Russia-Ukraine War: అంధకారంలో ఉక్రెయిన్.. చలికాలం నేపథ్యంలో రష్యా భీకరదాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia-Ukraine War: ఉక్రెయిన్ పై యుద్ధ తంత్రాన్ని మార్చింది రష్యా. ఇంతకాలం నాటో దేశాల సహాయంలో ఉక్రెయిన్ దాడులు చేస్తూ రష్యాను ఆత్మరక్షణలో పడేసింది. దీంతో మాస్కో తన వార్ ప్లాన్ ను అమలు చేస్తోంది. చలికాలం నేపథ్యంలో ఉక్రెయిన్ ను దెబ్బతీసేలా దాడులు చేస్తోంది. ముఖ్యంగా ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా ఇరాన్ ‘‘కామికేజ్’’ డ్రోన్ల సహాయంతో ప్రధాన నగరాలపై భీకరదాడులు చేస్తోంది. రాజధాని కీవ్ తో సహా, జపొరిజ్జియా, దినిప్రో, జటోమిర్ నగరాల్లోని విద్యుత్ వ్యవస్థలను నాశనం చేస్తోంది. ఇప్పటికే 30 శాతం ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. అయితే మరోవైపు విద్యుత్ పునరుద్ధరించే చర్యలను చేపట్టినా మరికొన్ని రోజుల వరకు ఉక్రెయిన్ అంధకారంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఒకవేళ విద్యుత్ వ్యవస్థను తిరిగి పునరుద్ధరించినా.. రష్యా మళ్లీ దాడులు చేయదనే గ్యారెంటీ లేదు. దీంతో అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: T20 World Cup: నేడే భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. అందరి కళ్లు వరుణుడిపైనే..!!
Also Read
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
- Lufthansa Boeing 787 : గేట్ వద్దే కుప్పకూలిన బోయింగ్ 787 విమానం.. వైరల్ వీడియోలతో కలకలం
- Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
ఇదిలా ఉంటే ఉక్రెయిన్ పౌరులు శరణార్థులుగా మారాలని రష్యా భావిస్తోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. చలికాలం సమయంలో ఉక్రెయిన్ వ్యాప్తంగా విద్యుత్ వ్యవస్థ దెబ్బతింటే, చలికి తట్టుకోలేక అక్కడి ప్రజలు వేరే ప్రాంతానికి వెళ్తారని రష్యా భావిస్తోంది. చలికాలంలో ఉక్రెయిన్ లోని ఇళ్లల్లో వేడిచేసుకునే యంత్రాలు నడవకపోతే ఇబ్బందులు తలెత్తుతాయి. వీటికి విద్యుత్ చాలా అవసరం. దీని కారణంగానే ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థపై రష్యా విరుచుకుపడుతోంది. మౌళిక సదుపాయాలను కూడా దెబ్బతీస్తోంది. తాగునీరు వ్యవస్థలు ధ్వంసం అవుతున్నాయి. దీంతో ప్రజలు నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. కరెంట్ కష్టాలతో పలు ఆస్పత్రుల్లో సేవలు నిలిచిపోతున్నాయి.
కీవ్ నగరంలో 50 వేల మంది అంధకారంలో ఉన్నారు. జటోమిర్ లో 2.5 లక్షల మందికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ పరిస్థితి దారుణంగా తయారైంది. అయితే రష్యా దాడులను ఎదుర్కొంటామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అయితే 100 శాతం రష్యా క్షిపణులను, డ్రోన్లు అడ్డుకునే టెక్నాలజీ మా దగ్గర లేదని అయితే..తమ మిత్రదేశాల సహకారంలో త్వరలోనే దీన్ని సాధిస్తామని శనివారం ఆయన అన్నారు. ఉక్రెయిన్ మౌళిక వ్యవస్థలే లక్ష్యంగా రష్యా దాడులు చేస్తుందని ఆరోపించారు.
తాజావార్తలు
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
-
AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ వచ్చేసింది.. జూన్ 5న నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పుడంటే..
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!