Pakistan: పాక్ యూనివర్సిటీలో సంస్కృతం, మహాభారతం.. మీరు వింటున్నది నిజమే..
- పాకిస్తాన్లో కీలక పరిణామం..
- పాక్ వర్సిటీలో సంస్కృతం, మహాభారతం కోర్సులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్లో మనం ఎప్పుడూ ఊహించదని జరిగింది. విభజన తర్వాత తొలిసారిగా పాకిస్తాన్ యూనివర్సిటీలో సంస్కృతం, మహాభాతరం-గీతా పాఠాలు వినిపించాయి. లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్ (LUMS) లో సంస్కృతాన్ని అధికారిక కోర్సుగా ప్రారంభించింది. మూడు నెలల పాటు జరిగిన సంస్కృత వర్క్షాప్కు వచ్చిన అసాధారణ స్పందన వచ్చినట్లు వర్సిటీ చెప్పింది. దీంతో ఇప్పుడు దీనిని యూనివర్సిటీ స్థాయి కోర్సుగా మార్చారు. 2027 నాటికి ఇది పూర్తిగా వన్ ఇయర్ కోర్సుగా మారనుంది. విద్యార్థులకు భగవద్గీ శ్లోకాలు, మహాభారత కథనాలను బోధించనున్నారు.
Read Also: Jaish Terrorist Arrested: ఉగ్ర కుట్ర భగ్నం.. సరిహద్దులో జైషే ఉగ్రవాది అరెస్ట్
Also Read
- Iran Nuclear Warning: అమెరికాకు ఇరాన్ అల్టిమేటం.. 'మాపై చేయి వేస్తే.. అణు విలయమే!'
- Israel-Hezbollah: హిజ్బుల్లా అండర్గ్రౌండ్ను గుర్తించిన ఐడీఎఫ్.. వీడియో విడుదల
- Anil Kochhar: అమెరికా యూనివర్శిటీలో సంచలనం.. 176 మంది స్టూడెంట్ లోన్స్ క్లియర్ చేసిన ఇండియన్! ఆయన ఎవరో తెలుసా..
- Bangladesh: ‘‘ముళ్ల కంచెలు మమ్మల్ని ఆపలేవు’’.. సువేందు ప్రకటనపై బంగ్లాదేశ్ ఆగ్రహం..
సంస్కృత పునరుజ్జీవన ప్రయత్నాలకు కేంద్రంగా ఫోర్మాన్ క్రిస్టియన్ కళాశాలలో సోషియాలజీ బోధించే ప్రొఫెసర్ షాహిద్ రషీద్ ఉన్నారని ది ట్రిబ్యూన్లోని ఒక నివేదిక తెలిపింది. దక్షిణాసియా ప్రాంతంలో తత్వశాస్త్రం, సాహిత్యం, ఆధ్యాత్మిక సంప్రదాయాలనున రూపొందించిన భాష అధ్యయానాన్ని పునరుద్ధరించే దిశగా రషీద్ చర్యలు కీలకమని చెప్పారు. సంస్కృతం ఈ ప్రాంతం మొత్తాన్ని కలిపే భాష అని, పాణిని గ్రామం పాకిస్తాన్లోనే ఉందని, సింధూ లోయ నాగరికత కాలంలో చాలా రచనలు జరిగాయని రషీద్ చెప్పారు. ఇది ఏ ఒక్క మతానికి పరిమితం కాదని వెల్లడించారు. సంస్కృత వ్యాకరణవేత్త పాణిని ప్రస్తుతం పాకిస్తాన్లో ఖైబర్ ఫఖ్తుంఖ్వాగా పిలిచే గాంధారలో నివసించారు.
మొదట్లో విద్యార్థులు సంస్కృతాన్ని కష్టంగా భావించారని, అయితే త్వరలోనే దీనికి అలవాటు పడ్డారని, ఉర్దూ భాష సంస్కృతం ద్వారా ఎంతగా ప్రభావితమైందో తెలుసుకుని విద్యార్ధులు ఆశ్చర్యపోయారని అన్నారు. 10-15 ఏళ్లలో పాకిస్తాన్ నుంచి గీత, మహాభారత పండితులు ఏర్పడటం చూడొచ్చని మరో ప్రొఫెసర్ అలీ ఉస్మాన్ ఖాస్మీ అన్నారు.
తాజావార్తలు
-
Iran Nuclear Warning: అమెరికాకు ఇరాన్ అల్టిమేటం.. ‘మాపై చేయి వేస్తే.. అణు విలయమే!’
-
CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు.. సీఎం విజయ్ వైఖరిపై మిత్రపక్షాల్లో ఆగ్రహం..
-
AP Weather: ఏపీలో విభిన్న వాతావరణం.. ఒకవైపు వడగాల్పులు.. మరోవైపు వర్ష సూచన.!
-
Israel-Hezbollah: హిజ్బుల్లా అండర్గ్రౌండ్ను గుర్తించిన ఐడీఎఫ్.. వీడియో విడుదల
-
India message to China: పాకిస్తాన్కు చైనా మద్దతు.. భారత్ గట్టి సందేశం..
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!