Scotland: బిడ్డ కోసం తల్లి పోరాటం.. 48 ఏళ్ల తరువాత చేరిన కుమారుడి అవశేషాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Scotland Woman Gets Baby Son’s Body From Hospital After 48 Years: చనిపోయిన తన బిడ్డ అవశేషాల కోసం ఓ తల్లి ఏకంగా నాలుగున్నర దశాబ్ధాలుగా పోరాడుతోంది. తన బిడ్డకు ఏమైందని తెలుసుకోవాలని పోరాడుతోంది. చివరకు సుదీర్ఘ పోరాటం తర్వాత 48 ఏళ్లకు తన కొడుకు అవశేషాలను శుక్రవారం పొందింది. వివరాల్లోకి వెళ్తే ఈ ఘటన యూకేలో జరిగింది. స్కాట్లాండ్ ఎడిన్ బర్గ్ కు చెందిన లిడియా రీడ్ అనే మహిళ 1975లో ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం లిడియా రీడ్ కు 74 ఏళ్లు. అయితే పుట్టిన వారం వయసులోనే ఆమె పసిబిడ్డ గ్యారీ, రీసన్ వ్యాధితో మరణించాడు. శరీరంలోని ప్రతిరక్షకాలు శిశువు రక్తకణాలను నాశనం చేసే అత్యంత అరుదైన వ్యాధి. దీని కారణంగా పసిపిల్లాడు మరణించాడు.
పిల్లాడు మరణించిన కొద్ది రోజుల తర్వాత తన కొడుకును చూడాలని ఆస్పత్రిని కోరినప్పుడు ఆమెకు వేరే బిడ్డను చూపించినట్లు రీడ్ పేర్కొంది. అయితే తన ఇష్టానికి విరుద్ధంగా తన కొడుకుకు పోస్టుమార్టం నిర్వహించారని రీడ్ ఆరోపించింది. తన కొడుకు అవశేషాల కోసం పోరాడింది. చివరకు 2017 సెప్టెంబర్ నెలలో రీడ్ కొడుకును ఖననం చేసిన చోటును తవ్వి తీయాలని కోర్టు ఆదేశించింది. అయితే పిల్లాడిని ఖననం చేసిన చోట ఎలాంటి అవశేషాలు దొరకలేదు.
Also Read
- Ketan Agarwal Case: తొలిసారి మీడియా ముందు నోరు విప్పిన సియా సోదరుడు.. ఏం చెప్పాడంటే..!
- Pakistan: పాకిస్థాన్లో హై అలర్ట్.. ఇమ్రాన్ ఖాన్ ఉన్న జైలు నుంచి 14 మంది ఖైదీలు పరార్! అసలేం జరిగిందంటే?
- Pakistan Minister: "చేతులు నరికేస్తాం".. సింధు జలాల విషయంలో భారత్కు పాక్ మంత్రి వార్నింగ్!
- Indian Army: అరుణాచల్లో చైనా చొరబాటు? క్లారిటీ ఇచ్చిన భారత సైన్యం
Read Also: TSPSC Paper Leak: పేపర్ లీక్ కేసుపై సిట్ నివేదిక.. అతడే కీలక సూత్రధారి
తన కొడుకు అవయవాలను పరిశోధన కోసం తొలగించారని రీడ్ గ్రహించింది. సుదీర్ఘ పోరాటం తర్వాత ఎడిన్ బర్గ్ రాయల్ ఇన్ ఫర్మరీ లో భద్రపరిచిన అవయవాలను, శరీర భాగాలను తల్లికి అప్పగించడానికి క్రౌన్ ఆఫీస్ అనుమతి ఇచ్చింది. పరిశోధన కోసం పిల్లల శరీరభాగాలను ఆస్పత్రులు ఎలా చట్టవిరుద్ధంగా ఉపయోగిస్తున్నాయో బహిర్గతం చేసిన వ్యక్తిగా రీడ్ గుర్తింపు పొందింది. లివర్ పూర్ లోని ఆల్డర్ హే ఆస్పత్రిని దోషిగా నిలబెట్టింది. బీబీసీ నివేదిక ప్రకారం 1970 నుంచి 2000 మధ్యకాలంలో స్కాటిష్ ఆస్పత్రుల్లో దాదాపుగా 6,000 అవయవాలు, కణజాలలను ఉంచినట్లు వెలుగులోకి వచ్చింది.
ప్రస్తుతం పేగు క్యాన్సర్ తో బాధపడున్న రీడ్, ఎడిన్ బర్గ్ లోని జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే తన బిడ్డ మిగతా శరీర భాగాలు ఏమయ్యాయో ఇప్పటికీ తెలియదని చెప్పింది. నా కొడుకు అవశేషాలు పొందడానికి చాలా కాలం కష్టపడ్డానని.. దీన్ని మాటల్లో చెప్పడం కష్టంగా ఉందని భావోద్వేగానికి గురైంది. తాను చనిపోయే ముందు తన కొడుకుకు అంత్యక్రియలు నిర్వహిస్తానని, ఇది నాకు ఉపశమనాన్ని ఇస్తుందని పేర్కొంది.
తాజావార్తలు
-
Alpha Movie Remunerations: హీరోల రేంజ్లో ఆలియా రెమ్యూనరేషన్.. అక్షరాల ఎన్ని కోట్లో తెలుసా?
-
TG Cabinet Meeting : జూలై 2న తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం.!
-
Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
రూ.6,650 కోట్లతో రాబోతున్న OYO ఐపీఓ.. కానీ ఆ డబ్బంతా దేనికి వాడుతున్నారో తెలిస్తే షాకవుతారు!
ట్రెండింగ్
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!