Site icon NTV Telugu

Debate: పాక్ ప్ర‌ధాని బంప‌ర్ ఆఫ‌ర్‌… మోడీతో డిబేట్‌కు రెడీ…

ఇండియా పాకిస్తాన్ దేశాల మ‌ధ్య చాలా కాలంగా పరిష్కారం కాకుండా ఉన్న స‌మ‌స్య‌లు ఎన్నో ఉన్నాయి. కాశ్మీర్ స‌మ‌స్య‌, నీటి వన‌రుల స‌మ‌స్య‌లు ఇలా ఎన్నో ఉన్నాయి. 1947లో భార‌త్‌కు స్వాతంత్య్రం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఈ స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాకుండా ఉండిపోయాయి. రెండుదేశాలు ద్వైపాక్షికంగా ఎన్నోసార్లు చ‌ర్చించుకున్నా ప‌రిష్కారం కాలేదు. కాశ్మీర్‌కు సంబంధించిన ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేసిన త‌రువాత పాక్‌తో సంబంధాలు మ‌రింత దిగ‌జారాయి. పాక్ ఉగ్ర‌వాద చ‌ర్య‌ల‌కు స్వ‌స్తి ప‌లికితేనే ఆ దేశంలో చ‌ర్చ‌లు జ‌రుపుతామ‌ని ఇండియా ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసింది.

Read: Diamond: ఇసుక‌బ‌ట్టీ ఓన‌ర్… రాత్రికి రాత్రే ఇలా… అదృష్టం అంటే ఇదే…

ఇక ఇదిలా ఉంటే, పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ భార‌త్‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు. భార‌త ప్ర‌ధానితో టీవీ డిబేట్‌లో పాల్గొనాల‌ని ఉంద‌ని, ఈ డిబేట్ ద్వారా రెండు దేశాల మ‌ధ్య నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌కు ఒక ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని ఆశిస్తున్నాన‌ని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. ఇటీవ‌లే ర‌ష్యాటుడే న్యూస్ ఛాన‌ల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంత‌ర్వ్యూలో భార‌త్‌, పాక్ సంబంధాల‌పై అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఈ విధంగా స‌మాధానం ఇచ్చారు. పీఎం మోడీ రెడీ అంటే తాను సిద్దంగా ఉన్నాన‌ని, టీవీ ఛాన‌ల్ డిబేట్‌లో పాల్గొన‌డం ద్వారా రెండు దేశాల మ‌ధ్య నెల‌కొన్న సంబంధాలు కొంత‌మేర మెరుగుప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని పాక్ పీఎం పేర్కొన్నారు. మ‌రి దీనిపై ప్ర‌ధాని ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Exit mobile version