Pakistan: ఖైబర్ పఖ్తుంఖ్వాపై పాక్ వైమానిక దాడులు.. 30 మంది పౌరులు మృతి
- ఖైబర్ పఖ్తుంఖ్వాపై పాక్ వైమానిక దాడులు
- 30 మంది పౌరులు మృతి
ఖైబర్ పఖ్తుంఖ్వా గ్రామంపై పాక్ వైమానిక దళం బాంబుల వర్షం కురిపింది. 8 బాంబులు వేయడంతో 30 మంది మృతి చెందారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు, పిల్లలే ఉన్నారు. తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) రహస్య స్థావరాలు లక్ష్యంగా పాక్ వైమానిక దళాలు దాడి చేయగా.. గ్రామస్థులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులెవరూ కూడా చనిపోలేదు. చనిపోయిన వారందరూ పౌరులే ప్రాణాలు కోల్పోయారు.
ఇది కూడా చదవండి: Supreme Court: దురదృష్టకరం.. ఎయిరిండియా ప్రమాద కథనాలపై సుప్రీంకోర్టు వ్యాఖ్య
Also Read
- China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
- WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు
- Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
- Indonesia: ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ.. నలుగురు మృతి
ఇటీవలి రోజుల్లో ఖైబర్ పఖ్తుంఖ్వా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న పర్వత ప్రావిన్స్లో ఉగ్రవాదులు దాక్కున్నట్లు సమాచారం అందింది. దీంతో పాక్ సైన్యం చర్యలు చేపట్టింది. అర్ధరాత్రి 2 గంటలకు ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేయగా సామాన్యులు ప్రాణాలు వదిలారు. స్థానిక మీడియా ప్రకారం చాలా మంది గాయపడ్డారని నివేదించింది. అయితే వారి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు ఉన్నట్లు భావిస్తున్నారు. రెస్క్యూ బృందాలు వెలికితీస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Nitin Gadkari: బ్రాహ్మణులకు రిజర్వేషన్లు లేకపోవడం దేవుడు నాకిచ్చిన అతిపెద్ద వరం
ఆదివారం డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో నిఘా ఆధారిత ఆపరేషన్లో ఏడుగురు టీటీపీ ఉగ్రవాదులు హతమైనట్లు సైన్యం ప్రకటించింది. ఏడుగురిలో ముగ్గురు ఆఫ్ఘన్ జాతీయులు, ఇద్దరు ఆత్మాహుతి బాంబర్లు ఉన్నారని సైన్యం మీడియా విభాగం ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) ఒక ప్రకటనలో తెలిపింది. సెప్టెంబర్ 13-14 తేదీల్లో ఖైబర్ పఖ్తుంఖ్వాలో జరిగిన రెండు వేర్వేరు కాల్పుల్లో కనీసం 31 మంది టీటీపీ ఉగ్రవాదులు మరణించారు.
ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు షాక్.. నేడు ఎంత పెరిగిందంటే..!
ఖైబర్ పఖ్తుంఖ్వాలో గత కొంతకాలంగా ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అనేక మంది పౌరులు మరణించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో జూన్లో ఖైబర్ పఖ్తుంఖ్వాలో జరిగిన డ్రోన్ దాడుల్లో పౌరులు ప్రాణాలు కోల్పోయారు. తాజా దాడుల్లో ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పౌరుల ప్రాణాలను, ఆస్తులను రక్షించడానికి పాకిస్థాన్ అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు.
ఖైబర్ పఖ్తుంఖ్వా పోలీసుల ప్రకారం. ఈ ఏడాది జనవరి- ఆగస్టు మధ్య జరిగిన దాడుల్లో కనీసం 138 మంది పౌరులు, 79 మంది పాకిస్థానీ పోలీసు సిబ్బంది మరణించారు. ఆగస్టులో మాత్రమే 129 సంఘటనలు నమోదయ్యాయి. వీటిలో ఆరుగురు పాకిస్థాన్ ఆర్మీ, పారామిలిటరీ ఫెడరల్ కాన్స్టాబులరీ సిబ్బంది హత్యలకు గురయ్యారు.
తాజావార్తలు
-
Shruti Haasan: ఆ దర్శనం తర్వాత నా జీవితమే మారిపోయింది..
-
AshuReddy Audio Leaks : అషు రెడ్డి ఆడియో కాల్స్ లీక్.. నా మాట వినకుంటే అంతే సంగతులని వార్నింగ్
-
China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
-
Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
-
CM Chandrababu: ఏపీ చరిత్రలో ఇది మరిచిపోలేని రోజు.. గూగుల్ రాక గేమ్ ఛేంజర్..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!