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేయడం వల్లే తాము ఉక్రెయిన్ విద్యుత్ గ్రిడ్స్ లక్ష్యంగా దాడులు చేస్తున్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు.
గత వారం క్రిమియాలోని రష్యా నౌకాదళంపై డ్రోన్ అటాక్ జరిగింది. దీనికి కారణం ఉక్రెయిన్ అని రష్యా ఆరోపిస్తోంది. అయితే రష్యా ఆరోపణల్ని ఉక్రెయిన్ తోసిపుచ్చింది. గతంలో క్రిమియాను రష్యా మెయిన్ ల్యాండ్ ను కలిపే కేర్చ్ బ్రిడ్జిని కూల్చేసింది ఉక్రెయిన్. అప్పటి నుంచి రష్యా డ్రోన్లతో ఉక్రెయిన్ పై విరుచుకుపడుతోంది. ఇరాన్ తయారీ కామికేజ్ డ్రోన్ల సహాయంతో విధ్వంసం సృష్టిస్తోంది. ముఖ్యంగా దేశ విద్యుత్ వ్యవస్థను కుప్పకూల్చే పనిలో ఉంది. హైడ్రో ఎలక్ట్రిక్ డ్యాములతో సహా ప్రధాన విద్యుత్ కేంద్రాలు దెబ్బతిన్నట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. విద్యుత్ లేకపోవడంతో ఇళ్లను వేడిగా ఉంటే పరికరాలు పనిచేయడం లేదు. దీంతో చలితో ప్రజలు అల్లాడిపోతున్నారు.
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
- Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
- China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
Read Also: MLA Raja Singh: వీడియోలో ఉన్నది రాజాసింగ్ వాయిస్ కాదు.. నేడు మళ్లీ విచారణ
ఉక్రెయిన్ లోని రెండవ పెద్ద నగరమైన ఖార్కివ్ లో సుమారు 1,40,000 మందికి విద్యుల్ లేదని ఖార్కివ్ ప్రాంత గవర్నర్ వెల్లడించారు. ఇదిలా ఉంటే రష్యాకు చెందిన 50 క్షిపణుల్లో 44 క్షిపణులను కూల్చేశామని ఉక్రెయిన్ చెబుతోంది. రష్యా దాడుల వల్ల కీవ్ లో 80 శాతం మందికి నీటి సౌకర్యం నిలిచిపోయినట్లు తెలిపారు. సోమవారం ఉక్రెయిన్ లోని 10 ప్రాంతాల్లో 18 లక్ష్యాలపై డ్రోన్ దాడులు జరిగితే.. ఎక్కువగా విద్యుత్ వ్యవస్థలపైనే జరిగాయని ఉక్రెయిన్ ప్రధాని డెనిస్ ష్మిహాల్ తెలిపారు.
క్రిమియాలోని సెవాస్టోపోల్ లోని ఓడలను లక్ష్యంగా చేసుకుంటూ ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేయడంపై రష్యా ఆగ్రహంతో ఉంది. ఈ దాడి తరువాత రష్యా శనివారం ధాన్యం ఎగుమతిని నిలిపేసింది. పౌర నౌకలు, సరకు రవాణా నౌకలపై ఎలాంటి దాడులు చేయమని ఉక్రెయిన్ హామీ ఇవ్వాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ సోమవారం డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే రష్యా, ప్రపంచ ఆకలితో బ్లాక్ మెయిల్ చేస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ ఆరోపించారు. నల్ల సముద్రంలో అనిశ్చితి కారణంగా, గోధుమ ఎగుమతులపై ప్రభావం పడింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్ లో గోధుమల ధరలు 5 శాతం పెరిగాయి.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో