Putin: ఇరాన్కు విశ్వసనీయ మిత్రులం.. రష్యా అధ్యక్షుడు పుతిన్ సందేశం
- ఇరాన్కు విశ్వసనీయ మిత్రులం
- నమ్మకమైన భాగస్వామిగా ఉంటాం
- రష్యా అధ్యక్షుడు పుతిన్ సందేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్కు రష్యా విశ్వసనీయ మిత్రుడు అని అధ్యక్షుడు పుతిన్ సందేశం ఇచ్చారు. నౌరుజ్ (Nowruz) పెర్షియన్ నూతన సంవత్సరం పండుగ సందర్భంగా ఇరాన్ నాయకులకు రష్యా అధ్యక్షుడు పుతిన్ శుభాకాంక్షలు తెలిపారు. మాస్కో-టెహ్రాన్ మంచి మిత్రులు అని..నమ్మకమైన భాగస్వామిగా ఉంటుందని శనివారం పుతిన్ కీలక సందేశం పంపించారు.
ఇది కూడా చదవండి: Iran-US: బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించిన ఇరాన్.. షాకైన అమెరికా!
Also Read
- Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
- Mohan Bhagwat: ‘భారత్లో ముస్లింలు ఉండకూడదనేవారు హిందువులే కాదు’.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Bank Locker Swept: వరదల్లో కొట్టుకుపోయిన బ్యాంకు లాకర్.. రూ. లక్షల్లో డబ్బు.. ఎగబడిన జనం
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
దేశ సర్వోన్నత నాయకుడు అయతుల్లా మోజ్తాబా ఖమేనీకి, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్కు పుతిన్ శుభాకాంక్షలు పంపారని క్రెమ్లిన్ తెలిపింది. ‘‘ఇరాన్ ప్రజలు కఠినమైన పరీక్షలను గౌరవప్రదంగా అధిగమించాలని పుతిన్ ఆకాంక్షించారు. ఈ క్లిష్ట సమయంలో మాస్కో టెహ్రాన్కు నమ్మకమైన మిత్రుడుగా, విశ్వసనీయ భాగస్వామిగా నిలుస్తుంది.’’ అని క్రెమ్లిన్ తెలిపింది.
ఇక రష్యాకు సంబంధించిన నిఘా సమాచారాన్ని వాషింగ్టన్ ఉక్రెయిన్కు అందించడం మానేస్తే.. ఇరాన్తో నిఘా సమాచారాన్ని పంచుకోవడం క్రెమ్లిన్ ఆపేస్తుందని మాస్కో వాషింగ్టన్కు ఒక ప్రతిపాదన చేసిందని.. అయితే అమెరికా ఆ ఆలోచనను తిరస్కరించిందని పొలిటికో నివేదించింది. క్రెమ్లిన్ మాత్రంఈ నివేదికను నకిలీదిగా కొట్టిపారేసింది.
వెనిజులా నాయకుడు నికోలస్ మదురోను అమెరికా కూలదోయడంతో రష్యా ఒక మిత్రదేశాన్ని కోల్పోయింది. ఇప్పుడు వ్యూహాత్మక భాగస్వామి అయిన ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్ల పెరిగిన చమురు ధరల నుంచి మాస్కో మాత్రం ప్రయోజనం పొందింది. అయితే ఇరాన్ అణు బాంబును అభివృద్ధి చేయడాన్ని తాము కోరుకోవడం లేదని రష్యా పదేపదే చెబుతోంది. అయితే ఈ చర్య మధ్యప్రాచ్యం అంతటా అణ్వాయుధ పోటీకి దారితీస్తుందని మాస్కో భయపడుతోంది.
ఇది కూడా చదవండి: Madhumita: ప్రముఖ నృత్యకారిణి మధుమిత రౌత్ కన్నుమూత
గత నెల 28న ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. దీంతో ప్రతీకారంగా ఇరాన్.. గల్ఫ్ దేశాలపై దాడి చేసింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని మూసేసింది. దీంతో ప్రపంచ దేశాల్లో గ్యాస్, చమురు సంక్షోభం తలెత్తింది.
ఇది కూడా చదవండి: Bengaluru: బెంగళూరులో కొత్త రకం దొంగతనాలు.. షాకైన ప్రజలు
తాజావార్తలు
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
-
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్లో షూటింగ్
-
Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
-
GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు
-
Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!