Russia-Ukraine War: రష్యా మిస్సైల్ అటాక్..21 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్ పై భీకరదాడిని కొనసాగిస్తోంది రష్యా. యుద్ధం ప్రారంభం అయి నాలుగు నెలలు గడిచినా.. రష్యా తన దాడిని ఆపడం లేదు. ఉక్రెయిన్ లోని ప్రధాన పట్టణాలు, నగరాలు మసిదిబ్బను తలపిస్తున్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాలపై రష్యా దాడులను ఎక్కువ చేసింది. క్రమంగా ఉక్రెయిన్ తూర్పు భాగం రష్యా చేతుల్లోకి వెళ్లిపోతోంది.
తాజాగా శుక్రవారం రాత్రి సమయంలో రష్యా జరిపిన క్షిపణి దాడిలో 21 మంది మరణించారు. బ్లాక్ సీ ఒడెస్సా పోర్టుకు దక్షిణంగా 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న రిసార్ట్ పట్టణం సెర్గివ్కాపై రష్యా దాడి చేసింది. మిస్సైల్ స్ట్రైక్ వల్ల ఓ అపార్ట్మెంట్ తీవ్రంగా దెబ్బతింది. రష్యా దాడిలో 12 ఏళ్ల బాలుడితో పాటు 20 మంది మరణించారు. రష్యా దాడిని ఉగ్రవాద చర్యగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అభివర్ణించాడు.
Also Read
- Sheikh Hasina: "నన్ను అంతం చేయడం మీ తరం కాదు! నేను మళ్లీ నా దేశానికి వస్తా.. నన్ను ఎవరూ ఆపలేరు": షేక్ హసీనా
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
- Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
ఫిబ్రవరి నెలలో మొదలైన యుద్ధం ఉక్రెయిన్ ను సర్వనాశనం చేస్తోంది. బలమైన రష్యా ముందు కొన్ని రోజుల్లోనే లొంగిపోతుందనుకున్న ఉక్రెయిన్ తెగించి పోరాడుతోంది. అమెరికా, నాటో దేశాలు ఇస్తున్న ఆయుధ, వ్యూహాత్మక సహాయంతో రష్యాను నిలువరిస్తోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను స్వాధీనం చేసుకోవడానికి కొన్ని నెలులు ప్రయత్నించినా రష్యాకు సాధ్యపడలేదు. దీంతో చేసేందేం లేక తూర్పు ప్రాంతం నుంచి దాడులు మొదలుపెట్టింది ఉక్రెయిన్.
రష్యా దాడుల వల్ల ఉక్రెయిన్ లోని చారిత్రక సంపద దెబ్బతింటోంది. కీవ్ తో పాటు ఖార్కీవ్, సుమీ, మరియోపోల్, ఎల్వీవ్ వంటి నగరాలు రష్యా దాడులతో దెబ్బతిన్నాయి. ఇదిలా ఉంటే వీధుల్లో పడి ఉన్న శవాల వల్ల కలరా వ్యాపిస్తోంది. ఉక్రెయిన్ భూభాగం బాంబులు, క్షిపణులతో నిండి ఉంది. ఇప్పటికే ఉక్రెయిన్ లో 20 శాతం భూభాగం రష్యా ఆధీనంలోకి వెళ్లింది.
తాజావార్తలు
-
Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
-
Petrol Price Hike: హైదరాబాద్లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
-
Karuppu: ఆర్జే బాలాజీ ప్లానింగ్కు ఫిదా అవుతున్న సూర్య అభిమానులు
-
Gautam Adani: అమెరికాలో అదానీ గెలిచాడు.. ఒక్క దెబ్బతో లీగల్ కేసులన్నీ క్లోజ్.. రూ.84 వేల కోట్ల ప్లాన్తో సరికొత్త చరిత్ర!
-
Suriya : సూర్య సాలిడ్ హిట్ కొట్టాడు.. ఆ హీరో కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!