Sheikh Hasina: షేక్ హసీనాకు షాక్.. హత్యా నేరాల విచారణ ప్రారంభించిన బంగ్లాదేశ్..
- షేక్ హసీనాకు వ్యతిరేకంగా అతిపెద్ద విచారణ ప్రారంభం..
- మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు అభియోగాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, అవామీ లీగ్ పార్టీ చీఫ్ షేక్ హసీనాకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ అతిపెద్ద విచారణను ప్రారంభించింది. మానవత్వానికి వ్యతిరేకంగా ఆమె నేరాలకు పాల్పడినట్లు బంగ్లాదేశ్ అభియోగాలు నమోదు చేసింది. గతేడాది, హింసాత్మక విద్యార్థి ఉద్యమం తర్వాత ఆమె దేశం నుంచి పారిపోయి భారత్ చేరుకుంది. ప్రస్తుతం, భారత్లోనే ఆశ్రయం పొందుతోంది.
Read Also: Israel: గాజా ప్రజల పైకి ఇజ్రాయిల్ ఓపెన్ ఫైర్..30 మంది మృతి, 115 మందికి గాయాలు..
Also Read
- Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
- Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
2024 విద్యార్థుల నేతృత్వంలోని తిరుగుబాటు సమయంలో హింసాత్మక అణచివేత చర్యలలో షేక్ హసీనా ప్రధాన నిందితురాలని, ఈమెతో పాటు మరో ఇద్దరు సీనియర్ అధికారులు మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు బంగ్లా ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు. హసీనా రాష్ట్ర భద్రతా దళాలు, ఆమె రాజకీయ పార్టీ, అనుబంధ సంస్థలకు ఈ ఉద్యమాన్ని అణచివేయాలని నేరుగా ఆదేశాలు ఇచ్చారని దర్యాప్తు నివేదికలో తేలినట్లు, దీని వల్లే భారీ ప్రాణనష్టం జరిగినట్లు, ఈ హత్యలు ప్రణాళికాబద్ధంగా జరిగినట్లు చీఫ్ ప్రాసిక్యూటర్ తాజుల్ ఇస్లాం ఆదివారం తెలిపారు.
ఈ కేసులో మొత్తం 18 మందిని సాక్షులుగా పేర్కొన్నట్లు ఇస్లాం చెప్పారు. ప్రభుత్వ అధిపతిగా హసీనా అశాంతి సమయంలో భద్రతా దళ కార్యకలాపాలకు కమాండ్ బాధ్యత వహిస్తున్నారని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. 15 ఏళ్లుగా బంగ్లాదేశ్ని పాలిస్తున్న షేక్ హసీనా గతేడాది ఆగస్టులో ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారు. ఆమె, ఆమె కుటుంబ సభ్యులు అవినీతి ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. ఈ అణచివేతల వల్ల దాదాపు 1,500 మంది మరణించగా, 25,000 మంది గాయపడ్డారని ఇస్లాం గత నెలలో చెప్పారు.
తాజావార్తలు
-
Sonakshi Sinha: సోషల్ మీడియా వల్ల ఇండస్ట్రీ పూర్తిగా మారిపోయింది..
-
Virat Kohli: “ప్రతి సీజన్ను నరకంలా అనుభవించాను”.. 18 ఏళ్లుగా తన గుండెల్లోని బాధను బయటపెట్టిన కోహ్లీ..
-
PM Modi: విదేశీ ప్రయాణాలపై పన్ను విధింపులంటూ వార్తలు.. ప్రధాని మోడీ కీలక ప్రకటన
-
Video Viral: నాలుగు సిక్సర్ల తుఫాన్.. పూరన్కు వంగి సెల్యూట్ చేసిన ముకుల్.!
-
AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..