Rishi Sunak: యూకేకు కాబోయే పీఎం రిషి సునాక్.. ఇండియాతో ఉన్న సంబంధాలు ఇవే….
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishi Sunak’s Indian Connections: భారతదేశాన్ని శతాబ్ధాల పాటు పాలించిన బ్రిటన్ కు తొలిసారి భారతీయ మూలాలు ఉన్న రిషి సునాక్ ప్రధాని పదవిని చేపట్టడం దాదాపుగా ఖాయమైంది. ప్రస్తుతం యూకే ఉన్న ఆర్థిక పరిస్థితి నుంచి ఒక్క రిషి సునాక్ మాత్రమే గట్టెక్కించగలడనే అభిప్రాయం అక్కడి ప్రజాప్రతినిధుల్లో ఉంది. దీంతో మెజారిటీ ఎంపీలు రిషి సునాక్ కే మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే 170కి పైగా ఎంపీలు మద్దతు తెలిపారు. మరోవైపు సునాక్ ప్రత్యర్థిగా ఉన్న పెన్నీ మోర్డాంట్ కు కేవలం 29 మంది ఎంపీలే మద్దతు తెలిపారు. దీంతో రిషి సునాక్ ప్రధాని పదవిని చేపట్టడం దాదాపుగా ఖాయం అయింది.
యార్క్ షైర్ ఎంపీగా బ్రిటన్ పార్లమెంట్ లో పదవీ స్వీకారం చేసే సమయంలో భగవద్గీతపై ప్రమాణం చేసి అందర్ని ఆశ్చర్యపరిచారు. రిషి సునక్ బ్రిటన్ లో ఉంటున్నా కూడా భారతీయ సంప్రదాయాలను, మూలాలను మరిచిపోలేదు. రిషి సునాక్ తల్లిదండ్రులు భారతసంతతికి చెందినవారు. 1960ల్లో తూర్పు ఆఫ్రికా నుంచి వీరిద్దరు యూకేకి వలసవెళ్లారు. పంజాబ్ మూలాలు ఉన్న రిషి సునాక్ పూర్వీకులు ఆఫ్రికాకు వలస వెళ్లారు. అక్కడి నుంచి బ్రిటన్ వెళ్లారు. రిషి సునాక్ 12 మే 1980న ఇంగ్లాండ్లో ఉషా సునాక్, యశ్వీర్ సునాక్ లకు జన్మించారు.
Also Read
- Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
- India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
- Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
- US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
Read Also: India World Record: పాక్పై విజయంతో.. ఆ వరల్డ్ రికార్డ్ బద్దలుకొట్టిన భారత్
రిషి సునాక్, భారతీయ మహిళ అక్షతామూర్తిని వివాహం చేసుకున్నారు. అక్షతా మూర్తి ఇన్ఫోసిస్ చీఫ్ నారాయణ మూర్తి కుమార్తె. వారిద్దరికి కృష్ణ, అనౌష్క అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బోరిస్ జాన్సన్ నాయకత్వంలో ఛాన్సలర్ గా ఉన్న రిషి సునక్ డౌనింగ్ స్ట్రీట్ లో కుటుంబంతో దీపావళి వేడుకలు జరుపుకోవడం అప్పట్లో ప్రముఖ వార్తగా నిలిచింది. రిషి సునక్ తన వారసత్వం గురించి, కుటుంబం, సంస్కృతి గురించి మాట్లాడుతుంటారు. గతంలో తన అత్తామామలను కలిసేందుకు బెంగళూర్ కూడా వచ్చారు ఆయన. ఈ ఏడాది ఆగస్టు నెలలో కృష్ణాష్టమి సందర్భంగా సునాక్ దంపతులు ‘‘ గో పూజ’’ నిర్వహించడం వైరల్ గా మారింది.
ప్రధాని ఎన్నికల ప్రచారం సమయంలో రిషి సునక్ పలు విమర్శలు ఎదుర్కొన్నారు. ఖరీదైన సూట్లు, బూట్లు, విలాసవంతమైన ఇల్లు ఉన్నాయంటూ విమర్శలు వచ్చాయి. అయితే ఒత్తిడిలో కూడా భగవద్గీత తనను కాపాడుతుందని, తన విధిని గుర్తు చేస్తుందని రిషి చెబుతుంటారు. ఫిట్ గా ఉండేందుకు క్రికెట్ ఆడుతుంటారు రిషి సునాక్.
తాజావార్తలు
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?