Saudi Arabia: క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్పై సంచలన ఆరోపణలు.. యుద్దం కోసం తండ్రి సంతకం ఫోర్జరీ..
- క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్పై సంచలన ఆరోపణలు..
- యుద్దం కోసం తండ్రి సంతకం ఫోర్జరీ చేశాడన్న మాజీ అధికారి..
- ప్రవాసంలో జీవిస్తున్న సౌదీ మాజీ అధికారి అల్-జబ్రీ..
- తనను చంపేందుకు యత్నిస్తున్నాడని ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saudi Arabia: సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్(ఎంబీఎస్)పై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. యెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదారులపై సౌదీ యుద్ధాన్ని ప్రారంభించేందుకు ఎంబీఎస్ తన తండ్రి సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు సౌదీకి చెందిన మాజీ అధికారి ఒక నివేదికలో ఆరోపించారు. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌదీ మాజీ అధికారి సాద్ అల్-జబ్రీ ఈ ఆరోపణలు చేశారు. అయితే, ఆయన వ్యాఖ్యలపై సౌదీ అరేబియా వెంటనే స్పందించలేదు. అతడిని ‘‘పరువు లేని మాజీ అధికారి’’గా సౌదీ అభివర్ణించింది. కెనడాలో ప్రవాసంలో జీవిస్తున్న అల్-జబ్రీని సౌదీ అరేబియాకి తిరిగి రప్పించేందుకు అతడిన ఇద్దరు పిల్లలను జైలులో ఉంచడంపై అనేక ఏళ్లుగా వివాదం కొనసాగుతోంది.
Read Also: Murder : జూనియర్ ఆర్టిస్ట్ హత్య.. భర్తే చంపి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం
Also Read
ప్రస్తుతం ప్రిన్స్ ఎంబీఎస్ తన తండ్రి 88 ఏళ్ల రాజు సల్మాన్ స్థానంలో వాస్తవ పాలకుడిగా పనిచేస్తున్నారు. 2015లో యెమెన్ యుద్ధం ప్రారంభమైన సమయంలో, ఎంబీఎస్ అధికారం అధిరోహించే ప్రారంభ సమయంలో, అతనిపై ఉన్న అసమ్మతిని విస్తృతంగా అణిచివేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సౌదీ అంతర్గత మంత్రిత్వ శాఖకు చెందిన నమ్మదగిన అధికారి తెలిపిన దాని ప్రకారం.. తన తండ్రి స్థానంలో యుద్ధం ప్రకటిస్తూ ప్రిన్స్ ఎంబీఎస్ రాయల్ డిక్రీపై సంతకం చేసినట్లు అల్-జబ్రీ ఆరోపించారు. యెమెన్పై భూతల దాడికి సంబంధించి రాయల్ డిక్రీ ఉన్నట్లు తెలిపారు. ‘‘రాజాజ్ఞ కోసం అతను తన తండ్రి సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. రాజు మానసిక సామర్థ్యం క్షీణిస్తోంది’’ అన్నారు.
ఇరాన్ మద్దతు కలిగిన హౌతీ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా యెమెన్పై యుద్ధం జరిగింది. దాదాపు ఒక దశాబ్ధం పాటు ఇది కొనసాగింది. యుద్ధంలో 1,50,000 కంటే ఎక్కువ మంది మరణించారు. ప్రపంచంలో ఘోరమైన మానవతా సంక్షోభాన్ని సృష్టించింది. యుద్ధ సమయంలో ఎంబీఎస్ రక్షణ మంత్రిగా ఉన్నారు. అల్-జబ్రీ సెప్టెంబరు 11, 2001 దాడుల తర్వాత సౌదీలో అల్-ఖైదా మిలిటెంట్లకు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో యుఎస్కి నమ్మకస్తుడైన మాజీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ నయేఫ్ కోసం పనిచేశాడు. కింగ్ సల్మాన్ 2017లో తన కుమారుడు ఎంబీఎస్ని క్రౌన్ ప్రిన్స్ హోదాలోకి తీసుకువచ్చాడు. ఎంబీఎస్ తనను చంపాలని చూస్తున్నాడని అల్-జబ్రీ ఆరోపించారు. నేను చనిపోయే వరకు అతను విశ్రమించడని ఆయన పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!