EasyJet Flight: అత్యవసర ల్యాండింగ్ చేయించారు.. అడ్డంగా బుక్ అయ్యారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Police Arrest Disruptive Passengers Who Force easyJet Flight To Make Emergency Landing: ఈమధ్య విమానాల్లో విచిత్రమైన ఘటనలు చోటు చేసుకోవడం తరచూ వింటూనే ఉన్నాం. ఇప్పుడు ఇద్దరు ప్యాసింజర్లు ఒక విమానంలో నానారాద్ధాంతం సృష్టించి, ఆ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించి, చివరికి పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు. విమానం గాల్లో ఉన్నప్పుడు.. అసురక్షితంగా భావించడం వల్లే వాళ్లు ఈ రచ్చకు పాల్పడినట్టు తేలింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఏప్రిల్ 19వ తేదీన బుధవారం ఈజీజెట్ ఎయిర్లైన్స్కు చెందిన EZY3409 ఫ్లైట్.. లివర్పూల్ నుంచి టర్కీలోని దలమాన్కు బయలుదేరింది. ఆ విమానం టేకాఫ్ అయిన గంట వరకూ.. పరిస్థితులు సజావుగానే ఉన్నాయి. కానీ.. గంట గడిచిన తర్వాత అసలు రచ్చ మొదలైంది.
Ex-Boyfriend Acid Attack: పెళ్లిలో షాకింగ్ ఘటన.. వరుడిపై యువతి యాసిడ్ దాడి
Also Read
- Canada: నడిరోడ్డుపై భారతీయులు డ్యాన్స్లు.. నెట్టింట తీవ్ర వివాదం
- Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
- Vladimir Putin: "మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు".. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
- Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
ఆ విమానంలో ఉన్న ఇద్దరు ప్రయాణికులు.. ఆ ప్రయాణం అసురక్షితమని భావించి, గోల చేయడం మొదలుపెట్టారు. ఈ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలంటూ హంగామా సృష్టించారు. విమానంలో ఉన్న సిబ్బంది వారిని ఎంత సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా.. వాళ్లు వినిపించుకోకుండా తమ గోల తమదే అన్నట్టు రచ్చ రచ్చ చేశారు. క్యాబిన్ సిబ్బంది సైతం జోక్యం చేసుకోవాలని ప్రయత్నించింది. కానీ.. పరిస్థితులు మరీ చెయ్యి దాటిపోవడంతో, పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. మ్యూనిచ్లో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి ముందు.. విమానంలో గోల చేసిన ఆ ఇద్దరు ప్రయాణికుల గురించి అధికారులకు సమాచారం అందించాడు. దీంతో.. ఆ ఫ్లైట్ ల్యాండ్ అయిన మరుక్షణమే పోలీసులు లోపలికి వెళ్లి, ఆన్బోర్డ్లో విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించిన ఆ ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Portofino: అందమైన ప్రదేశం.. కానీ సెల్ఫీలు నిషేధం.. అతిక్రమిస్తే..
కేవలం ఆ ఇద్దరినే కాదు.. ఈ ఘటనతో సంబంధం కలిగి ఉన్న మరో 12 మందిని కూడా అరెస్ట్ చేశారు. వీరిని అందుబాటులో ఉన్న మరో విమానంలో ఎక్కించి, యూకేకి తరలించారు. అయితే.. ఎవరైతే విమానంలో రచ్చ చేసి, ప్రయాణానికి అంతరాయం కలిగించారో, ఆ ఇద్దరి ప్రయాణికుల వివరాల్ని ఇంకా బయటపెట్టలేదు. ప్రయాణికుల భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా వెంటనే సముచితంగా వ్యవహరించేలా తమ క్యాబిన్ సిబ్బంది శిక్షణ పొందారంటూ.. ఈజీనెట్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : పాలమూరు వెనుకబాటుతనానికి గత ప్రభుత్వమే కారణం..
-
Accident: ఐపీఎల్ ఫైనల్ తర్వాత ఘోర ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ మాజీ కెప్టెన్ ..
-
Tamil Nadu: ఇక విజయ్-ఉదయనిధి-అన్నామలై చుట్టే తమిళ రాజకీయాలు..
-
Sanjay Malhotra: భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది.. ఆందోళన అక్కర్లేదన్న ఆర్బీఐ గవర్నర్
-
విద్యార్థులకు గుడ్న్యూస్.. విడుదలైన TG PGECET 2026 ఫలితాలు.!
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!