South Korea: దక్షిణకొరియాలో భారీ కార్చిచ్చు.. 18 మంది మృతి
- దక్షిణకొరియాలో భారీ కార్చిచ్చు
- 18 మంది మృతి.. 19 మందికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణ కొరియాలో కార్చిచ్చులు బీభత్సం సృష్టిస్తున్నాయి. గాలివానల కారణంగా చెలరేగిన కార్చిచ్చులు కారణంగా 18 మంది చనిపోయారు. 19 మంది గాయపడ్డారు. ఇక రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది.. మంటలు ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక సమీపంలో ఉన్న ఇళ్లను ఖాళీ చేయించారు. ఇక ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 200కు పైగా నిర్మాణాలు కాలిపోయాయి. బలమైన గాలుల కారణంగానే ఈ మంటలు చెలరేగుతున్నాయని అధికారులు తెలిపారు. ఇక ఈ ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని ప్రభుత్వ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో 1300 సంవత్సరాల పురాతన బౌద్ధ దేవాలయం దగ్ధమైంది. దాదాపు ఇప్పటి వరకు 43,330 ఎకరాలకు పైగా దగ్ధమైనట్లు సమాచారం. ఇలాంటి ఘటనల్లో ఇప్పటివరకు మూడవ అతిపెద్దదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read
- Iran: ఈసారి శత్రువు కాలుదువ్వితే కొత్త యుద్ధం చూస్తారు.. ఇరాన్ వార్నింగ్
- Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
- PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
- Entire Village Set On Fire: దారుణ ఘటన.. ప్రేమ పెళ్లి చేసుకున్నారని ఊరినే తగలబెట్టేశారు..
మంటలు ఆర్పేందుకు 10 వేల మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది, పౌర సేవకులు పని చేస్తున్నారు. స్థానిక నివాసితులను ఖాళీ చేయమని ఇప్పటికే ఆదేశించినట్లు అధికారులు వెల్లడించారు. 68 శాతం మంటలు అదుపులోకి వచ్చాయని తెలిపారు. ఉత్తర, దక్షిణ జియోంగ్సాంగ్, ఉల్సాన్ నగరంలోని అనేక ప్రాంతాల్లో మాత్రం మంటలు వేగంగా వ్యాపిస్తున్నట్లు పేర్కొన్నారు.
దక్షిణ కొరియా ప్రధానమంత్రి, తాత్కాలిక అధ్యక్షుడు హన్ డక్- సూ స్పందించారు. ఎప్పుడూ జరగని విధంగా ఈసారి కార్చిచ్చు చెలరేగిందన్నారు. ఇది అత్యంత ఘోరమైనదిగా అభివర్ణించారు. మంటలను అదుపు చేయడంపై ప్రత్యేక దృష్టిసారించినట్లు చెప్పారు. పొరుగు ప్రాంతాలకు వ్యాపించకుండా ఉండేందుకు ప్రజలు అధికారులకు సహకరించాలని కోరుతున్నట్లు విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Manchu Manoj : ‘ఐక్య’ వెనుక ఉన్న అసలు రహస్యం బయటపెట్టిన మనోజ్!
-
Iran: ఈసారి శత్రువు కాలుదువ్వితే కొత్త యుద్ధం చూస్తారు.. ఇరాన్ వార్నింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
Team India Players: అఫ్గాన్ సిరీస్కు వన్డే, టెస్ట్ జట్ల ఎంపిక.. ఎవరెవరికి ఛాన్స్ ఇచ్చారంటే..
-
Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!