Indian Army: అరుణాచల్లో చైనా చొరబాటు? క్లారిటీ ఇచ్చిన భారత సైన్యం
- అరుణాచల్లో చైనా చొరబాటు?
- భారత సైన్యం ఖండించింది
- కొత్తగా శిబిరాల ఏర్పాటు జరిగినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని తెలిపింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అరుణాచల్ ప్రదేశ్లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) దళాలు చొరబడ్డాయన్న వార్తలను భారత సైన్యం ఖండించింది. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో, కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేసిన కథనాలు పూర్తిగా అసత్యమని, వాటికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది.
ఇటీవల కొన్ని స్థానిక వార్తా సంస్థలు, గత ఆరేళ్లలో అరుణాచల్ ప్రదేశ్లోని అప్పర్ సుబన్సిరి జిల్లాలో చైనా పీఎల్ఏ దళాలు చొరబడి శిబిరాలు ఏర్పాటు చేశాయని కథనాలు ప్రచురించాయి. ఈ కథనాలు స్థానిక నాహ్ గిరిజన సమాజానికి చెందిన ప్రతినిధులు చేసిన ఆరోపణల ఆధారంగా వెలువడ్డాయి. నాహ్ వెల్ఫేర్ సొసైటీ (NWS) అధ్యక్షుడు కెరు చాడర్ మాట్లాడుతూ, తమ పూర్వికుల భూములు, వేట ప్రాంతాలు, పశువుల మేత భూములను చైనా దళాలు ఆక్రమించుకున్నాయని, ముఖ్యంగా 2020 నుంచి ఈ పరిస్థితి కొనసాగుతోందని ఆరోపించారు. అయితే, తమ భూములను ఎన్నో ఏళ్లుగా రక్షిస్తున్న భారత సైన్యంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని కూడా ఆయన స్పష్టం చేశారు.
Also Read
- Hamas: హమాస్కు కొత్త బాస్.. ఖలీల్ అల్-హయ్యా చేతుల్లోకి పగ్గాలు!
- FIFA ఫైనల్లో ట్రంప్కు ఊహించని అవమానం.. అసలేం జరిగిందంటే?
- US - Iran War: ఇరాన్పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా.. వరుస దాడులతో ఉద్రిక్తత.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- JD Vance Fourth Child: నాలుగోసారి తండ్రైన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. 150 ఏళ్ల అమెరికా చరిత్రలో అరుదైన ఘట్టం
ఈ ఆరోపణల నేపథ్యంలో భారత సైన్యం స్పందిస్తూ, అరుణాచల్ ప్రదేశ్లో చైనా దళాల చొరబాటు లేదా కొత్తగా శిబిరాల ఏర్పాటు జరిగినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని తెలిపింది. వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ప్రచారం జరుగుతోందని పేర్కొంది. ఇదిలా ఉండగా, 2020లో గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ తర్వాత భారత్-చైనా సంబంధాలు ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందగా, చైనా సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అయితే, చైనా ఇప్పటివరకు తమ సైనికుల అధికారిక మరణాల సంఖ్యను వెల్లడించలేదు.
ప్రస్తుతం వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంబడి పరిస్థితి స్థిరంగా ఉందని భారత సైన్యం తెలిపింది. పదవీ విరమణ చేస్తున్న భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది మాట్లాడుతూ, సరిహద్దులో శాంతి, స్థిరత్వాన్ని కొనసాగించేందుకు భారత్-చైనా సైన్యాల మధ్య 1,100కు పైగా క్షేత్రస్థాయి సమావేశాలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఇరుదేశాల మధ్య ఎలాంటి అపార్థాలు తలెత్తకుండా నిరంతర సంప్రదింపులు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
అదే సమయంలో, భారత సైన్యం శాంతి పరిరక్షణకు కట్టుబడి ఉన్నప్పటికీ, దేశ ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు ఎల్లప్పుడూ అప్రమత్తంగా, పూర్తి సామర్థ్యంతో సిద్ధంగా ఉంటుందని జనరల్ ద్వివేది స్పష్టం చేశారు. “బలంతో శాంతిని నెలకొల్పడం మా విధానం. ఎల్ఏసీ వెంబడి భారత సైన్యం దృఢమైన, విశ్వసనీయమైన రక్షణ వ్యవస్థతో దేశ ప్రయోజనాలను కాపాడుతోంది” అని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!