Srilanka Economic Crisis: ఆందోళనలకు మద్దతుగా నిలుస్తున్న మాజీ క్రికెటర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంక ఆందోళనలతో అట్టుడుకుతోంది. శనివారం మొదలైన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. అధ్యక్షుడు గోటబయ రాజీనామా చేయాలని ఆాందోళనకారులు ప్రెసిడెంట్ భవనాన్ని దిగ్భందించారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో అధ్యక్షుడు గోటబయ రాజపక్స అధికారిక నివాసాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. దీంతో పాటు రెండు నెలల క్రితం ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రణిల్ విక్రమసింఘే కూడా రాజీనామా చేశారు. దీంతో శాంతించని జనాలు ప్రధాని ప్రైవేట్ నివసానికి నిప్పు పెట్టారు. ప్రెసిడెంట్ ప్యాలెస్ ను ఆక్రమించుకున్న నిరసనకారుల వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే ప్రజా ఉద్యమానికి శ్రీలంక మాజీ స్టార్ క్రికెటర్లు మద్దతుగా నిలుస్తున్నారు. మాజీ స్టార్ క్రికెటరట్ సనత్ జయసూర్య నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ‘ గో గోట’ అని నినదిస్తూ.. అధ్యక్షుడు గోటబయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాను ఎల్లప్పుడు శ్రీలంకకు అండగా ఉంటానని.. త్వరలో ప్రజలు విజయం సాధిస్తారని జయసూర్య అన్నారు. దీంతో పాటు మరో మాజీ స్టార్ బ్యాటర్ కుమార సంగక్కర కూడా ప్రజా ఉద్యమానికి మద్దతు తెలిపారు. ట్విట్టర్ లో ఆందోళన చేస్తున్న ప్రజలు వీడియోను పోస్ట్ చేశారు. ఇది మన భవిష్యత్ కోసం అంటూ కామెంట్ చేశారు. ‘గో గోట హోమ్’ హాష్ ట్యాగ్ తో ప్రజాశక్తి అని మాజీ స్టార్ క్రికెటర్ మహేళ జయవర్థనే ట్వీట్ చేశారు.
Also Read
- US-Iran Tensions: "ఆ ఒప్పందం కేవలం ఊహాగానమే".. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన ఇరాన్!
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
- UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
- Iran-US: ఈసారి బాధాకరమైన పరిణామాలుంటాయి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
Read Also: Lal Singh Chadda: ‘ఈ సినిమాతో అమీర్ కెరీర్ ముగిసిపోతుంది’
శ్రీలంక వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. నిరసనల్లో ఇప్పటి వరకు ఇద్దరు పోలీస్ అధికారులతో పాటు 30 మంది వ్యక్తుల గాయపడ్డారు. నిన్న ప్రారంభంమైన నిరసనల్లో ఆస్ట్రేలియా- శ్రీలంక టెస్ట్ మ్యాచ్ జరుగుతన్న గాలే క్రికెట్ స్టేడియాన్ని ముట్టడించారు. ప్రపంచం చూపును ఆకర్షించేలా నిరసనలు తెలిపారు. శ్రీలంకలో గత మార్చి నుంచి ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1948 నుంచి ఇలాంటి ఆర్థిక సంక్షోభాన్ని శ్రీలంక ఎప్పుడూ చూడలేదు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. పెట్రోల్, డిజిల్ కోసం రోజుల తరబడి క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీసం పెట్రోల్ కూడా కొనడానికి శ్రీలంక వద్ద విదేశీమారక నిల్వలు లేవు. వీటన్నింటికి కారణం గోటబయ కుటుంబం అవినీతే అని ప్రజలు ప్రభుత్వంపై తిరగబడ్డారు. దీంతో గతంలో ప్రధానిగా పనిచేసిన మహిందా రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా అధ్యక్షుడు దేశం విడిచిపారిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Sing Geetham : వెండితెరపై సింగీతం రాసిన చందమామ కథ
-
AP Weather Report Today: నేడు ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ!
-
AP Schools Reopen: నేటి నుంచే బడి గంట.. 2026-27 అకడమిక్ క్యాలెండర్ విడుదల.. హాలిడేస్ లిస్ట్ ఇదే!
-
FIFA World Cup 2026: మెస్సీ vs రొనాల్డో పోరు.! అభిమానులు ఎదురుచూస్తున్న డ్రీమ్ మ్యాచ్ ఎప్పుడంటే.?
ట్రెండింగ్
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!