ఉత్తరప్రదేశ్లో జరిగిన తొక్కిసలాట 121 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు చలించిపోయాయి. ఇప్పటికే ఈ ఘటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతాపం తెలిపారు. తాజాగా జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా కూడా సంతాపం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Strong Bones : వృద్ధాప్యం వరకు ఫిట్గా, ఎముకలు దృఢంగా ఉండాలంటే ఇవి తినాల్సిందే..
హత్రాస్ బాధితుల ఆత్మ కోసం ప్రార్థిస్తున్నట్లు జపాన్ ప్రధాని అన్నారు. ఈ ఘటన చాలా విచారంగా ఉందని పేర్కొ్న్నారు. తొక్కిసలాటలో ఎంతో మంది విలువైన ప్రాణాలు కోల్పోయారని తెలుసుకుని చాలా బాధపడినట్లు చెప్పారు. జపాన్ ప్రభుత్వం తరపున బాధితుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు కిషిదా తెలిపారు.
ఇది కూడా చదవండి: T20 ICC Rankings : ‘ టాప్ ‘ లేపిన హార్దిక్.. మరోవైపు బుమ్రా, అర్ష్దీప్ సింగ్..?
హత్రాస్ ఘటనలో 121 మంది ప్రాణాలు కోల్పోగా.. కనీసం 35 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే యోగి సర్కార్ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్రపతి, ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర ప్రతిపక్ష నేతలు ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఓదార్చారు.
ఇది కూడా చదవండి: Kolikapudi Srinivas: తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కీలక పోస్ట్..