Trump-White House: జో బైడెన్ చెత్త అధ్యక్షుడు.. వైట్హౌస్లో అధ్యక్షుల చిత్రపటాల కింద రాతలు
- వైట్హౌస్లో ‘ప్రెసిడెన్షియల్ వాక్ ఆఫ్ ఫేమ్’ ఏర్పాటు
- డెమొక్రాటిక్ నేతలను విమర్శిస్తూ రాతలు
- అమెరికాను కాపాడేవాడు అంటూ ట్రంప్ చిత్రపటం కింద ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్ర రాజ్యం అమెరికాను ఎవరు పరిపాలించినా అధ్యక్షుల ఫొటోలు వైట్హౌస్లో ఉంటాయి. డెమొక్రాటిక్ నేతలైనా.. రిపబ్లికన్ నేతలైనా వారి చిత్రపటాలు శ్వేతసౌధంలో ఉంచుతారు. కొత్తగా ‘ప్రెసిడెన్షియల్ వాక్ ఆఫ్ ఫేమ్’ ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిని కలిసేందుకు వచ్చే అతిథులు, ప్రముఖులు గ్యాలరీని సందర్శించేలా ఏర్పాటు చేశారు. తాజాగా చిత్రపటాల కింద కొందరిపై విమర్శలు.. మరికొందరిపై పొగడ్తలతో కూడిన రాతలు ప్రత్యక్షమయ్యాయి. ప్రస్తుతం ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Also Read
ఏయే కాలాల్లో ఎవరు.. ఎప్పుడు పరిపాలించారో వారి చిత్రపటాలు పెట్టారు. తాజాగా ఆ చిత్రపటాల కింద కొత్తగా రాతలు కూడా పొందిపరిచారు. ఆ రాతలు స్వయంగా అధ్యక్షుడు ట్రంప్ రాసినట్లుగా ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు. ప్రతి అధ్యక్షుడి గురించి వర్ణిస్తూ రాశారు. జో బైడెన్, బరాక్ ఒబామా, జిమ్మీ కార్టర్ వంటి డెమొక్రాటిక్ అధ్యక్షులపై తీవ్ర పదజాలాలు ప్రయోగించారు. రోనాల్డ్ రీగన్, రిచర్డ్ నిక్సన్ వంటి రిపబ్లికన్ నేతలపై మాత్రం ప్రశంసలు కురిపిస్తూ రాతలున్నాయి. ఇక జో బైడెన్ ఫొటో లేకుండానే రాతలు రాశారు. అమెరికా చరిత్రలో చెత్త అధ్యక్షుడు అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జో బైడెన్…
జో బైడెన్కు సంబంధించిన రెండు ఫలకాలు ఉన్నాయి. ఆ చిత్రపటాలపై ‘‘ఇప్పటి వరకు అమెరికా చరిత్రలో అత్యంత చెత్త అధ్యక్షుడు’’ అంటూ వర్ణిస్తూ రాతలు ఉన్నాయి. ఎన్నికల్లో అవినీతికి పాల్పడి పదవీ బాధ్యతలు స్వీకరించారంటూ ఆరోపించారు. ద్రవ్యోల్బణం, సరిహద్దు భద్రతా వైఫల్యాలు, ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా సైన్యం ఉపసంహరణ, అంతర్జాతీయ సంఘర్షణలకు దారి తీశాయంటూ నిందిస్తూ రాశారు. ఇంకో ఫలకంపై జో బైడెన్ ‘స్లీపీ’, ‘క్రూకెడ్’ అంటూ రాసి ఉన్నాయి. ట్రంప్ చిత్రపటం దగ్గర మాత్రం అమెరికాను కాపాడేవాడు అంటూ రాసి ఉంది.
ఒబామా…
ఇక ఒబామా చిత్రపటం దగ్గర ‘‘అమెరికన్ చరిత్రలో అత్యంత విభజనకర రాజకీయ వ్యక్తుల్లో ఒకరు’’ అంటూ రాసి ఉంది. అఫర్డబుల్ కేర్ చట్టం, ఇరాన్ అణు ఒప్పందం, పారిస్ వాతావరణ ఒప్పందాన్ని విమర్శిస్తూ రాతలు ఉన్నాయి. 2016లో ఎన్నికల ప్రచారంలో ట్రంప్పై నిఘా పెట్టారని పేర్కొన్నారు.
జార్జ్ డబ్ల్యు బుష్..
ఇక జార్జ్ డబ్ల్యు బుష్ చిత్రపటం కింద కూడా విమర్శలు ఉన్నాయి. ఆప్ఘనిస్థాన్, ఇరాక్లో యుద్ధాలు ప్రారంభించారని.. ఈ రెండు కూడా జరిగి ఉండకూడదని రాసి ఉన్నాయి. ఇక ఆయన పదవి చివరి సంవత్సరంలో 2008లో దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తిందని విమర్శించారు. ఇక డిసెంబర్ 2024లో మరణించిన జిమ్మీ కార్టర్ పదవీ కాలాన్ని కూడా విమర్శిస్తూ రాతలున్నాయి.

ఇది కూడా చదవండి: Maharashtra: ‘రమ్మీ’ మంత్రి మాణిక్రావ్ కోకటేకు మళ్లీ ఇక్కట్లు.. పదవికి రాజీనామా
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!