Pakistan: రుణం కోసం మళ్లీ ఐఎంఎఫ్కు పాకిస్తాన్.. ఈసారి ఏకంగా..!
- పాకిస్తాన్ కు మరోసారి ఐఎంఎఫ్ నిధులు..
- 2025 ద్వితీయార్థంలో నిధులు కేటాయింపులు..
- పాక్ అధికారులతో ఐఎంఎఫ్ ప్రతినిధులు భేటీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తగ్గుతున్న విదేశీ నిల్వలు, స్థానిక కరెన్సీ పతనం కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్కు అంతర్జాతీయ ద్రవ్య నిధి మరోసారి సహాయం చేసేందుకు రెడీ అయింది. దీంతో పాక్ లో పడిపోతున్న ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టవచ్చు అని అభిప్రాయ పడింది. అయితే ఇప్పటికే, ఇస్లామాబాద్ లో తమ సిబ్బంది పర్యటనను పూర్తి చేసినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా, 2026 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదన, ఆర్థిక విధానం, నిధుల ద్వారా జరుగుతున్న సంస్కరణలపై పాకిస్తాన్ అధికారులతో చర్చించారు. రాబోయే రోజుల్లో బడ్జెట్పై ఏకాభిప్రాయానికి రావడానికి పాక్ అధికారులతో చర్చలు కొనసాగించినట్లు ఐఎంఎఫ్ వెల్లడించింది.
Read Also: Pawan Kalyan: తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతున్న ప్రెస్ నోట్..!
Also Read
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
- Ukarine War: ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, జిన్పింగ్ సాయం.. ట్రంప్కు షాకిస్తూ రష్యా కీలక ప్రకటన..
- UK Break-Up: యూకే విడిపోతుందా? స్వాతంత్య్రం కోసం స్కాట్కాంట్, వేల్స్, ఐర్లాండ్ రిఫరెండం!
- BRICS: మోడీ విందుకు జిన్పింగ్ డుమ్మా.. కారణం ఏంటంటే..?
ఇక, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ యొక్క మధ్యకాలిక లక్ష్య పరిధి 5-7 శాతం లోపల ద్రవ్యోల్బణాన్ని స్థిరంగా ఉంచడమే తమ ప్రధాన లక్ష్యమని అంతర్జాతీయ ద్రవ్య నిధి తెలిపింది. ఇస్లామాబాద్ లో కొనసాగుతున్న ఆర్థిక స్థిరీకరణ ప్రయత్నాలపై దృష్టి పెట్టడమే దీని ఉద్దేశ్యం అని చెప్పుకొచ్చింది. ఇక, పాకిస్తాన్ అధికారులు కూడా దేశ ఆదాయాన్ని సరిగ్గా వినియోగించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. దీంతో అక్కడి ప్రభుత్వం 2026 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ మిగులును 1.6 శాతం దగ్గర కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి, పెద్ద ఎత్తున ఆర్థిక స్థిరత్వాన్ని కలిగి ఉండడం అవసరం. కాగా, ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి వినియోగం కంటే ఎక్కువగా ఉంటేనే జీడీపీలో మిగులు ఏర్పడుతుంది.
Read Also: Groom Kidnapped: పెళ్లి వేదికపై కలకలం.. పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేసిన డ్యాన్స్ టీమ్..!
అయితే, అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఇటీవల పాకిస్తాన్కు ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ కింద $1 బిలియన్ ఆర్థిక సహాయం అందించింది. దీంతో పాటు వాతావరణం వల్ల కలిగిన నస్టాన్ని పూరించడానికి $1.4 బిలియన్ల నిధులు కూడా ఇచ్చింది. దీంతో పాకిస్తాన్ మరోసారి నిధుల సమీక్ష 2025 ద్వితీయార్థంలో జరుగుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి కూడా ధృవీకరించింది.
తాజావార్తలు
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
-
India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
-
Ganesh Idol Protest: ‘వినాయకుడి’తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
-
New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
-
AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!