Pakistan: పాక్ వైమానిక స్థావరంపై దాడి.. 9 మంది టెర్రరిస్టుల మృతి, 3 విమానాలు ధ్వంసం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లోని మియాన్వాలి వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు భారీ దాడికి తెగబడ్డారు. తెల్లవారుజామున 9 మంది సాయుధ ఉగ్రవాదులు దాడి చేశారు. సైన్యానికి, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 9 మంది టెర్రరిస్టులు హతమయ్యారు. పాకిస్తాన్ వ్యాప్తంగా అంతకుముందు రోజు జరిగిన టెర్రర్ అటాక్స్లో 17 మంది మరణించిన, తర్వాత రోజే ఈ దాడి జరిగింది.
పాక్ ఎయిర్ బేస్పై జరిగిన దాడిలో మూడు నాన్ ఆపరేషనల్ ఎయిర్క్రాఫ్టులు ధ్వంసమైనట్లు పాక్ ఆర్మీ ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే పాక్ ఎయిర్ ఫోర్స్కి చెందిన ఎలాంటి నష్టం జరగలేదని తెలిపింది. తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP)కి అనుబంధంగా కొత్తగా ఉద్భవించిన ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఇ-జిహాద్ పాకిస్తాన్ (TJP) ఈ దాడికి పాల్పడినట్లు మీడియా ప్రకటనలో బాధ్యత వహించింది. ఈ దాడిని పాక్ తాత్కాలిక ప్రధాని అన్వర్ ఉల్ హక్ కాకర్ ఖండించారు. ‘‘ మా భద్రతను దెబ్బతీసే ఏ ప్రయత్నమైన తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటుంది’’ అని హెచ్చరించారు.
Also Read
- Cannes: కేన్స్ ఫెస్టివల్స్లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
- Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- Cockroach Trend Goes Global: పాకిస్థాన్కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్లో "కాక్రోచ్" పేరుతో కొత్త పార్టీలు..
- Chinese Alcohol: బీరు కాదు.. విస్కీ అసలే కాదు.. చైనీస్ శతాబ్దాలుగా తాగే మద్యం ఏంటి? దాని ప్రత్యేక ఏంటి?
ఈ దాడికి కొన్ని గంటల ముందే బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో జరిగిన వరస ఉగ్రదాడుల్లో 17 మంది పాక్ సైనికులు మరణించారు. బలూచిస్తాన్ లోని గ్వాదర్ జిల్లాలోని ఒర్మారా ప్రాంతానికి పస్ని నుంచి భద్రతా బలగాలు వెళ్తున్న సమయంలో ఉగ్రవాదులు మెరుపుదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 14 మంది పాక్ సైనికులు మరణించారు. గ్వాదర్ దాడికి కొన్ని గంటల ముందు, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో పోలీసులు మరియు భద్రతా దళాల కాన్వాయ్లను లక్ష్యంగా చేసుకుని వరుస బాంబు పేలుళ్లలో ఒక సైనికుడు మరియు మరో ఐదుగురు మరణించారు మరియు 24 మంది గాయపడ్డారు. అదే ప్రావిన్స్లోని లక్కీ మార్వాట్ జిల్లాలో జరిగిన మరో దాడిలో ఇద్దరు సైనికులు మరణించారు.
నవంబర్ 2022లో పాక్ తాలిబాన్ల, పాక్ ప్రభుత్వానికి మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ముగిసినప్పటి నుంచి పాకిస్తాన్ లో వరసగా దాడులకు తెగబడుతోంది. ముఖ్యంగా బలూచ్ ప్రాంతంలో పాక్ ఆర్మీకి, పోలీసులకు గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటు తాలిబాన్లు దాడులు చేస్తుంటే, మరోవైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన పోరాటయోధులు పాక్ ఆర్మీని, పాక్ ఆస్తుల్ని లక్ష్యంగా చేసుకుంటూ దాడులు చేస్తున్నారు. పాక్ ప్రభుత్వం ప్రకారం.. 2023 నుంచి మొదటి తొమ్మిది నెలల్లో కనీసం 386 మంది భద్రతా సిబ్బంది మరణించారు.
తాజావార్తలు
-
IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
-
GPS, 5ATM వాటర్ రెసిస్టెన్స్, 110+ పైగా స్పోర్ట్స్ మోడ్లతో Realme Watch S5 ఎంట్రీ.!
-
Natural Hair Tonic : పలుచటి జుట్టుకు గుడ్బై.. ఇంట్లోనే తయారయ్యే మ్యాజికల్ హెయిర్ టానిక్.!
-
Cabbage Egg Sandwich : కొరియన్ స్ట్రీట్ స్టైల్ ‘క్యాబేజీ ఎగ్ శాండ్విచ్’.. 5 నిమిషాల్లో పిల్లల లంచ్ బాక్స్ కోసం సూపర్ రెసిపీ.!
-
Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!