Pakistan-Saudi Pact: భారత్-పాక్ యుద్ధం జరిగితే, సౌదీ భారత్పై దాడి చేస్తుందా..? కొత్త ఒప్పందం ఏం చెబుతోంది.?
- పాకిస్తాన్-సౌదీ అరేబియా మధ్య రక్షణ ఒప్పందం..
- ఒక దేశంపై యుద్ధం జరిగితే మరో దేశం యుద్ధం చేస్తుందా..?
- భారత్పై ఎలాంటి ప్రమాదం ఉంటుంది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan-Saudi Pact: భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుంది అని అనుకోండి, పాకిస్తాన్ దారుణంగా దెబ్బతిన్నది ఊహించుకోండి, ఆ సమయంలో భారత్పై యుద్ధానికి సౌదీ అరేబియా వస్తుందా..? ఇప్పుడు ఇదే పెద్ద ప్రశ్నగా ఉంది. తాజాగా, పాకిస్తాన్-సౌదీ అరేబియా మధ్య ఒక రక్షణ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం, రెండు దేశాల్లో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా, అది రెండో దేశంపై దాడిగా పరిగణించబడుతుందనేది ఒప్పందం సారాంశం. అయితే, నిజంగా భారత్కు వ్యతిరేకంగా సౌదీ రాయల్ ఆర్మీ భారత్పై యుద్ధానికి దిగుతుందా.? అంటే సందేహమే. కానీ, పాకిస్తాన్ మాత్రం మాకు అండగా సౌదీ ఉందని తెగ ఫీల్ అవుతోంది.
ఇజ్రాయిల్ టార్గెట్..
Also Read
- Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
- India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
- Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
- US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
నిజానికి ఈ ఒప్పందం భారత్ కన్నా, ఇజ్రాయిల్ను ఎక్కువగా టార్గెట్ చేస్తుంది. ఇటీవల, హమాస్ అగ్ర నాయకత్వమే లక్ష్యంగా ఖతార్ రాజధాని దోహాపై ఇజ్రాయిల్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. తమకు వ్యతిరేకంగా, తమ ఉనికిని ప్రశ్నించే వారి పట్ల తాము దాడులు చేస్తామని ఇజ్రాయిల్ స్పష్టం చేసింది. మధ్యప్రాచ్యంలో అమెరికాకు అత్యంత మిత్రదేశమైన ఖతార్ను కూడా ఇజ్రాయిల్ వదలలేదు. తాజాగా, పాక్-సౌదీల ‘వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం’ భారత్ కన్నా, ఇజ్రాయిల్నే లక్ష్యంగా చేసుకుంది.
నిజానికి, సౌదీకి భారత్తోనే ఎక్కువ వ్యాపార, వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. నిజంగా పాకిస్తాన్తో భారత్ యుద్ధమే చేస్తే సౌదీ రంగంలోకి దిగుతుందనేది అనుమానమే. ఎందుకంటే, భారత్తో సౌదీ లెక్కలు వేరుగా ఉంది. నాటో తరహా ఒప్పందంలో ‘‘ఒకరిపై దాడి= రెండింటిపై దాడి’’ అనే పదాలు భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ చూస్తోంది. ఇది సౌదీతో అతిపెద్ద దౌత్యవిజయంగా ఆ దేశం పేర్కొంటోంది.
భారత్కి హెచ్చరిక కాదు..
అయితే, ఈ ఒప్పందాన్ని పాకిస్తాన్ భారత్ని లక్ష్యంగా చూస్తుంటే, సౌదీ ఇజ్రాయిల్ను లక్ష్యంగా చూస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం, రెండు దేశాలు భారత్పై యుద్ధానికి వస్తాయనేది అర్థం కాదని అంతర్జాతీయ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవికత చాలా భిన్నంగా ఉంటుందని చెబుతున్నారు.
సౌదీ అరేబియా భారతదేశానికి నాలుగో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కాగా, భారత్ సౌదీకి రెండో అతిపెద్ద భాగస్వామి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో, ద్వైపాక్షిక వాణిజ్యం USD 41.88 బిలియన్ల వద్ద ఉంది. రెండు దేశాలు లోతైన ఆర్థిక, సామాజిక-సాంస్కృతిక సంబంధాలను పంచుకుంటాయి. ఇక పాకిస్తాన్ గురించి మాట్లాడితే, సౌదీ అరేబియాతో వారి వాణిజ్యం కేవలం 3-4 బిలియన్ డాలర్లు మాత్రమే.
భవిష్యత్తులో భారత్-పాక్ యుద్ధమే వస్తే, సౌదీ భారత్తో తన సంబంధాలను ప్రమాదంలో పడేయదు. కానీ, ఇజ్రాయిల్ సౌదీపై దాడి చేస్తే మతం, రాజకీయాలు, ఒప్పందం కోసం జోక్యం చేసుకుంటుంది. ఇదిలా ఉంటే, సౌదీ అరేబియా చాలా ఏళ్లుగా పాకిస్తాన్ అణ్వాయుధ కార్యక్రమంపై తన ఆసక్తిని చూపిస్తోంది. నిజానికి, పాక్ అణ్వాయుధ కార్యక్రమాలకు సౌదీ నిధులు సమకూర్చినట్లు చాలా మంది నమ్ముతారు. ఇదే విషయం రిటైర్డ్ పాకిస్తాన్ జనరల్ ఫిరోజ్ హసన్ ఖాన్ రాసిన ‘ఈటింగ్ గ్రాస్: ది మేకింగ్ ఆఫ్ ది పాకిస్తానీ బాంబ్’ పుస్తకంలో దీని ప్రస్తావన ఉంది.
తాజావార్తలు
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
-
Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!