EasyJet Flight: అత్యవసర ల్యాండింగ్ చేయించారు.. అడ్డంగా బుక్ అయ్యారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Police Arrest Disruptive Passengers Who Force easyJet Flight To Make Emergency Landing: ఈమధ్య విమానాల్లో విచిత్రమైన ఘటనలు చోటు చేసుకోవడం తరచూ వింటూనే ఉన్నాం. ఇప్పుడు ఇద్దరు ప్యాసింజర్లు ఒక విమానంలో నానారాద్ధాంతం సృష్టించి, ఆ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించి, చివరికి పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు. విమానం గాల్లో ఉన్నప్పుడు.. అసురక్షితంగా భావించడం వల్లే వాళ్లు ఈ రచ్చకు పాల్పడినట్టు తేలింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఏప్రిల్ 19వ తేదీన బుధవారం ఈజీజెట్ ఎయిర్లైన్స్కు చెందిన EZY3409 ఫ్లైట్.. లివర్పూల్ నుంచి టర్కీలోని దలమాన్కు బయలుదేరింది. ఆ విమానం టేకాఫ్ అయిన గంట వరకూ.. పరిస్థితులు సజావుగానే ఉన్నాయి. కానీ.. గంట గడిచిన తర్వాత అసలు రచ్చ మొదలైంది.
Ex-Boyfriend Acid Attack: పెళ్లిలో షాకింగ్ ఘటన.. వరుడిపై యువతి యాసిడ్ దాడి
Also Read
- Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
- Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
ఆ విమానంలో ఉన్న ఇద్దరు ప్రయాణికులు.. ఆ ప్రయాణం అసురక్షితమని భావించి, గోల చేయడం మొదలుపెట్టారు. ఈ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలంటూ హంగామా సృష్టించారు. విమానంలో ఉన్న సిబ్బంది వారిని ఎంత సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా.. వాళ్లు వినిపించుకోకుండా తమ గోల తమదే అన్నట్టు రచ్చ రచ్చ చేశారు. క్యాబిన్ సిబ్బంది సైతం జోక్యం చేసుకోవాలని ప్రయత్నించింది. కానీ.. పరిస్థితులు మరీ చెయ్యి దాటిపోవడంతో, పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. మ్యూనిచ్లో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి ముందు.. విమానంలో గోల చేసిన ఆ ఇద్దరు ప్రయాణికుల గురించి అధికారులకు సమాచారం అందించాడు. దీంతో.. ఆ ఫ్లైట్ ల్యాండ్ అయిన మరుక్షణమే పోలీసులు లోపలికి వెళ్లి, ఆన్బోర్డ్లో విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించిన ఆ ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Portofino: అందమైన ప్రదేశం.. కానీ సెల్ఫీలు నిషేధం.. అతిక్రమిస్తే..
కేవలం ఆ ఇద్దరినే కాదు.. ఈ ఘటనతో సంబంధం కలిగి ఉన్న మరో 12 మందిని కూడా అరెస్ట్ చేశారు. వీరిని అందుబాటులో ఉన్న మరో విమానంలో ఎక్కించి, యూకేకి తరలించారు. అయితే.. ఎవరైతే విమానంలో రచ్చ చేసి, ప్రయాణానికి అంతరాయం కలిగించారో, ఆ ఇద్దరి ప్రయాణికుల వివరాల్ని ఇంకా బయటపెట్టలేదు. ప్రయాణికుల భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా వెంటనే సముచితంగా వ్యవహరించేలా తమ క్యాబిన్ సిబ్బంది శిక్షణ పొందారంటూ.. ఈజీనెట్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
తాజావార్తలు
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..