Ranil Wickremesinghe: శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్ విక్రమ సింఘే ప్రమాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గొటబాయ రాజపక్స రాజీనామాను పార్లమెంట్ స్పీకర్ మహింద యాపా అబేవర్దన ఆమోదించడంతో శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే శుక్రవారం తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూర్య విక్రమసింఘేతో తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయించారు.
విక్రమసింఘేను మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స జులై 13న తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించారు. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన భారీ నిరసన కారణంగా మాల్దీవులకు పారిపోయారు. అక్కడి నుంచి సింగపూర్ వెళ్లారు.
సింగపూర్కు చేరుకున్న గొటబాయ రాజపక్స అధ్యక్ష పదవికి అధికారికంగా రాజీనామా చేస్తూ లేఖను గురువారం స్పీకర్కు పంపించారు. దీనిపై స్పీకర్ అబేవర్దన స్పందిస్తూ.. అధ్యక్షుడి రాజీనామా ఆమోదించబడిందని వెల్లడించారు. చట్టపరంగా అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుందన్నారు. జులై 14న అధ్యక్షుడు తన బాధ్యతల నుంచి తప్పుకున్నారని చెప్పారు. 1981లోని ప్రత్యేక నిబంధనల చట్టం నెం.2, రాజ్యాంగంలోని 40వ అధికరణ నిబంధనల ప్రకారం అధ్యక్షుడిని ఎంపిక చేస్తామని అబేవర్దన తెలిపారు. అధ్యక్ష ఎన్నికను విజయవంతంగా, వేగంగా పూర్తి చేయాలనేదే తన ఉద్దేశమని స్పీకర్ వెల్లడించారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో పూర్తి చేయడం శ్రీలంక చరిత్రలోనే కాకుండా ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్ర ఒక మైలురాయి అవుతుందన్నారు.
Also Read
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
- 39 సెకన్లలో దాదాపు లక్ష మంది మృతి?.. Venezuela Earthquakeపై షాకింగ్ రిపోర్ట్..
- Explainer: చరిత్రలో దాచిన ఆకలి విషాదం.. 30లక్షల మంది భారతీయుల చావుకు చర్చిల్ కారణం?
- US Citizenship Fee Hike: ఎన్నారైలకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న అమెరికా సిటిజన్షిప్ ఫీజులు?
MonkeyPox: మంకీపాక్స్ పై కేంద్రం అలర్ట్.. మార్గదర్శకాలు జారీ
మాల్దీవుల నుంచి వెళ్లిన రాజపక్సే గురువారం సాయంత్రం సౌది ఎయిర్లైన్స్ విమానంలో సింగపూర్ చేరుకున్నారని మీడియా కథనాలు తెలిపాయి. రాజపక్స, ఆయన భార్య సింగపూర్లో ఉంటారని సమాచారం. 73 ఏళ్ల రాజపక్స జులై 9న తన నివాసంపై నిరసనకారులు మూకుమ్మడిగా దాడి చేయడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. బుధవారం తన రాజీనామా లేఖను అందజేస్తానని ఆయన ప్రకటించారు. అంతకుముందు, రాజపక్స తన భార్యతో కలిసి మాల్దీవులకు పారిపోయారు. ఆ తర్వాత శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని రణిల్ విక్రమసింఘేను స్పీకర్ నియమించారు.
తాజావార్తలు
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
ట్రెండింగ్
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!