Greece Train Crash: గ్రీస్ ట్రైన్ క్రాష్లో షాకింగ్ ట్విస్ట్.. డ్రైవర్ అలా చేయాల్సింది కాదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking Twist In Greece Train Crash: మంగళవారం అర్థరాత్రి సమయంలో గ్రీస్లో రెండు రైళ్లు ఢీకొన్న విషయం తెలిసిందే! థెస్సాలీ నుంచి లారిస్సాకు వెళ్తున్న ఒక ప్యాసింజర్ రైలు.. తెంపీ సమీపంలో ఒక కార్గో రైలుని బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో 57 మంది మరణించగా.. వారిలో 36 మంది సజీవదహనం అయ్యారు. మరో 85 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై అక్కడ తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతుండగా.. తాజాగా ఓ షాకింగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. అధికారులు రిలీజ్ చేసిన ఓ ఆడియో రికార్డింగ్లో.. రెడ్ లైట్ని బేఖాతరు చేయాల్సిందిగా డ్రైవర్కు ట్రైన్ మాస్టర్ చెప్పినట్టు స్పష్టంగా వినిపిస్తోంది. ‘‘రెడ్ లైట్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నియాన్ పొరాన్ ఎంట్రీ లైట్ వచ్చేదాకా ప్రయాణం కొనసాగించు’’ అంటూ ట్రైన్ మాస్టర్ ఆ ఆడియోలో పేర్కొన్నాడు. అప్పటికీ డ్రైవర్కి అనుమానం వచ్చి.. ‘నిజంగానే వెళ్లాలా?’ అని మరోసారి అడిగాడు. అందుకు ఆ మాస్టర్ స్పందిస్తూ.. ‘పర్లేదు వెళ్లు’ అంటూ బదులిచ్చాడు. ఇలా రెడ్ లైట్ని పట్టించుకోకుండా, నిర్లక్ష్యం వహించడం వల్లే.. ఇంత ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ట్రైన్ మాస్టర్ని అరెస్ట్ చేసినప్పుడు.. ఇదంతా సాంకేతిక లోపం వల్లే జరిగిందని, తనకేం తెలియని బుకాయించాడు. అనంతరం తన తప్పుని అంగీకరించాడు.
Security Guard Robbery: అన్నం పెట్టిన ఇంటికే.. కన్నం పెట్టిన సెక్యూరిటీ గార్డ్
Also Read
- Princess Isabella: చరిత్ర సృష్టించిన డెన్మార్క్ యువరాణి ఇసబెల్లా.. తొలిసారి సైన్యంలో చేరిన రాజకుటుంబ మహిళ!
- Trump Marine One: ట్రంప్కు గగనతలంలో ప్రమాదం?.. ప్రయాణిస్తున్న ‘మెరైన్ వన్’కు దగ్గరగా వచ్చిన ప్యాసింజర్ విమానం
- Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
- Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
మరోవైపు.. ఈ ఘటనపై గ్రీకు రైలు కంపెనీ హెలెనిక్ రైలు సెట్రల్ ఏథెన్స్ ప్రధాన కార్యాలయం వద్ద విద్యార్థి, కార్మిక సంఘాలు నిరసనలు చేపట్టారు. బుధవారం ఈ నిరసన హింసాత్మకంగా సాగడంతో, పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో గురువారం నిరసన శాంతియుతంగా కొనసాగింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందంటూ నిరసనకారులు ఆందోళన చేశారు. ఈ తప్పిదానికి కేవలం ఒక్కరిని మాత్రమే నిందించలేమని.. ఇప్పుడు నేతలు, అధికారులందరూ ఏమయ్యారని ప్రశ్నిస్తున్నారు. వీళ్లకు మనుషుల ప్రాణాల కన్నా, ఎన్నికలే ముఖ్యమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. సంఘటనా స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రమాదం చాలా తీవ్రమైంది కాబట్టి.. మరణాల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు.. రైల్వే ఉద్యోగుల సంఘాలు సమ్మె నిర్వహిస్తున్నారు. జాతీయంగా రైలు సేవలు నిలిపివేసి.. పని పరిస్థితులను నిరసిస్తూ, రైలు వ్యవస్థను ఆధునీకరించడం ప్రమాదకరమైన వైఫల్యంగా అభివర్ణించారు. శుక్రవారం కూడా రెండోసారి సమ్మెకు పిలుపునిచ్చారు. సెంట్రల్ ఏథెన్స్లో వామపక్ష సమూహాలచే రెండు వేర్వేరు నిరసనలూ జరిగాయి.
తాజావార్తలు
-
Vivo S2: భారత్లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!