Bangladesh: యూనస్ సర్కార్ సంచలన నిర్ణయం.. కరెన్సీ నోట్లపై హసీనా తండ్రి బొమ్మ తొలగింపునకు ఆదేశం!
- బంగ్లాదేశ్లో యూనస్ సర్కార్ సంచలన నిర్ణయం
- కరెన్సీ నోట్లపై హసీనా తండ్రి బొమ్మ తొలగింపునకు ఆదేశం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్లో ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ కరెన్సీ నోట్ల నుంచి షేక్ ముజిబుర్ రెహమాన్ చిత్రం తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఢాకా ట్రిబ్యూన్ నివేదించింది. షేక్ ముజిబుర్ రెహమాన్.. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి. దేశ వ్యవస్థాపక నేత కూడా. అయితే జూలైలో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టడంతో పరిస్థితిని అదుపు చేయలేక భారత్కు వచ్చేసి తలదాచుకుంటున్నారు. అనంతరం నోబెల్ గ్రహీత యూనస్ ఆధ్వరంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి.. హసీనా నిర్ణయాలపై దుమ్మెత్తిపోస్తున్నారు. తాజాగా కరెన్సీ నోట్లపై హసీనా తండ్రి చిత్రాన్ని తొలగించాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. అలాగే షేక్ హసీనా ప్రసంగాలు ప్రసారం కాకుండా బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ నిషేధం విధిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
- Lufthansa Boeing 787 : గేట్ వద్దే కుప్పకూలిన బోయింగ్ 787 విమానం.. వైరల్ వీడియోలతో కలకలం
- Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
మరోవైపు కొత్త నోట్ల ముద్రణకు యూనస్ సర్కార్ ఆదేశాలు ఇచ్చింది. ఎలాంటి బొమ్మలు లేకుండానే కరెన్సీ నోట్లు ముద్రణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఆరు నెలల్లో కొత్త నోట్లను మార్కెట్లో విడుదల చేయవచ్చని బంగ్లాదేశ్ బ్యాంక్ ప్రతినిధి మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హుస్నేరా శిఖా తెలిపారు. తొలుత నాలుగు నోట్ల డిజైన్ను మాత్రమే మారుస్తున్నట్లు కేంద్ర బ్యాంకు, ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. షేక్ ముజిబుర్ రెహమాన్ చిత్రం లేకుండా అన్ని రకాల నోట్లు దశలవారీగా రీడిజైన్ చేయబడతాయని వారు తెలిపారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్ విభాగం సెప్టెంబర్ 29న బంగ్లాదేశ్ బ్యాంక్కు కొత్త నోటు కోసం వివరణాత్మక డిజైన్ ప్రతిపాదనను సమర్పించింది. అయితే కొత్త నోట్ల ముద్రణకు సంబంధించిన ప్రధాన సిఫార్సును సెంట్రల్ బ్యాంక్ కరెన్సీ అండ్ డిజైన్ అడ్వైజరీ కమిటీ చేస్తుందని వార్తాపత్రిక నివేదిక తెలిపింది.
తాజావార్తలు
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
-
AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ వచ్చేసింది.. జూన్ 5న నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పుడంటే..
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!