Putin-Bush: వెలుగులోకి 20 ఏళ్ల నాటి పుతిన్-బుష్ సంభాషణ.. పాక్ గురించి ఏం చర్చించారంటే..!
- వెలుగులోకి 20 ఏళ్ల నాటి పుతిన్-బుష్ సంభాషణ
- పాకిస్థాన్ అణ్వాయుధ శక్తిపై పలుమార్లు చర్చ
- బుష్తో పుతిన్ మాట్లాడిన సంభాషణ బహిర్గతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండు దశాబ్దాల క్రితం రష్యా అధ్యక్షుడు పుతిన్-అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ మధ్య జరిగిన ‘పాకిస్థాన్ అణ్వాయుధ’ సంభాషణ వెలుగులోకి వచ్చింది. ఇద్దరి మధ్య జరిగిన ట్రాన్స్క్రిప్ట్లను నేషనల్ సెక్యూరిటీ ఆర్కైవ్ విడుదల చేసింది. ఈ సందర్భంగా పాకిస్థాన్ అణ్వాయుధాలపై ఇరువురి నేతలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేసినట్లుగా పత్రాల్లో వెల్లడయ్యాయి.
ఇది కూడా చదవండి: Canada: కెనడాలో మరో ఘోరం.. టొరంటో వర్సిటీలో భారతీయ విద్యార్థి హత్య
Also Read
- Sergei Ivanov: పుతిన్ రైట్ హ్యాండ్ మృతి.. అది సహజ మరణమా? లేక పక్కా స్కెచా? అసలు నిజమేంటి!
- Sudan Civil War: సుడాన్లో ఊచకోత.. 72 గంటల్లోనే ముంచెత్తిన ముప్పు.. రంగంలోకి దిగిన ప్రపంచ దేశాలు!
- Explainer: చరిత్రలోనే అత్యంత క్రూరమైన ఉగ్రవాద దాడి..41ఏళ్ల తర్వాత బయటపడ్డ కనిష్క విమాన పేలుడు నిజం!
- Earthquake Threat: భారత్కు భూకంప అలర్ట్.. సైంటిస్టుల పరిశోధనలో ఏం తేలింది?
జూన్ 16, 2001లో స్లోవేనియాలో జార్జ్ డబ్ల్యూ బుష్-పుతిన్ మధ్య వ్యక్తిగత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పాకిస్థాన్ అణ్వాయుధాలపై పుతిన్ ఆందోళన వ్యక్తం చేశారు. 2001-2008 మధ్య పలుమార్లు సమావేశాలు, ఫోన్ కాల్ సంభాషణలు జరిగాయి. ఆ సందర్భంగా పాకిస్థాన్ సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ నేతృత్వంలోని ఒక ముఖ్యమైన నాన్-ప్రొలిఫెరేషన్పై ఆందోళన వ్యక్తం చేసినట్లుగా పత్రాలు పేర్కొన్నాయి.
ఇది కూడా చదవండి: Thailand: కంబోడియాలో విష్ణువు విగ్రహాన్ని అందుకే కూల్చాం.. థాయ్లాండ్ వివరణ
అణ్వాయుధంపై పుతిన్ భయాందోళన వ్యక్తం చేసినట్లుగానే జార్జ్ డబ్ల్యూ బుష్ కూడా భయాందోళన వ్యక్తం చేసినట్లుగా ట్రాన్స్క్రిప్ట్లు పేర్కొన్నాయి. ఇక పుతిన్ నమ్మదగినవాడిగా బుష్ అభివర్ణించినట్లుగా తెలుస్తోంది. పాకిస్థాన్ అణ్వాయుధ కార్యక్రమానికి రూపశిల్పి అయిన అబ్దుల్ ఖదీర్ ఖాన్పై సెప్టెంబర్ 29, 2005న ఓవల్ ఆఫీస్ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ఇరానియన్ సెంట్రిఫ్యూజ్ల్లో పాకిస్థాన్కు చెందిన యురేనియం కొనబడిందని బుష్తో పుతిన్ సంభాషించారు. దీనిని బట్టి ఇస్లామాబాద్ అణు నెట్వర్క్ ఇతర దేశాలకు విస్తరిస్తున్నట్లుగా పుతిన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. వెంటనే బుష్ స్పందిస్తూ.. ఈ అన్వేషణ ఆందోళనకరమని అంగీకరించారు. ఇది ఉల్లంఘనగా అభివర్ణించారు. ఈ సంభాషణ బట్టి పాకిస్థాన్ అణ్వాయుధ శక్తి అమెరికాను కూడా భయపెట్టినట్లుగా అర్థమవుతోంది.

ఇక అబ్దుల్ ఖదీర్ ఖాన్ వ్యవహారంలో ఇస్లామాబాద్పై వాషింగ్టన్ తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అప్పటి పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్తో తాను మాట్లాడతానని పుతిన్కు బుష్ భరోసా ఇచ్చారు. అబ్దుల్ ఖదీర్ ఖాన్ను అతని సహచరులను చాలా మందిని జైల్లో పెట్టారని.. గృహ నిర్బంధంలో ఉంచారని బుష్ అన్నారు. అయితే అణ్వాయుధ శక్తిని ఎవరెవరితో పంచుకుందో.. ఎవరికి బదిలీ చేయబడిందో అమెరికా కూడా తెలుసుకోవాలని అనుకుంటోందని బుష్ అన్నారు.
ఇక 9/11 ఉగ్రవాదంపై యుద్ధం తర్వాత పాకిస్థాన్ అధికారికంగా అమెరికాకు కీలక మిత్రదేశంగా మారింది. అయినప్పటికీ వాషింగ్టన్-మాస్కో రెండూ కూడా అణు నిర్వహణను తీవ్ర అనుమానంతో చూశాయని ట్రాన్స్క్రిప్ట్లు వెల్లడించాయి. అయితే 2000లో అబ్దుల్ ఖదీర్ ఖాన్ నెట్వర్క్ ఇరాన్, ఉత్తర కొరియా, లిబియా వరకు విస్తరించినట్లుగా ట్రాన్స్క్రిప్ట్ల్లోని సంభాషణను బట్టి అర్థమవుతోంది.
తాజావార్తలు
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
-
KTR: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు, గులాబీ జెండా ఎగరడం ఖాయం
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..