Pak-Afghan: పాక్-ఆప్ఘన్ మధ్య చర్చలు మళ్లీ విఫలం.. యుద్ధం తప్పదా?
- పాక్-ఆప్ఘన్ మధ్య చర్చలు మళ్లీ విఫలం
- యుద్ధం తప్పదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్-ఆప్ఘనిస్థాన్ మధ్య చర్చలు మళ్లీ విఫలం అయ్యాయి. ఇస్తాంబుల్ వేదికగా రెండు దేశాల మధ్య శాంతి చర్చలు జరిగాయి. కానీ ఎలాంటి పురోగతి లేకుండా చర్చలు ముగిశాయి. రెండు దేశాల మధ్య శాంతి చర్చలు విఫలం అయ్యాయని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రకటించారు. ఇక చర్చల ప్రారంభానికి ముందు ఖవాజా మాట్లాడుతూ.. ఈసారి మాత్రం చర్చలు విఫలమైతే యుద్ధం తప్పదని హెచ్చరించారు. తాజాగా మరోసారి అదే విషయాన్ని ప్రస్తావిస్తూ సరిహద్దులో దాడులు కొనసాగితే పాకిస్థాన్ ప్రతిస్పందిస్తుందని వార్నింగ్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Mali: మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్.. ఐసిస్ గ్రూప్పై అనుమానాలు
Also Read
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
- XI Jinping: జిన్పింగ్కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్కు.?
వ్రాతపూర్వక ఒప్పందంపై సంతకం చేయడానికి తాలిబన్ ప్రతినిధి బృందం నిరాకరించిందని.. మౌఖిక అవగాహన కోసం పట్టుబట్టడంతో అకస్మాత్తుగా చర్చలు ముగిశాయని ఖవాజా తెలిపారు. ఇస్తాంబుల్లో రెండు రోజుల పాటు చర్చలు జరుగుతాయని భావించాం కానీ.. అర్థాంతరంగా ముగిశాయని చెప్పారు.
ఇది కూడా చదవండి: Trump: అమెరికా నిరసన.. దక్షిణాఫ్రికా జీ 20 సదస్సుకు ట్రంప్ గైర్హాజరు
గత కొంతకాలంగా పాకిస్థాన్-ఆప్ఘనిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. సరిహద్దులో ఇరు పక్షాలు దాడులు చేసుకోవడంతో ప్రాణనష్టం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఖతార్, టర్కీ మధ్యవర్తిత్వం వహించి ఇరు పక్షాలతో శాంతి చర్చలు జరిపేందుకు పూనుకున్నాయి. ఇటీవల దోహాలో చర్చలు జరిగాయి. ఈ చర్చలకు కూడా సఫలీకృతం కాలేదు. తాజాగా ఇస్తాంబుల్ వేదికగా జరిగిన చర్చలు కూడా అకస్మాత్తుగా ముగిశాయి. దీంతో పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చాయి.
ఇది కూడా చదవండి: Off The Record: వైసీపీ కమ్మ రాగాన్ని కొత్త శృతిలో పాడబోతోందా..? ఇంతకీ ఏం చేయబోతుంది పార్టీ..?
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!