Russia-Ukraine War: అంధకారంలో ఉక్రెయిన్.. చలికాలం నేపథ్యంలో రష్యా భీకరదాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia-Ukraine War: ఉక్రెయిన్ పై యుద్ధ తంత్రాన్ని మార్చింది రష్యా. ఇంతకాలం నాటో దేశాల సహాయంలో ఉక్రెయిన్ దాడులు చేస్తూ రష్యాను ఆత్మరక్షణలో పడేసింది. దీంతో మాస్కో తన వార్ ప్లాన్ ను అమలు చేస్తోంది. చలికాలం నేపథ్యంలో ఉక్రెయిన్ ను దెబ్బతీసేలా దాడులు చేస్తోంది. ముఖ్యంగా ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా ఇరాన్ ‘‘కామికేజ్’’ డ్రోన్ల సహాయంతో ప్రధాన నగరాలపై భీకరదాడులు చేస్తోంది. రాజధాని కీవ్ తో సహా, జపొరిజ్జియా, దినిప్రో, జటోమిర్ నగరాల్లోని విద్యుత్ వ్యవస్థలను నాశనం చేస్తోంది. ఇప్పటికే 30 శాతం ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. అయితే మరోవైపు విద్యుత్ పునరుద్ధరించే చర్యలను చేపట్టినా మరికొన్ని రోజుల వరకు ఉక్రెయిన్ అంధకారంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఒకవేళ విద్యుత్ వ్యవస్థను తిరిగి పునరుద్ధరించినా.. రష్యా మళ్లీ దాడులు చేయదనే గ్యారెంటీ లేదు. దీంతో అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: T20 World Cup: నేడే భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. అందరి కళ్లు వరుణుడిపైనే..!!
Also Read
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్లైన్.. భారత్కు పెరిగిన కష్టాలు!
- Explainer: సిక్కులపై అమెరికా పగ పట్టిందా?
- China-India Air Connectivity: 6 ఏళ్ల తర్వాత మళ్లీ గ్వాంగ్జౌ-న్యూఢిల్లీ విమాన సర్వీసులు.. సెప్టెంబర్ 21 నుంచి రాకపోకలు
- BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
ఇదిలా ఉంటే ఉక్రెయిన్ పౌరులు శరణార్థులుగా మారాలని రష్యా భావిస్తోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. చలికాలం సమయంలో ఉక్రెయిన్ వ్యాప్తంగా విద్యుత్ వ్యవస్థ దెబ్బతింటే, చలికి తట్టుకోలేక అక్కడి ప్రజలు వేరే ప్రాంతానికి వెళ్తారని రష్యా భావిస్తోంది. చలికాలంలో ఉక్రెయిన్ లోని ఇళ్లల్లో వేడిచేసుకునే యంత్రాలు నడవకపోతే ఇబ్బందులు తలెత్తుతాయి. వీటికి విద్యుత్ చాలా అవసరం. దీని కారణంగానే ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థపై రష్యా విరుచుకుపడుతోంది. మౌళిక సదుపాయాలను కూడా దెబ్బతీస్తోంది. తాగునీరు వ్యవస్థలు ధ్వంసం అవుతున్నాయి. దీంతో ప్రజలు నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. కరెంట్ కష్టాలతో పలు ఆస్పత్రుల్లో సేవలు నిలిచిపోతున్నాయి.
కీవ్ నగరంలో 50 వేల మంది అంధకారంలో ఉన్నారు. జటోమిర్ లో 2.5 లక్షల మందికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ పరిస్థితి దారుణంగా తయారైంది. అయితే రష్యా దాడులను ఎదుర్కొంటామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అయితే 100 శాతం రష్యా క్షిపణులను, డ్రోన్లు అడ్డుకునే టెక్నాలజీ మా దగ్గర లేదని అయితే..తమ మిత్రదేశాల సహకారంలో త్వరలోనే దీన్ని సాధిస్తామని శనివారం ఆయన అన్నారు. ఉక్రెయిన్ మౌళిక వ్యవస్థలే లక్ష్యంగా రష్యా దాడులు చేస్తుందని ఆరోపించారు.
తాజావార్తలు
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
-
Irumudi Effect : అయ్యప్ప దీక్షలో గణపయ్య.. తలపై స్వయంగా ‘ఇరుముడి’ పెడుతున్న శివుడు!
-
Allu Arjun Fans : బాక్సాఫీస్ వద్దే కాదు సామాజిక సేవలోనూ ‘తగ్గేదే లే’
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!