EasyJet Flight: అత్యవసర ల్యాండింగ్ చేయించారు.. అడ్డంగా బుక్ అయ్యారు
Police Arrest Disruptive Passengers Who Force easyJet Flight To Make Emergency Landing: ఈమధ్య విమానాల్లో విచిత్రమైన ఘటనలు చోటు చేసుకోవడం తరచూ వింటూనే ఉన్నాం. ఇప్పుడు ఇద్దరు ప్యాసింజర్లు ఒక విమానంలో నానారాద్ధాంతం సృష్టించి, ఆ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించి, చివరికి పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు. విమానం గాల్లో ఉన్నప్పుడు.. అసురక్షితంగా భావించడం వల్లే వాళ్లు ఈ రచ్చకు పాల్పడినట్టు తేలింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఏప్రిల్ 19వ తేదీన బుధవారం ఈజీజెట్ ఎయిర్లైన్స్కు చెందిన EZY3409 ఫ్లైట్.. లివర్పూల్ నుంచి టర్కీలోని దలమాన్కు బయలుదేరింది. ఆ విమానం టేకాఫ్ అయిన గంట వరకూ.. పరిస్థితులు సజావుగానే ఉన్నాయి. కానీ.. గంట గడిచిన తర్వాత అసలు రచ్చ మొదలైంది.
Ex-Boyfriend Acid Attack: పెళ్లిలో షాకింగ్ ఘటన.. వరుడిపై యువతి యాసిడ్ దాడి
Also Read
- Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
- Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
- Trump: ‘‘ఆ..చెత్తంతా చదవొద్దు’’.. జర్నలిస్ట్పై ట్రంప్ ఆగ్రహం
- Sheikh Yusuf Afridi: ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో దుండగుల కాల్పులు.. లష్కర్-ఎ-తోయిబా అగ్ర కమాండర్ షేక్ అఫ్రిది హతం
ఆ విమానంలో ఉన్న ఇద్దరు ప్రయాణికులు.. ఆ ప్రయాణం అసురక్షితమని భావించి, గోల చేయడం మొదలుపెట్టారు. ఈ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలంటూ హంగామా సృష్టించారు. విమానంలో ఉన్న సిబ్బంది వారిని ఎంత సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా.. వాళ్లు వినిపించుకోకుండా తమ గోల తమదే అన్నట్టు రచ్చ రచ్చ చేశారు. క్యాబిన్ సిబ్బంది సైతం జోక్యం చేసుకోవాలని ప్రయత్నించింది. కానీ.. పరిస్థితులు మరీ చెయ్యి దాటిపోవడంతో, పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. మ్యూనిచ్లో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి ముందు.. విమానంలో గోల చేసిన ఆ ఇద్దరు ప్రయాణికుల గురించి అధికారులకు సమాచారం అందించాడు. దీంతో.. ఆ ఫ్లైట్ ల్యాండ్ అయిన మరుక్షణమే పోలీసులు లోపలికి వెళ్లి, ఆన్బోర్డ్లో విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించిన ఆ ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Portofino: అందమైన ప్రదేశం.. కానీ సెల్ఫీలు నిషేధం.. అతిక్రమిస్తే..
కేవలం ఆ ఇద్దరినే కాదు.. ఈ ఘటనతో సంబంధం కలిగి ఉన్న మరో 12 మందిని కూడా అరెస్ట్ చేశారు. వీరిని అందుబాటులో ఉన్న మరో విమానంలో ఎక్కించి, యూకేకి తరలించారు. అయితే.. ఎవరైతే విమానంలో రచ్చ చేసి, ప్రయాణానికి అంతరాయం కలిగించారో, ఆ ఇద్దరి ప్రయాణికుల వివరాల్ని ఇంకా బయటపెట్టలేదు. ప్రయాణికుల భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా వెంటనే సముచితంగా వ్యవహరించేలా తమ క్యాబిన్ సిబ్బంది శిక్షణ పొందారంటూ.. ఈజీనెట్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
తాజావార్తలు
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
-
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!