Pakistan: ఖైబర్ పఖ్తుంఖ్వాపై పాక్ వైమానిక దాడులు.. 30 మంది పౌరులు మృతి
- ఖైబర్ పఖ్తుంఖ్వాపై పాక్ వైమానిక దాడులు
- 30 మంది పౌరులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖైబర్ పఖ్తుంఖ్వా గ్రామంపై పాక్ వైమానిక దళం బాంబుల వర్షం కురిపింది. 8 బాంబులు వేయడంతో 30 మంది మృతి చెందారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు, పిల్లలే ఉన్నారు. తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) రహస్య స్థావరాలు లక్ష్యంగా పాక్ వైమానిక దళాలు దాడి చేయగా.. గ్రామస్థులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులెవరూ కూడా చనిపోలేదు. చనిపోయిన వారందరూ పౌరులే ప్రాణాలు కోల్పోయారు.
ఇది కూడా చదవండి: Supreme Court: దురదృష్టకరం.. ఎయిరిండియా ప్రమాద కథనాలపై సుప్రీంకోర్టు వ్యాఖ్య
Also Read
- Iran-Israel Tensions: మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు..
- Philippines Earthquake: ఫిలిప్పీన్స్లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
- Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
- Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
ఇటీవలి రోజుల్లో ఖైబర్ పఖ్తుంఖ్వా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న పర్వత ప్రావిన్స్లో ఉగ్రవాదులు దాక్కున్నట్లు సమాచారం అందింది. దీంతో పాక్ సైన్యం చర్యలు చేపట్టింది. అర్ధరాత్రి 2 గంటలకు ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేయగా సామాన్యులు ప్రాణాలు వదిలారు. స్థానిక మీడియా ప్రకారం చాలా మంది గాయపడ్డారని నివేదించింది. అయితే వారి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు ఉన్నట్లు భావిస్తున్నారు. రెస్క్యూ బృందాలు వెలికితీస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Nitin Gadkari: బ్రాహ్మణులకు రిజర్వేషన్లు లేకపోవడం దేవుడు నాకిచ్చిన అతిపెద్ద వరం
ఆదివారం డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో నిఘా ఆధారిత ఆపరేషన్లో ఏడుగురు టీటీపీ ఉగ్రవాదులు హతమైనట్లు సైన్యం ప్రకటించింది. ఏడుగురిలో ముగ్గురు ఆఫ్ఘన్ జాతీయులు, ఇద్దరు ఆత్మాహుతి బాంబర్లు ఉన్నారని సైన్యం మీడియా విభాగం ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) ఒక ప్రకటనలో తెలిపింది. సెప్టెంబర్ 13-14 తేదీల్లో ఖైబర్ పఖ్తుంఖ్వాలో జరిగిన రెండు వేర్వేరు కాల్పుల్లో కనీసం 31 మంది టీటీపీ ఉగ్రవాదులు మరణించారు.
ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు షాక్.. నేడు ఎంత పెరిగిందంటే..!
ఖైబర్ పఖ్తుంఖ్వాలో గత కొంతకాలంగా ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అనేక మంది పౌరులు మరణించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో జూన్లో ఖైబర్ పఖ్తుంఖ్వాలో జరిగిన డ్రోన్ దాడుల్లో పౌరులు ప్రాణాలు కోల్పోయారు. తాజా దాడుల్లో ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పౌరుల ప్రాణాలను, ఆస్తులను రక్షించడానికి పాకిస్థాన్ అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు.
ఖైబర్ పఖ్తుంఖ్వా పోలీసుల ప్రకారం. ఈ ఏడాది జనవరి- ఆగస్టు మధ్య జరిగిన దాడుల్లో కనీసం 138 మంది పౌరులు, 79 మంది పాకిస్థానీ పోలీసు సిబ్బంది మరణించారు. ఆగస్టులో మాత్రమే 129 సంఘటనలు నమోదయ్యాయి. వీటిలో ఆరుగురు పాకిస్థాన్ ఆర్మీ, పారామిలిటరీ ఫెడరల్ కాన్స్టాబులరీ సిబ్బంది హత్యలకు గురయ్యారు.
తాజావార్తలు
-
Kangana Ranaut : నర్స్లను గ్లామర్ వృత్తిగా మార్చేశారు… డ్రెస్ కోడ్పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్
-
Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీని వీడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!