Indian Army: అరుణాచల్లో చైనా చొరబాటు? క్లారిటీ ఇచ్చిన భారత సైన్యం
- అరుణాచల్లో చైనా చొరబాటు?
- భారత సైన్యం ఖండించింది
- కొత్తగా శిబిరాల ఏర్పాటు జరిగినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని తెలిపింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అరుణాచల్ ప్రదేశ్లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) దళాలు చొరబడ్డాయన్న వార్తలను భారత సైన్యం ఖండించింది. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో, కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేసిన కథనాలు పూర్తిగా అసత్యమని, వాటికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది.
ఇటీవల కొన్ని స్థానిక వార్తా సంస్థలు, గత ఆరేళ్లలో అరుణాచల్ ప్రదేశ్లోని అప్పర్ సుబన్సిరి జిల్లాలో చైనా పీఎల్ఏ దళాలు చొరబడి శిబిరాలు ఏర్పాటు చేశాయని కథనాలు ప్రచురించాయి. ఈ కథనాలు స్థానిక నాహ్ గిరిజన సమాజానికి చెందిన ప్రతినిధులు చేసిన ఆరోపణల ఆధారంగా వెలువడ్డాయి. నాహ్ వెల్ఫేర్ సొసైటీ (NWS) అధ్యక్షుడు కెరు చాడర్ మాట్లాడుతూ, తమ పూర్వికుల భూములు, వేట ప్రాంతాలు, పశువుల మేత భూములను చైనా దళాలు ఆక్రమించుకున్నాయని, ముఖ్యంగా 2020 నుంచి ఈ పరిస్థితి కొనసాగుతోందని ఆరోపించారు. అయితే, తమ భూములను ఎన్నో ఏళ్లుగా రక్షిస్తున్న భారత సైన్యంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని కూడా ఆయన స్పష్టం చేశారు.
Also Read
- Nepal Floods: 5 వేల మీటర్ల ఎత్తున.. అసలేం జరిగింది? హిమాలయాల గుండెల్లో దాగిన మిస్టరీ!
- Explainer: చైనా దాచిన మహా ప్రళయం! 2.3లక్షల మంది హతం.. ఆ రాత్రి ఏం జరిగింది?
- US-Venezuela Oil Deal: అమెరికా-వెనిజులా బిగ్ డీల్.. ట్రంప్ సంచలన ప్రకటన
- ISI Spy Trap: పాక్ ISI స్పై ట్రాప్.. ‘నగ్న ఫొటోలు’ ఎరగా వేసి భారత రక్షణ అధికారులను టార్గెట్ చేస్తున్న పాక్ ISI?
ఈ ఆరోపణల నేపథ్యంలో భారత సైన్యం స్పందిస్తూ, అరుణాచల్ ప్రదేశ్లో చైనా దళాల చొరబాటు లేదా కొత్తగా శిబిరాల ఏర్పాటు జరిగినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని తెలిపింది. వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ప్రచారం జరుగుతోందని పేర్కొంది. ఇదిలా ఉండగా, 2020లో గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ తర్వాత భారత్-చైనా సంబంధాలు ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందగా, చైనా సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అయితే, చైనా ఇప్పటివరకు తమ సైనికుల అధికారిక మరణాల సంఖ్యను వెల్లడించలేదు.
ప్రస్తుతం వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంబడి పరిస్థితి స్థిరంగా ఉందని భారత సైన్యం తెలిపింది. పదవీ విరమణ చేస్తున్న భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది మాట్లాడుతూ, సరిహద్దులో శాంతి, స్థిరత్వాన్ని కొనసాగించేందుకు భారత్-చైనా సైన్యాల మధ్య 1,100కు పైగా క్షేత్రస్థాయి సమావేశాలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఇరుదేశాల మధ్య ఎలాంటి అపార్థాలు తలెత్తకుండా నిరంతర సంప్రదింపులు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
అదే సమయంలో, భారత సైన్యం శాంతి పరిరక్షణకు కట్టుబడి ఉన్నప్పటికీ, దేశ ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు ఎల్లప్పుడూ అప్రమత్తంగా, పూర్తి సామర్థ్యంతో సిద్ధంగా ఉంటుందని జనరల్ ద్వివేది స్పష్టం చేశారు. “బలంతో శాంతిని నెలకొల్పడం మా విధానం. ఎల్ఏసీ వెంబడి భారత సైన్యం దృఢమైన, విశ్వసనీయమైన రక్షణ వ్యవస్థతో దేశ ప్రయోజనాలను కాపాడుతోంది” అని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
King 100 Glimpse: పుట్టినరోజున అదిరిపోయే సర్ప్రైజ్.. నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్ అదుర్స్.. డిసెంబర్ 24న గ్రాండ్ రిలీజ్.!
-
PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
-
DC OTT Release: రెండు ఓటీటీలలో లోకేష్ కనగరాజ్ ‘డీసీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడు అంటే?
-
Nepal Flood Tragedy: 600 దాటిన మృతుల సంఖ్య.. మరణాలు పెరుగుతుండటంతో నేపాల్లో కొత్త సంక్షోభం..!
-
AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!