Indian Army: అరుణాచల్లో చైనా చొరబాటు? క్లారిటీ ఇచ్చిన భారత సైన్యం
- అరుణాచల్లో చైనా చొరబాటు?
- భారత సైన్యం ఖండించింది
- కొత్తగా శిబిరాల ఏర్పాటు జరిగినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని తెలిపింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అరుణాచల్ ప్రదేశ్లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) దళాలు చొరబడ్డాయన్న వార్తలను భారత సైన్యం ఖండించింది. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో, కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేసిన కథనాలు పూర్తిగా అసత్యమని, వాటికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది.
ఇటీవల కొన్ని స్థానిక వార్తా సంస్థలు, గత ఆరేళ్లలో అరుణాచల్ ప్రదేశ్లోని అప్పర్ సుబన్సిరి జిల్లాలో చైనా పీఎల్ఏ దళాలు చొరబడి శిబిరాలు ఏర్పాటు చేశాయని కథనాలు ప్రచురించాయి. ఈ కథనాలు స్థానిక నాహ్ గిరిజన సమాజానికి చెందిన ప్రతినిధులు చేసిన ఆరోపణల ఆధారంగా వెలువడ్డాయి. నాహ్ వెల్ఫేర్ సొసైటీ (NWS) అధ్యక్షుడు కెరు చాడర్ మాట్లాడుతూ, తమ పూర్వికుల భూములు, వేట ప్రాంతాలు, పశువుల మేత భూములను చైనా దళాలు ఆక్రమించుకున్నాయని, ముఖ్యంగా 2020 నుంచి ఈ పరిస్థితి కొనసాగుతోందని ఆరోపించారు. అయితే, తమ భూములను ఎన్నో ఏళ్లుగా రక్షిస్తున్న భారత సైన్యంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని కూడా ఆయన స్పష్టం చేశారు.
Also Read
- Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
- Houthis Attack Saudi: టర్కీ-పాక్తో ఒప్పందం కుదిరిన తర్వాత రోజే.. సౌదీపై హౌతీల భీకర దాడి..
- Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
- Himanshi Khurana Murder: కెనడాలో భారత సంతతికి చెందిన యువతి హ*త్య కేసులో కీలక పరిణామం.. 7 నెలల తర్వాత నిందితుడి అరెస్ట్
ఈ ఆరోపణల నేపథ్యంలో భారత సైన్యం స్పందిస్తూ, అరుణాచల్ ప్రదేశ్లో చైనా దళాల చొరబాటు లేదా కొత్తగా శిబిరాల ఏర్పాటు జరిగినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని తెలిపింది. వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ప్రచారం జరుగుతోందని పేర్కొంది. ఇదిలా ఉండగా, 2020లో గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ తర్వాత భారత్-చైనా సంబంధాలు ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందగా, చైనా సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అయితే, చైనా ఇప్పటివరకు తమ సైనికుల అధికారిక మరణాల సంఖ్యను వెల్లడించలేదు.
ప్రస్తుతం వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంబడి పరిస్థితి స్థిరంగా ఉందని భారత సైన్యం తెలిపింది. పదవీ విరమణ చేస్తున్న భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది మాట్లాడుతూ, సరిహద్దులో శాంతి, స్థిరత్వాన్ని కొనసాగించేందుకు భారత్-చైనా సైన్యాల మధ్య 1,100కు పైగా క్షేత్రస్థాయి సమావేశాలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఇరుదేశాల మధ్య ఎలాంటి అపార్థాలు తలెత్తకుండా నిరంతర సంప్రదింపులు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
అదే సమయంలో, భారత సైన్యం శాంతి పరిరక్షణకు కట్టుబడి ఉన్నప్పటికీ, దేశ ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు ఎల్లప్పుడూ అప్రమత్తంగా, పూర్తి సామర్థ్యంతో సిద్ధంగా ఉంటుందని జనరల్ ద్వివేది స్పష్టం చేశారు. “బలంతో శాంతిని నెలకొల్పడం మా విధానం. ఎల్ఏసీ వెంబడి భారత సైన్యం దృఢమైన, విశ్వసనీయమైన రక్షణ వ్యవస్థతో దేశ ప్రయోజనాలను కాపాడుతోంది” అని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!