Pakistan: రుణం కోసం మళ్లీ ఐఎంఎఫ్కు పాకిస్తాన్.. ఈసారి ఏకంగా..!
- పాకిస్తాన్ కు మరోసారి ఐఎంఎఫ్ నిధులు..
- 2025 ద్వితీయార్థంలో నిధులు కేటాయింపులు..
- పాక్ అధికారులతో ఐఎంఎఫ్ ప్రతినిధులు భేటీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తగ్గుతున్న విదేశీ నిల్వలు, స్థానిక కరెన్సీ పతనం కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్కు అంతర్జాతీయ ద్రవ్య నిధి మరోసారి సహాయం చేసేందుకు రెడీ అయింది. దీంతో పాక్ లో పడిపోతున్న ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టవచ్చు అని అభిప్రాయ పడింది. అయితే ఇప్పటికే, ఇస్లామాబాద్ లో తమ సిబ్బంది పర్యటనను పూర్తి చేసినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా, 2026 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదన, ఆర్థిక విధానం, నిధుల ద్వారా జరుగుతున్న సంస్కరణలపై పాకిస్తాన్ అధికారులతో చర్చించారు. రాబోయే రోజుల్లో బడ్జెట్పై ఏకాభిప్రాయానికి రావడానికి పాక్ అధికారులతో చర్చలు కొనసాగించినట్లు ఐఎంఎఫ్ వెల్లడించింది.
Read Also: Pawan Kalyan: తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతున్న ప్రెస్ నోట్..!
Also Read
- Russia: ప్రపంచానికి షాక్ ఇచ్చిన పుతిన్ 'అణు' బాంబ్.. 'సర్మాట్' క్షిపణితో సర్ప్రైజ్!
- Bangladesh: బెంగాల్లో ముస్లింకు ఏమైనా జరిగితే, బంగ్లాదేశ్లో హిందువుల్ని వదిలిపెట్టం..
- Iran Nuclear Warning: అమెరికాకు ఇరాన్ అల్టిమేటం.. 'మాపై చేయి వేస్తే.. అణు విలయమే!'
- Israel-Hezbollah: హిజ్బుల్లా అండర్గ్రౌండ్ను గుర్తించిన ఐడీఎఫ్.. వీడియో విడుదల
ఇక, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ యొక్క మధ్యకాలిక లక్ష్య పరిధి 5-7 శాతం లోపల ద్రవ్యోల్బణాన్ని స్థిరంగా ఉంచడమే తమ ప్రధాన లక్ష్యమని అంతర్జాతీయ ద్రవ్య నిధి తెలిపింది. ఇస్లామాబాద్ లో కొనసాగుతున్న ఆర్థిక స్థిరీకరణ ప్రయత్నాలపై దృష్టి పెట్టడమే దీని ఉద్దేశ్యం అని చెప్పుకొచ్చింది. ఇక, పాకిస్తాన్ అధికారులు కూడా దేశ ఆదాయాన్ని సరిగ్గా వినియోగించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. దీంతో అక్కడి ప్రభుత్వం 2026 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ మిగులును 1.6 శాతం దగ్గర కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి, పెద్ద ఎత్తున ఆర్థిక స్థిరత్వాన్ని కలిగి ఉండడం అవసరం. కాగా, ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి వినియోగం కంటే ఎక్కువగా ఉంటేనే జీడీపీలో మిగులు ఏర్పడుతుంది.
Read Also: Groom Kidnapped: పెళ్లి వేదికపై కలకలం.. పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేసిన డ్యాన్స్ టీమ్..!
అయితే, అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఇటీవల పాకిస్తాన్కు ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ కింద $1 బిలియన్ ఆర్థిక సహాయం అందించింది. దీంతో పాటు వాతావరణం వల్ల కలిగిన నస్టాన్ని పూరించడానికి $1.4 బిలియన్ల నిధులు కూడా ఇచ్చింది. దీంతో పాకిస్తాన్ మరోసారి నిధుల సమీక్ష 2025 ద్వితీయార్థంలో జరుగుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి కూడా ధృవీకరించింది.
తాజావార్తలు
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
-
NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
-
Russia: ప్రపంచానికి షాక్ ఇచ్చిన పుతిన్ ‘అణు’ బాంబ్.. ‘సర్మాట్’ క్షిపణితో సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!