PM Narendra Modi: శుక్రవారం పుతిన్తో ప్రధాని మోడీ భేటీ.. అజెండా ఏమిటో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra Modi: శుక్రవారం ఉజ్బెకిస్థాన్లో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ల సమావేశంలో భారత్ మార్కెట్లో రష్యా ఎరువులు, వాణిజ్యం అజెండాలో ఉన్నాయని రష్యా వార్తా పత్రిక క్రెమ్లిన్ వెల్లడించింది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఈ సమావేశం జరగనుంది. ఇరువురు నేతలు వ్యూహాత్మక స్థిరత్వం, ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని పరిస్థితులు, యూఎన్, జీ20లో ద్వైపాక్షిక సహకారం వంటి అంశాలపై కూడా చర్చిస్తారని భావిస్తున్నారు.
“ఇది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే డిసెంబర్లో యూఎన్ భద్రతా మండలిలో భారతదేశం అధ్యక్షత వహిస్తుంది. 2023లో భారతదేశం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) శిఖరాగ్ర సదస్సుకు అధ్యక్షత వహిస్తుంది. మరియు జీ20కి కూడా అధ్యక్షత వహిస్తుంది.” అని రష్యా అధికారిక వార్తా సంస్థ టాస్ అధ్యక్ష సహాయకుడు యూరీ ఉషకోవ్ మంగళవారం విలేకరులతో అన్నారు.
Also Read
- Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
- India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
- Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
- US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
ప్రధాని మోదీ, అధ్యక్షుడు పుతిన్ల భేటీని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇంకా ధృవీకరించలేదు. ఉక్రెయిన్పై దాడి చేసినందుకు పశ్చిమ దేశాల నుంచి ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యా నుంచి భారత్ ముడి చమురును కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం జరగనుంది. భారతీయులు అధిక ఇంధన ధరలను భరించలేరని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ చెప్పడంతో భారతదేశం తన స్థానాన్ని నిలకడగా సమర్థించుకుంది. అమెరికాతో సహా దేశాలకు భారత్ స్థానం తెలుసునని, దానితో ముందుకు సాగుతామని ఆయన అన్నారు.
Maharahtra: పిల్లలను ఎత్తుకుపోతున్నారనే అనుమానంతో సాధువులపై దాడి.. ఆరుగురు అరెస్ట్
రష్యా, భారతదేశాల మధ్య వాణిజ్య టర్నోవర్ పెరుగుతోంది. 2022 మొదటి ఆరు నెలల్లో, ఈ సంఖ్య 11.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది, ఇది సంవత్సరానికి 120 శాతం జోడించిందని రష్యన్ ఏజెన్సీ టాస్ నివేదిక తెలిపింది.
తాజావార్తలు
-
Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
-
Box Office Clash: హారర్ vs రొమాన్స్ vs మాస్ vs యాక్షన్.. ఈ శుక్రవారం బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే..!
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!