అప్ఘన్ లో ఆకలి చావులు తప్పవా?
కరోనా మహమ్మరితో ప్రపంచం ఓవైపు పోరాడుతుండగా అప్ఘన్ మాత్రం తాలిబన్లతో పోరాడాల్సి వస్తోంది. అమెరికా బలగాల ఉపసంహరణతో తాలిబన్లు అప్ఘన్లో రెచ్చిపోతున్నారు. తాలిబన్ల దురాక్రమణతో ఆదేశ తాజా మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ విదేశాలకు పారిపోయి తలదాచుకున్నాడంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాలిబన్ల రాక్షస పాలన ఇదివరకే ఓసారి చూసిన అప్ఘన్లు వారి పాలనను ఒప్పుకునేది లేదని తెగెసి చెబుతున్నారు. తాలిబన్లు మాత్రం తమ పాలనను అప్ఘన్లు ఒప్పుకోవాల్సిందే.. లేదంటే చావాల్సిందే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తమకు ఎదురుతిరిగిన వారిపై కాల్పులకు పాల్పడుతూ ప్రజల్లో భయోత్పాతం సృష్టిస్తున్నారు.
అప్ఘన్లో ఇప్పుడక్కడ హృదయవిదారక సంఘటనలే కన్పిస్తున్నాయి. ముఖ్యంగా ఆడవాళ్ల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోవడం ప్రతీఒక్కరినీ ఆందోళనకు గురిచేస్తోంది. అప్ఘన్ ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో ప్రపంచ దేశాల నుంచి ఆ దేశానికి ఇప్పటివరకు అందిస్తున్న సాయాన్ని నిలిపివేశాయి. దీంతో ప్రస్తుతం అక్కడ ఇప్పుడు ఆకలికేకలు రాజ్యమేలుతున్నాయి. లక్షలాది మందికి ఒక్కపూట తిండి కూడా దొరకని పరిస్థితి ఉందని ఐక్యరాజ్య సమితి మానవతా విభాగం అధ్యక్షుడు రమీజ్ అలక్ బరోవ్ ఆందోళన వ్యక్తం చేశారు. సగం మందికి పైగా అప్ఘాన్ చిన్నారులు రోజు రాత్రి పూట ఆహారం తింటున్నారో.. లేదో కూడా తెలియని దయనీయ పరిస్థితి ఉందని తెలిపారు.
Also Read
- Jeffrey Epstein: ఎప్స్టీన్ మిస్టరీలో మరో ట్విస్ట్.. ఏడేళ్లుగా దాచిన 'సూసైడ్ లేటర్'.. ప్రపంచ కుబేరులకు దడ!
- US: ముంచుకొస్తున్న ముప్పు.. ఇరాన్ను తుడిచిపెట్టేందుకు ట్రంప్ 'మాస్టర్ ప్లాన్' సిద్ధం!
- Imran Khan: 85% చూపు కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్.. వైద్య కారణాలతో విడుదల కోరుతూ కోర్టుకు అప్పీల్
- Mojtaba Khamenei: "సముద్ర గర్భంలో పాతిపెడతాం".. అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ స్ట్రాంగ్ వార్నింగ్..
నిధుల్లేక సిబ్బందికి, ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించని పరిస్థితి ఉందని, వ్యవసాయ ఉత్పతులు తగ్గుముఖం పడుతున్నాయని.. ఔషధ నిల్వలు తరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆహార కార్యక్రమం కింద అఫ్గాన్ కు అందిస్తున్న నిల్వలు ఈనెలకు మాత్రమే సరిపోతాయని ఇప్పటికే ఐరాస హెచ్చరించిందని గుర్తుచేశారు. ఈ పరిస్థితుల్లో అప్ఘన్ ప్రజల ఆకలిని తీర్చేందుకు తక్షణం రూ.1,460కోట్లు(20కోట్ల డాలర్లు) అవసరమని ఐరాస ప్రతినిధి రమీజ్ తెలిపారు. మున్ముందు ఆహార సమస్యలు తీవ్రం కానున్నాయని ప్రపంచ దేశాలన్నీ అఫ్ఘాన్ కు సాయం ప్రకటించాలని కోరారు. దేశంలో సహాయ కార్యక్రమాల కోసం రూ.9,945కోట్లు(1.3బిలియన్ డాలర్లు) అవసరం కాగా ఇప్పటివరకు 39శాతం మాత్రమే సాయం అందినట్లు పేర్కొన్నారు.
రోజుకురోజు పెరుగుతున్న నిత్యావసర ధరలతో ఈ పరిస్థితి మున్ముందు మరింత పెద్దది కానుందని స్థానికులు వాపోతున్నారు. దీనికితోడు ప్రపంచ దేశాల నుంచి సాయం నిలిచిపోవడంతో ఆ దేశంలో పాలన గాడిన పడటం ఇప్పట్లో సాధ్యపడకపోవచ్చనే నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో దేశాన్ని తాలిబన్లు ఎలా ముందుకు నడిపిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఉగ్రవాదంపై ప్రపంచ దేశాల పోరు సంగతి ఎలా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం వారి ఆకలి బాధలను మానవత్వంతో తీర్చాల్సిన బాధ్యత అన్నిదేశాలపై ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
తాజావార్తలు
-
Gold Rate Today: చల్లబడిన బంగారం ధరల వేడి.. హైదరాబాద్లో నేటి రేట్స్ ఇవే!
-
Oben Rorr EVO: రూ.1 లక్షకే కొత్త ఓబెన్ రోర్ Evo.. 180KM రేంజ్తో అదిరిపోయే బైక్
-
NBK 112 : బాలయ్య-కొరటాల శివ అనౌన్స్మెంట్ వచ్చేసింది.. మాస్ విద్వంసమే
-
Babar Azam: టీ20 క్రికెట్లో నయా హిస్టరీ.. కోహ్లీ, డుప్లెసిస్ను వెనక్కి నెట్టేసిన బాబర్ ఆజామ్..
-
Instagram Star Murder: భర్త చేతితో ఇన్స్టా స్టార్ దారుణ హత్య.. ట్విస్ట్ ఏంటంటే..?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!