Bangladesh: యూనస్ సర్కార్ సంచలన నిర్ణయం.. కరెన్సీ నోట్లపై హసీనా తండ్రి బొమ్మ తొలగింపునకు ఆదేశం!
- బంగ్లాదేశ్లో యూనస్ సర్కార్ సంచలన నిర్ణయం
- కరెన్సీ నోట్లపై హసీనా తండ్రి బొమ్మ తొలగింపునకు ఆదేశం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్లో ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ కరెన్సీ నోట్ల నుంచి షేక్ ముజిబుర్ రెహమాన్ చిత్రం తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఢాకా ట్రిబ్యూన్ నివేదించింది. షేక్ ముజిబుర్ రెహమాన్.. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి. దేశ వ్యవస్థాపక నేత కూడా. అయితే జూలైలో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టడంతో పరిస్థితిని అదుపు చేయలేక భారత్కు వచ్చేసి తలదాచుకుంటున్నారు. అనంతరం నోబెల్ గ్రహీత యూనస్ ఆధ్వరంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి.. హసీనా నిర్ణయాలపై దుమ్మెత్తిపోస్తున్నారు. తాజాగా కరెన్సీ నోట్లపై హసీనా తండ్రి చిత్రాన్ని తొలగించాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. అలాగే షేక్ హసీనా ప్రసంగాలు ప్రసారం కాకుండా బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ నిషేధం విధిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read
- Greenland Deal: ట్రంప్ ఆశ నెరవేరింది.. గ్రీన్ల్యాండ్పై డెన్మార్క్తో డీల్..
- Trump-Jinping: 24న వైట్హౌస్లో జిన్పింగ్కు విందు.. మస్క్, సుందర్ పిచాయ్, టిమ్ కుక్కు ఆహ్వానం
- Explainers: భూమి గుండెల్లో దాగిన నీటి రహస్యం.. ఏకంగా 660 కిలోమీటర్ల లోతులో..
- America vs Iran: అమెరికా యుద్ధ నేరాలకు సాక్ష్యాలు.. పిల్లలను కూడా వ*దలలేదు..!
మరోవైపు కొత్త నోట్ల ముద్రణకు యూనస్ సర్కార్ ఆదేశాలు ఇచ్చింది. ఎలాంటి బొమ్మలు లేకుండానే కరెన్సీ నోట్లు ముద్రణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఆరు నెలల్లో కొత్త నోట్లను మార్కెట్లో విడుదల చేయవచ్చని బంగ్లాదేశ్ బ్యాంక్ ప్రతినిధి మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హుస్నేరా శిఖా తెలిపారు. తొలుత నాలుగు నోట్ల డిజైన్ను మాత్రమే మారుస్తున్నట్లు కేంద్ర బ్యాంకు, ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. షేక్ ముజిబుర్ రెహమాన్ చిత్రం లేకుండా అన్ని రకాల నోట్లు దశలవారీగా రీడిజైన్ చేయబడతాయని వారు తెలిపారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్ విభాగం సెప్టెంబర్ 29న బంగ్లాదేశ్ బ్యాంక్కు కొత్త నోటు కోసం వివరణాత్మక డిజైన్ ప్రతిపాదనను సమర్పించింది. అయితే కొత్త నోట్ల ముద్రణకు సంబంధించిన ప్రధాన సిఫార్సును సెంట్రల్ బ్యాంక్ కరెన్సీ అండ్ డిజైన్ అడ్వైజరీ కమిటీ చేస్తుందని వార్తాపత్రిక నివేదిక తెలిపింది.
తాజావార్తలు
-
CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
-
Greenland Deal: ట్రంప్ ఆశ నెరవేరింది.. గ్రీన్ల్యాండ్పై డెన్మార్క్తో డీల్..
-
Ajit Doval: సినిమాను మించిన థ్రిల్లర్! అజిత్ డోవల్ పంచుకున్న అత్యంత ప్రమాదకరమైన సీక్రెట్ మిషన్..
-
Trump-Jinping: 24న వైట్హౌస్లో జిన్పింగ్కు విందు.. మస్క్, సుందర్ పిచాయ్, టిమ్ కుక్కు ఆహ్వానం
-
Explainers: భూమి గుండెల్లో దాగిన నీటి రహస్యం.. ఏకంగా 660 కిలోమీటర్ల లోతులో..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!