Pakistan: రుణం కోసం మళ్లీ ఐఎంఎఫ్కు పాకిస్తాన్.. ఈసారి ఏకంగా..!
- పాకిస్తాన్ కు మరోసారి ఐఎంఎఫ్ నిధులు..
- 2025 ద్వితీయార్థంలో నిధులు కేటాయింపులు..
- పాక్ అధికారులతో ఐఎంఎఫ్ ప్రతినిధులు భేటీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తగ్గుతున్న విదేశీ నిల్వలు, స్థానిక కరెన్సీ పతనం కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్కు అంతర్జాతీయ ద్రవ్య నిధి మరోసారి సహాయం చేసేందుకు రెడీ అయింది. దీంతో పాక్ లో పడిపోతున్న ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టవచ్చు అని అభిప్రాయ పడింది. అయితే ఇప్పటికే, ఇస్లామాబాద్ లో తమ సిబ్బంది పర్యటనను పూర్తి చేసినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా, 2026 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదన, ఆర్థిక విధానం, నిధుల ద్వారా జరుగుతున్న సంస్కరణలపై పాకిస్తాన్ అధికారులతో చర్చించారు. రాబోయే రోజుల్లో బడ్జెట్పై ఏకాభిప్రాయానికి రావడానికి పాక్ అధికారులతో చర్చలు కొనసాగించినట్లు ఐఎంఎఫ్ వెల్లడించింది.
Read Also: Pawan Kalyan: తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతున్న ప్రెస్ నోట్..!
Also Read
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
- Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
ఇక, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ యొక్క మధ్యకాలిక లక్ష్య పరిధి 5-7 శాతం లోపల ద్రవ్యోల్బణాన్ని స్థిరంగా ఉంచడమే తమ ప్రధాన లక్ష్యమని అంతర్జాతీయ ద్రవ్య నిధి తెలిపింది. ఇస్లామాబాద్ లో కొనసాగుతున్న ఆర్థిక స్థిరీకరణ ప్రయత్నాలపై దృష్టి పెట్టడమే దీని ఉద్దేశ్యం అని చెప్పుకొచ్చింది. ఇక, పాకిస్తాన్ అధికారులు కూడా దేశ ఆదాయాన్ని సరిగ్గా వినియోగించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. దీంతో అక్కడి ప్రభుత్వం 2026 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ మిగులును 1.6 శాతం దగ్గర కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి, పెద్ద ఎత్తున ఆర్థిక స్థిరత్వాన్ని కలిగి ఉండడం అవసరం. కాగా, ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి వినియోగం కంటే ఎక్కువగా ఉంటేనే జీడీపీలో మిగులు ఏర్పడుతుంది.
Read Also: Groom Kidnapped: పెళ్లి వేదికపై కలకలం.. పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేసిన డ్యాన్స్ టీమ్..!
అయితే, అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఇటీవల పాకిస్తాన్కు ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ కింద $1 బిలియన్ ఆర్థిక సహాయం అందించింది. దీంతో పాటు వాతావరణం వల్ల కలిగిన నస్టాన్ని పూరించడానికి $1.4 బిలియన్ల నిధులు కూడా ఇచ్చింది. దీంతో పాకిస్తాన్ మరోసారి నిధుల సమీక్ష 2025 ద్వితీయార్థంలో జరుగుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి కూడా ధృవీకరించింది.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!