Pakistan: హిందూ బాలిక కిడ్నాప్పై సింధ్ ప్రభుత్వ ఉన్నత స్థాయి విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pak’s Sindh govt orders high-level probe as abducted Hindu girl: పాకిస్తాన్ లో ఇటీవల కిడ్నాపుకు గురైన 14 ఏళ్ల హిందూ బాలిక ఆచూకీ ఇంకా తెలియలేదు. దీంతో పాకిస్తాన్ సింధు ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. సింధు ప్రావిన్సులోని హైదరాబాద్ నగరంలోని ఫతే చౌక్ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో బాలికను కిడ్నాప్ చేశారు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో సింధ్ ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది.
హైదరాబాద్ మరియు మీర్పూర్ఖాస్ లో గత వారం కిడ్నాపులకు గురైన ఇద్దరు హిందూ బాలికల ఘటనలకు సంబంధించి విచారణ జరుపుతున్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. గత 15 రోజుల్లో నలుగురు హిందూ బాలికలు, యువతులు కిడ్నాపులకు గురయ్యారు. కిడ్నాప్ తరువాత బలవంతంగా పెళ్లి చేసి, మతం మారుస్తున్నారు. ముఖ్యంగా సింధ్ ప్రావిన్సులో ఈ కిడ్నాపుల ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. రెండు నెలల క్రితం ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుకు చెందిన ఓ సిక్కు మహిళా ఉపాధ్యాయురాలిని ఇలాగే కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుని మతం మార్చారు. ఈ ఘటనపై పాకిస్తాన్ లో ఉన్న సిక్కులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
Also Read
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Donald Trump: ట్రంప్ మైండ్లో ఒబామా 'రెంట్ ఫ్రీ' సూట్.. వయసు తప్పులో కాలేసి బుక్కయిన అమెరికా ప్రెసిడెంట్!
- DUBAI: గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ సర్వనాశనం.. దుబాయ్ను నిండా ముంచేసిన ఇరాన్!
- Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!
Read Also: Cabinet Meeting: రైల్వే ఉద్యోగులకు బోనస్.. చమురు మార్కెటింగ్ కంపెనీలకు వన్ టైం గ్రాంట్
సెప్టెంబర్ 24న మీనా మేఘ్వాల్ం అనే 14 ఏళ్ల బాలిను నాసర్ పూర్ ప్రాంతంలో కిడ్నాప్ చేశారు. మిర్పుర్ఖాస్ పట్టణంలో ఇంటికి తిరిగివస్తుండగా మరో బాలికను కిడ్నాప్ చేశారు. అదే పట్టణంలో రవీ కుర్మీ అనే హిందూ వ్యక్తి భార్య రాఖీని కిడ్నాప్ చేసి ముస్లిం మతానికి చెందిన వ్యక్తితో వివాహం చేసి, బలవంతంగా మతం మార్చారు. సదరు మహిళకు అప్పటికే పెళ్లై ఇద్దరు సంతానం ఉన్నారు.
ఇటీవల కిడ్నాపుకు గురైన ఓ బాలిక స్థానిక కోర్టులో మాట్లాడుతూ.. తనను వివాహం చేసుకున్న ముస్లిం వ్యక్తి బలవంతంగా కిడ్నాప్ చేసి, మతాన్ని మార్చాడాని వెల్లడించింది. అంతకుముందు సుక్కూర్ పట్టణంలో హిందూ యువతి పెళ్లికి నిరాకరించడంతో ముస్లిం వ్యక్తి కాల్చి చంపాడు. పాకిస్తాన్ లో మైనారిటీలు అయిన హిందువులు, సిక్కులు, క్రైస్తవులపై తరుచు దాడులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా బాలికలను స్త్రీలను టార్గెట్ చేస్తున్నారు. పలు అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ లో మైనారిటీ హక్కుల గురించే మాట్లాడే పాకిస్తాన్.. తన దేశంలోని మైనారిటీలను పట్టించుకోవడం లేదు.
తాజావార్తలు
-
OG 2: ‘ఓజీ’ యూనివర్స్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్.. సుజీత్ ప్లాన్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
-
PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
-
Donald Trump: ట్రంప్ మైండ్లో ఒబామా ‘రెంట్ ఫ్రీ’ సూట్.. వయసు తప్పులో కాలేసి బుక్కయిన అమెరికా ప్రెసిడెంట్!
-
Tilak Varma: వైస్ కెప్టెన్ అయితే స్థానం పదిలం అనుకుంటున్నావా..? తిలక్ వర్మపై ఘాటు వ్యాఖ్యలు..
-
HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!