Putin: ఇరాన్కు విశ్వసనీయ మిత్రులం.. రష్యా అధ్యక్షుడు పుతిన్ సందేశం
- ఇరాన్కు విశ్వసనీయ మిత్రులం
- నమ్మకమైన భాగస్వామిగా ఉంటాం
- రష్యా అధ్యక్షుడు పుతిన్ సందేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్కు రష్యా విశ్వసనీయ మిత్రుడు అని అధ్యక్షుడు పుతిన్ సందేశం ఇచ్చారు. నౌరుజ్ (Nowruz) పెర్షియన్ నూతన సంవత్సరం పండుగ సందర్భంగా ఇరాన్ నాయకులకు రష్యా అధ్యక్షుడు పుతిన్ శుభాకాంక్షలు తెలిపారు. మాస్కో-టెహ్రాన్ మంచి మిత్రులు అని..నమ్మకమైన భాగస్వామిగా ఉంటుందని శనివారం పుతిన్ కీలక సందేశం పంపించారు.
ఇది కూడా చదవండి: Iran-US: బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించిన ఇరాన్.. షాకైన అమెరికా!
Also Read
- Kohinoor: ఈ వజ్రం కోసం యుద్ధాలు ఎందుకు జరిగాయి? శతాబ్దాలుగా వీడని మిస్టరీ!
- PoK Protests: "మాకు పాకిస్థాన్ వద్దు.. భారత్ను సహాయం కోరుతాం!".. PoK నిరసనకారులు తీవ్ర వ్యాఖ్యలు!
- Pakistan-Afghanistan: పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం.. పాకిస్థాన్పై ఆఫ్ఘనిస్థాన్ డ్రోన్ దాడులు!
- Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
దేశ సర్వోన్నత నాయకుడు అయతుల్లా మోజ్తాబా ఖమేనీకి, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్కు పుతిన్ శుభాకాంక్షలు పంపారని క్రెమ్లిన్ తెలిపింది. ‘‘ఇరాన్ ప్రజలు కఠినమైన పరీక్షలను గౌరవప్రదంగా అధిగమించాలని పుతిన్ ఆకాంక్షించారు. ఈ క్లిష్ట సమయంలో మాస్కో టెహ్రాన్కు నమ్మకమైన మిత్రుడుగా, విశ్వసనీయ భాగస్వామిగా నిలుస్తుంది.’’ అని క్రెమ్లిన్ తెలిపింది.
ఇక రష్యాకు సంబంధించిన నిఘా సమాచారాన్ని వాషింగ్టన్ ఉక్రెయిన్కు అందించడం మానేస్తే.. ఇరాన్తో నిఘా సమాచారాన్ని పంచుకోవడం క్రెమ్లిన్ ఆపేస్తుందని మాస్కో వాషింగ్టన్కు ఒక ప్రతిపాదన చేసిందని.. అయితే అమెరికా ఆ ఆలోచనను తిరస్కరించిందని పొలిటికో నివేదించింది. క్రెమ్లిన్ మాత్రంఈ నివేదికను నకిలీదిగా కొట్టిపారేసింది.
వెనిజులా నాయకుడు నికోలస్ మదురోను అమెరికా కూలదోయడంతో రష్యా ఒక మిత్రదేశాన్ని కోల్పోయింది. ఇప్పుడు వ్యూహాత్మక భాగస్వామి అయిన ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్ల పెరిగిన చమురు ధరల నుంచి మాస్కో మాత్రం ప్రయోజనం పొందింది. అయితే ఇరాన్ అణు బాంబును అభివృద్ధి చేయడాన్ని తాము కోరుకోవడం లేదని రష్యా పదేపదే చెబుతోంది. అయితే ఈ చర్య మధ్యప్రాచ్యం అంతటా అణ్వాయుధ పోటీకి దారితీస్తుందని మాస్కో భయపడుతోంది.
ఇది కూడా చదవండి: Madhumita: ప్రముఖ నృత్యకారిణి మధుమిత రౌత్ కన్నుమూత
గత నెల 28న ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. దీంతో ప్రతీకారంగా ఇరాన్.. గల్ఫ్ దేశాలపై దాడి చేసింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని మూసేసింది. దీంతో ప్రపంచ దేశాల్లో గ్యాస్, చమురు సంక్షోభం తలెత్తింది.
ఇది కూడా చదవండి: Bengaluru: బెంగళూరులో కొత్త రకం దొంగతనాలు.. షాకైన ప్రజలు
తాజావార్తలు
-
MEIL Enters Industrial: ఇన్ఫ్రా రంగం నుంచి ఐటీ విప్లవం వైపు.. ఏఐలోకి మేఘా సంస్థ ఎంట్రీ
-
Vaibhav: ఒక్కో రన్కు రూ.14 వేల సంపాదన.. భారీగా పెరిగిన వైభవ్ బ్రాండ్ వ్యాల్యూ.. ఇక్కడే బిగ్ ట్విస్ట్!
-
Hardik Pandya-Fan: ఒడిశా టు బెంగళూరు.. హార్దిక్ కోసం 1800 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన అభిమాని!
-
CM Chandrababu: ‘మావిగన్ అంటే నాకే అర్థం కావడం లేదు’.. జగన్పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు..
-
Tamil Nadu Politics: విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.35 కోట్లతో ఎర..!
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..