Paskistan Crisis: పిండి కోసం తొక్కిసలాట.. కొట్టుకుంటున్న ప్రజలు
Stampedes across Pakistan as flour shortage intensifies: పాకిస్తాన్ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. ఎంతలా అంటే ప్రజలకు పిండి, గ్యాస్ ఇవ్వలేని పరిస్థితి ఉంది అక్కడ. చివరకు గోధుమ పిండి కోసం ప్రజలు కొట్టుకోవడం, తొక్కిసలాటలు జరుగుతున్నాయి. తాజాగా సింధ్ ప్రభుత్వం ప్రజలకు సబ్సిడీపై పిండిని సరఫరా చేసింది. మ ఈ సమయంలో ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడటంతో తొక్కిసలాట జరిగింది. మిర్పుర్ఖాస్ జిల్లాలో ఏడుగురు పిల్లల తండ్రి అయిన వ్యక్తి తొక్కసలాటలో చనిపోయాడు.
Read Also: Hardik Pandya: సూర్యకుమార్కు బౌలింగ్ చేస్తే ఆ షాట్లకు భయపడేవాడిని
Also Read
- Trump: వెనిజులా, ఇరాన్ తర్వాత నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్.. ఆ దేశం లొంగిపోవాల్సిందేనని ట్రంప్ అల్టిమేటం
- Trump: ఇరాన్తో యుద్ధం ముగిసింది.. వైట్హౌస్ కీలక ప్రకటన
- EU Car Import Duties: ఈయూ కంపెనీలకు భారీ ఎదురుదెబ్బ.. కార్లు, ట్రక్కులపై 25% సుంకం విధించిన ట్రంప్
- Pickleball Players' Plane Crash: టెక్సాస్లో ఘోర విమాన ప్రమాదం.. క్రీడాకారులతో వెళ్తున్న ఫ్లైట్ కూలి ఐదుగురు మృతి
పాకిస్తాన్ వ్యాప్తంగా పిండి రేట్లు ఆకాశానికి అంటడంతో సింధ్ ప్రభుత్వం సబ్సిడీపై రూ. 65లకే 10 కిలోల పిండిని విక్రయిస్తోంది. అయితే పిండి బస్తాలను తెచ్చిన ట్రక్కు చుట్టు ప్రజలు పెద్ద ఎత్తన గుమిగూడటం, ముందుగా పిండిని తీసుకోవాలని చూడటంతో తొక్కిసలాట జరిగింది. 40 ఏళ్ల హర్ సింగ్ కోలీ ఈ గందరగోళంలో కింద పడిపడిపోయి చనిపోయాడు. ఈ మరణంతో బాధితుడి కుటుంబీకులు ఐదు గంటల పాటు నిరసనకు దిగారు. సింధ్ ప్రాంతంలో పిండి విక్రయం గందరగోళానికి దారి తీసింది. పలు ప్రాంతాల్లో ప్రజలు గాయపడ్డారు. మైనర్ బాలికతో పాటు ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.
గతేడాది అక్టోబర్ నెలలో పాకిస్తాన్ వ్యాప్తంగా భారీగా వరదలు సంభవించాయి. మూడోంతుల భూభాగం నీటితో నిండిపోయింది. దీంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో గోధుమకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. పాకిస్తాన్ లో ఇటీవల కాలంలో పిండి ధరలు తీవ్రంగా పెరిగాయి. కిలో పిండి ధర రూ. 140 నుంచి రూ.150కి పెరిగింది. పెషావర్ ప్రాంతంలో 10 కిలోల పిండి ధర పాక్ రూపాయల్లో రూ. 1500గా ఉంది. ఇక క్వెట్టా ప్రాంతంలో 20 కిలోల పిండి ధర రూ. 2800 గా ఉంది. బలూచిస్తాన్ ప్రాంతంలో గోధుమ స్టాక్ ముగిసిందని సంక్షోభం ముందర ఉందని అక్కడి ప్రభుత్వం పేర్కొంది.
తాజావార్తలు
-
Emergency Alert: మీ మొబైల్స్ పెద్ద శబ్దంతో మోగాయా? కంగారు పడకండి.. మేటరేంటంటే..!
-
IPL 2026 Playoffs Chances: హీటేక్కిస్తున్న ప్లేఆఫ్స్ రేస్.. టాప్-4 కోసం 10 జట్లకు ఎన్ని విజయాలు కావాలి?
-
Santosh Goyal Story: విధి వంచించిన మేధావి.. ఈ పీహెచ్డీ స్కాలర్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు..
-
AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక మలుపు.. రంగంలోకి దిగిన ఐటీ అధికారులు
-
iQOO Z11 & Z11x: ఐకూ Z11 సిరీస్ గ్లోబల్ లాంచ్ కన్ఫర్మ్.. ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ వివరాలు
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!