Vladimir Putin: యూరోపియన్ నాయకులు ‘పంది పిల్లలు’.. ఉక్రెయిన్ను స్వాధీనం చేసుకుంటాం..
- ఐరోపా నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన రష్యా అధ్యక్షుడు పుతిన్..
- యూరోపియన్ నాయకులు పంది పిల్లలు అంటూ సంబోధించిన వ్లాదిమిర్ పుతిన్..
- ఉక్రెయిన్ లోని మరిన్ని భూ భాగాలను స్వాధీనం చేసుకుంటామని పుతిన్ హెచ్చరికలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం నాడు ఐరోపా నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వారు పంది పిల్లలు అంటూ ఎద్దేవా చేశారు. రష్యా ఏదోక రోజు నాటో కూటమి దేశాలపై కూడా దాడి చేస్తుందనే అనవసర భయాలను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అమెరికా ప్రతిపాదించిన శాంతి ఒప్పందానికి మద్దతు తెలపకపోతే.. ఉక్రెయిన్ లోని మరిన్ని భూ భాగాలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించాడు. రష్యా రక్షణ శాఖ వార్షిక సమావేశాల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: IPL 2026లో MS Dhoniని కంటే ఎక్కువ డబ్బు సంపాదించే 8 మంది సీఎస్కే ప్లేయర్స్ వీళ్లే..?
Also Read
- Zohran Mamdani: నెతన్యాహూను అరెస్ట్ చేస్తాం.. న్యూయార్క్ మేయర్ హెచ్చరిక..
- Two US Soldiers Killed: ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతి.. "మరచిపోలేని గుణపాఠం చెబుతాం" అంటూ ఖమేనీ హెచ్చరిక
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఈ సందర్భంగా మాస్కో అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ.. రష్యా దళాలు అన్ని వైపుల నుంచి ఉక్రెయిన్లోకి చొచ్చుకెళ్తున్నాయని పేర్కొన్నారు. దౌత్యం లేదా బలప్రయోగంతోనైనా చారిత్రక ప్రాధాన్యం కలిగిన ప్రదేశాలకు ఉక్రెయిన్ నుంచి విముక్తి కల్పిస్తామని వెల్లడించారు. అమెరికా ప్రతిపాదిక శాంతి ఒప్పందంపై పురోగతి లేకపోవడంతో పుతిన్ ఈ హెచ్చరికలు చేశారు. అలాగే, యుద్ధం ముగింపు దిశగా యూఎస్ ఇటీవల రష్యాతో పాటు ఉక్రెయిన్, ఐరోపా నేతలతో వేర్వేరుగా చర్చలు కొనసాగించింది. కానీ, శాంతి ఒప్పందంలో భాగంగా తన భూభాగాలు కోల్పోవాల్సి రావడంపై ఉక్రెయిన్తో పాటు ఇతర యూరోపియన్ దేశాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ భద్రతకు మరిన్ని రక్షణలు కావాలని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ పట్టుబడుతున్నాడు. పాశ్చాత్య దేశాల ఒత్తిడి ఉన్నప్పటికీ తాము మాత్రం తమ ప్రణాళికలతో యథావిధిగా ముందుకు కొనసాగుతామని వ్లాదిమిర్ పుతిన్ తేల్చి చెప్పారు.
Read Also: Trump-White House: జో బైడెన్ చెత్త అధ్యక్షుడు.. వైట్హౌస్లో అధ్యక్షుల చిత్రపటాల కింద రాతలు
ఇక, రష్యా రక్షణ శాఖ మంత్రి ఆండ్రె బెలోసోవ్ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది దాడుల తీవ్రత మరింత పెంచుతామని వార్నింగ్ ఇచ్చారు. ఈ ఏడాది దేశ జీడీపీలో 5.1 శాతం మొత్తాన్ని యుద్ధానికి కేటాయించామని పేర్కొన్నారు. అలాగే, అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. క్రిమియాతో పాటు ఉక్రెయిన్లోని సుమారు 19 శాతం భూభాగం ప్రస్తుతం రష్యా ఆధీనంలోకి వెళ్లిపోయింది. డోన్బాస్, ఖెర్సన్, జెపోరిజియా ప్రాంతాలు అనేకం మాస్కో ఆధీనంలోకి వెళ్లిపోయాయి. ఇవన్నీ ఇకపై తమ భూభాగాలే అని రష్యా ఇప్పటికే ప్రకటించుకున్నా ఉక్రెయిన్ మాత్రం ఈ వాదనలను ఖండించింది.
తాజావార్తలు
-
Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
-
Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
-
Horror Movie: మైత్రి మూవీ మేకర్స్ నుంచి తొలి హారర్ మూవీ.. ‘418’తో భయపెట్టేందుకు సిద్ధం!
-
Home Guard: 5 నెలలుగా జీతం లేదు.. కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు
-
CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!